Posts

శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!!

జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం శని గ్రహం ఇతర గ్రహాలు కలయిక వలన వచ్చే వ్యాధులు...........!! శని కలిగించే వ్యాధులు :- శని వాత సంబంధ వ్యాధు లను సూచిస్తాడు. కీళ్ళ వాతం, పక్షవాతం, బలహీనత, నొప్పులు, కిడ్ని లివర్ మొదలైన వాటిలో రాళ్ళు ఏర్పడుట, క్షయ, దగ్గు, ఆస్త్మా, న్యుమోనియా, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు, అజీర్ణ వ్యాధులు, పని చేయలేని అశక్తి , డ్రగ్స్ అలవాటు మొదలైన వాటికి కారకుడు. శని సూర్యుని తో కలిస్తే బలహీనమైన దృష్టి, జీవితమంతా కష్టాలు, ప్రభుత్వం లేక ప్రభుత్వ అధికారులతో, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన, తండ్రితో, పై అధికారులతో సమస్యలు కలిగిస్తాడు. ఉద్యోగం సంపాదించడం కష్టమౌతుంది, ఒకవేళ సంపాదించిన చెడ్డపేరు, అధిక ఖర్చులు, ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేకపోవడం ఉంటుంది. శని చంద్రుడితో కలిస్తే మతి భ్రమణం, పిచ్చి, వాతం, గుండె నొప్పి, కండరాల నొప్పి , తలనొప్పి , బద్దకం, నీరసం మొదలైనవి సూచిస్తాడు. కుజుడితో కలిసిన రక్త సమస్యలు, కండరాల నొప్పి, కండరాల జబ్బులు, పళ్ళ నొప్పి, పళ్ళు కుళ్ళిపోవుట సూచిస్తాడు. బుధుడితో కలిసిన మాటలు సరిగా రాకుండుట, నత్తి, నాలుక మొద్దుబారటం, మెదడు మొద్దు...

సరస్వతీ నది పుష్కరాలు

సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుంచి మే 15 నుంచి మే 26వ తేదీ వరకు పుష్కరాలు. భారతదేశ చరిత్ర, పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. నేటి నుండి ఈ నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.  భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని.. సమస్యలు తీరుతాయని నమ్ముతాం.  మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతీ నది.  రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో "అంబితమే, నదీతమే, దేవీతమే" (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత) గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు. సరస్వతీ నది జన్మస్థలం.. ప్రవాహ తీరం.. సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై.. భారతదేశంలోని అనేక రాష్ట్రాల గు...

శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచం

🌹 శ్రీ వారాహి దేవి - సర్వ శత్రు వినాశని - కవచ🌹 *దేవీభాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట ...*  దేవీపురాణంలో వారాహిదేవిని వరహాజనని ,   క్రితంత తనుసంభవ(మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి ) గా కూడా వర్ణించేరు ...  వారాహి దేవి వాహనం యెనుము ,  పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది. ఈమెను కైవల్యరూపిణి ,వైవస్వతి అని కూడా అంటారు. ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .. వారాహి దేవి వరాహముఖం అనగా పంది ముఖం కలిగి , చక్రం ,కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది. లలితాసహస్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది. వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర, స్వాధిష్ఠాన ,మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .. ! *వారాహి దేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తి అవుతాయి.* అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య – దూర్వాసో భగవాన్ ఋషిః –అనుష్టుప్ ఛందః  శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా –  హుం బీజం –...

ప్రమధ గణాలు

*ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ..?*  'ప్రమథ' అంటే బాగా మథించగలిగే వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు.  వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .." అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు.  మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.  అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:  🌷వీరభద్రుడు: 🌷 దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు.  సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.  🌷ఆది వృషభం: 🌷 ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టిక...

ASTROLOGY PREDICTIONS

ASTROLOGY PREDICTIONS ON NATURAL CALAMITIES LIKE EARTHQUAKES, CYCLONES ETC IN COMING DATES                                 ------------------------------------------------ 1)  15-5-2025 to 26-5-2025 :  Earthquake, Low Pressure Rains, Political disturbances, Many untoward incidents etc possible.  Affecting signs:  Pisces, Taurus, Virgo, Sagattarius. 2)  7-6-2025 or 10-6-2025 to 8-7-2025 :  Strong Earthquake with magnitude 7 or 7+ or even high is possible.  Cyclones,  political disturbances, Many untoward incidents etc possible.  Affecting signs:  Pisces, Taurus, Virgo, Sagattarius. 3)  9-7-2025 , 10-7-2025, 11-7-2025:  Earthquakes, Low Pressure Rains may continue upto 28-7-2025.  Affecting signs:   Pisces, Taurus, Virgo, Sagattarius. 4) 6-10-2025 to 16-10-2025 :  Earthquakes, Cyclone rains, Political disturbances , Indication...

చంద్రుడు శుభుడు

క్షీణ చంద్రుడు పాపి పాపులు 3,6,11 స్థానాల్లో పాపులు శుభులు పైగా 3,6,11 స్థానాల్లో లేని గ్రహాలు ఉపచయాల్లో ఫ్యూచర్ అభివృద్ధి స్థానాలు అందుకే శుక్ల పక్షంలో 2,5,9 కృష్ణ పక్షం లో 4,8,12 స్థానాల్లో చంద్రుడు శుభాన్నే ఇస్తాడు అందుకే ఉభయ పక్షాల్లో 1,3,6,7,10,11 లో చంద్రుడు శుభుడు

digital strength

As you rightly pointed out, Moon does not have digital strength on the 3rd day after Amavasya. It means one source of strength attributable to Moon is not there. However, to know the real strength, one shall calculate it collectively.  In the present case, though Moon didn't have digital strength, it has sthana bala being placed in exaltation sign, conjunct with beneficial Jupiter. Your point was how bahula tritiya was accepted for muhurta. Point here, I think is that Moon came out of asthangata being more than 30 degrees aeay from Sun. The Moon is waxing Moon and always auspicious, though it has a bit low on digital (paksha) strength. But Moon has strong positional (sthana) strength, and Jupiter's samagama in Taurus in GajaKesari yoga enhances the combination strength multifolds.