సౌందర్య రహస్యం
మహిళలు నిత్యం అందంగా ఉండేందుకు, మిలామిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్యయవ్వనం కోసం, . కానీ, శారీరక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు. నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుందట. కొద్ది నీటిలో పదిచుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిపి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటే మంచి ఫలితం
. సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, ఫ్రూట్స్ సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెపుతున్నారు. కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారుగా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని నిపుణులు వైద్యులు చెపుతున్నారు.
గుండె అనారోగ్య ఫలితంగా వచ్చే పక్షవాతం వంటివి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటంతో పాటు ఆక్సిడేటివ్ అంశం తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ కారణాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుందని కాఫీ సేవనం వల్ల దూరమవుతాయి.
సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినడం వలన మూత్రంలో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుంది.
శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది.
నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి
రక్తం శుభ్రపడటానికి, నరాలకు బలం చేకూరటాని ఉపకరిస్తుంది.
శరీర లావణ్యం వెనుక పసుపు.
పసుపు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.
- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే శరీర లావణ్యాన్ని పెంచుతుంది.
- ఎక్కువ సేపు నీటిలోఉంటే పాదాలు నాని పగుళ్ళు, లేక ఒరుసుకు పోవడం జరుగుతుంది. పసుపు రాసుకుంటే యాంటీ సెప్టిక్గా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది.
- ఆముదంలో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పూసుకొని పదినిమిషాల తర్వాత సబ్బుతో రుద్దుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరంపై ఉన్న మచ్చలు, దురద, చర్మవ్యాధులు అన్ని తగ్గిపోతాయి.
1.
నాగ కేసరాలు
తామర పూల రేకులు
కలువ పూల రేకులు
పండిన మర్రి ఆకులు
అతి మధురం
మంజిష్ట
మాను పసుపు
లక్క
కుంకుమ పూవు
లొద్దుగ
పైన తెలిపిన వాటిని సమభాగాలుగా కలిపి మంచి నీటితో మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని, ముఖానికి పూస్తూ ఉంటే, ముఖం తిరుగులేని అందాన్ని సంతరించుకుంటుంది.
2.
తామర పూలు
కలువ పూలు
రేగి గింజల పప్పు
చందనం
మాని పసుపు
వీటిని సమభాగాలుగా మంచి నీళ్ళతో మెత్తగా నూరి ముఖానికి మర్ధనా చేసుకుంటూ ఉంటే ముఖం బంగారువర్ణమగును.
మొటిమలు తగ్గడానికి :
ముందుగా దాల్చిన చెక్కని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమంగా చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుముఖం పడుతాయి.
నిమ్మరసం ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే, దానికి బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. చెంచా దాల్చిన చెక్క పొడికి మూడు చెంచాలా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. అలా రాంత్రంతా ఉంచి పొద్దున్న లేవగానే శుభ్రం చేసుకోవచ్చు. ఒక వేళ అలా ఇబ్బంది అనుకున్న వారు అప్లై చేసుకున్న 20నిముషాల తర్వాత శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ విధంగా వారానికోసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.
Comments
Post a Comment