Posts

శ్రాద్ధ భోజనము - 1008 కూరలు*

*శ్రాద్ధ భోజనము - 1008 కూరలు* శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము, పనసపండు ఆరు వందల కూరలకు సమానము ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు. దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు. మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు. శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు.  వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది.  వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు. దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు. దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను. మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు. వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు ...

సమత్వాల పరిశీలన

గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో కలసిన శుభుడు) పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు, బుధుడు(పాపులతో కలసిన పాపి). 1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు. 2) చంద్రునకు - రవి, బుధులు మిత్రులు : మిగిలిన వారు బుధ, గురువు, శని, శుక్రులు సములు, శత్రువులు లేరు. 3) కుజునకు - రవి, చంద్ర, గురువులు మిత్రులు : బుధుడు శత్రువు: శని, శుక్రులు సములు. 4) బుధునకు - రవి, శుక్రులు మిత్రులు : చంద్రుడు శత్రువు: కుజ, గురు, శనులు సములు. 5) గురునకు - రవి, చంద్ర కుజులు మిత్రులు : శుక్ర, బుధులు శత్రువులు : శని సముడు. 6) శుక్రునకు - శని, బుధులు మిత్రులు : కుజ, గురులు సములు: రవి, చంద్రుడు శత్రువులు. 7) శనినకు: శుక్ర, బుధులు మిత్రులు : రవి, చంద్ర, కుజులు శత్రువులు : గురుడు సముడు. చంద్రుడికి శత్రువులు లేరు. గురువు ఎవరికి శత్రువు కాదు. కొన్ని అనుమానాలు 1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు. * రవి, శనులు పాపులు కదా పాపులు శత్రువులు ఎలా అయ్యారు? * బ...

పుతిన్‌కు షాక్: ఉక్రెయిన్ డ్రోన్ దాడి

పుతిన్‌కు షాక్: ఉక్రెయిన్ డ్రోన్ దాడి❗  రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుంది... ❓ డోనాల్డ్ ట్రంప్ పుతిన్‌ను హెచ్చరించారు:  మిస్టర్ ప్రెసిడెంట్ పుతిన్... ఒప్పందం కుదరకపోతే రష్యాకు చాలా చెడు జరగబోతోంది.  ఇప్పుడు,  అనుకున్నట్టే జరిగింది... కానీ, ఆయన పుతిన్ కదా...! ఉక్రెయిన్ కూడా గాజాగా మారబోతోందని తెలుస్తోంది.. పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటాడు...  మిగిలిన కథనాన్ని 👇👇 చదవండి... రష్యా యుద్ధ ప్రాంతంలో 4200 కిలోమీటర్లు వెళ్లి ఉక్రెయిన్ ఐదు పెద్ద వైమానిక స్థావరాలను నాశనం చేసిన విధానం ఒక సైనిక అద్భుతం కంటే తక్కువ కాదు. 70 కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు ఒకేసారి ధ్వంసమయ్యాయి మరియు ప్రతిదీ ఆత్మాహుతి మిషన్ ద్వారా జరిగింది. ఉక్రెయిన్ కార్గో ట్రక్కులలో తప్పుడు పైకప్పులను ఏర్పాటు చేసింది, వాటిలో వందలాది GPS గైడెడ్ డ్రోన్‌లను అమర్చింది మరియు రిమోట్-ఓపెనింగ్ పైకప్పులను తయారు చేసింది. రష్యన్ వైమానిక స్థావరం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని ముందుగానే ఆ డ్రోన్‌లలోకి చేర్చారు. ఎటువంటి అనుమానం రాకుండా ఉండటానికి పాలు, బియ్యం వంటి వస్తువులను ట్రక్కుల పైన లోడ్ చేశారు. ఈ ట్రక్కులను నడుపుతున్న వ్యక్తులు...

శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!!

జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!! శని కలిగించే వ్యాధులు :- శని వాత సంబంధ వ్యాధు లను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి , డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. శని సూర్యుని తో కలిస్తే బలహీనమైన దృష్టి, జీవితమంతా కష్టాలు, ప్రభుత్వం లేక ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన, తండ్రితో, పై అధికారులతో సమస్యలు కలిగిస్తాడు. ఉద్యోగం సంపాదించడం కష్టమౌతుంది, ఒకవేళ సంపాదించిన చెడ్డపేరు, అధిక ఖర్చులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఉంటుంది. శని చంద్రుడితో కలిస్తే మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి , తలనొప్పి , బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. కుజుడితో కలిసిన రక్త సమస్యలు, కండరాల నొప్పి, కండరాల జబ్బులు, పళ్ళ నొప్పి, పళ్ళు కుళ్ళిపోవుట సూచిస్తాడు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దు...

సరస్వతీ నది పుష్కరాలు

సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుంచి మే 15 నుంచి మే 26వ తేదీ వరకు పుష్కరాలు. భారతదేశ చరిత్ర, పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. నేటి నుండి ఈ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.  భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని.. సమస్యలు తీరుతాయని నమ్ముతాం.  మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతీ నది.  రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో "అంబితమే, నదీతమే, దేవీతమే" (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత) గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు. సరస్వతీ నది జన్మస్థలం.. ప్రవాహ తీరం.. సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై.. భారతదేశంలోని అనేక రాష్ట్రాల గు...

శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచం

🌹 శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచ🌹 *దేవీభాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట ...*  దేవీపురాణంలో వారాహిదేవిని వరహాజనని ,   క్రితంత తనుసంభవ(మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి ) గా కూడా వర్ణించేరు ...  వారాహి దేవి వాహనం యెనుము ,  పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది. ఈమెను కైవల్యరూపిణి ,వైవస్వతి అని కూడా అంటారు. ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .. వారాహి దేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం ,కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర, స్వాధిష్ఠాన ,మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .. ! *వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.* అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః –అనుష్టుప్ ఛందః  శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా –  హుం బీజం –...

ప్రమధ గణాలు

*ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ..?*  'ప్రమథ' అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు.  వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .." అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు.  మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.  అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:  🌷వీరభద్రుడు: 🌷 దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు.  సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.  🌷ఆది వృషభం: 🌷 ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టిక...