Posts

Showing posts from September, 2019

తారాబలం చూడటం ఎలా?

తారాబలం చూడటం ఎలా? తారాబలం చూడటం ఎలా?    ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.   ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.   1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా.... 1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార. ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.  ఆ 27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.  పైవాటిలో  సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తా

ముహూర్తమునకుగ్రహగతులే ముఖ్యమా ?

ముహూర్తమునకుగ్రహగతులే ముఖ్యమా ? మనము ఏ కార్యానికైతే ముహూర్తాన్ని నిర్ణయిద్దామని అనుకుంటామో అంటే అక్షరాభ్యాసమా, ఉపనయనమా, వివాహమా, వ్యాపారమా, గ్రుహప్రవేశమా ఏమైనా కావచ్చు ఒకొక్క కార్యానికి ముహర్త భాగములో ఒకొక్క భావము పర్జిక్యులర్గా శుద్ధిగా ఉండాలని ఉంటుంది. అలాగే ఆకార్యానికి సంబంధించిన కారక గ్రహములు భావాధిపతులు లగ్నస్థితి ఇవన్ని డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంటాయి. ముహూర్తాన్నిబిట్టి అవి మారుతూ ఉంటాయి. అలాగే కార్యాన్ని బట్టి తారలను ఎంచుకొనవచ్చు. కాన్ని సందర్భాలలో క్షేమతార, కాన్ని సందర్భాలలో సాధనతార, కాన్ని సందర్భాలలో మిత్రతార, తీసుకుంటాము. అలాగే చంద్రబలాన్ని కూడా భేరీజు వేసుకుంటాము. ఒకాయన ముహూర్తానికి ప్రత్యక్ తార లేదా విపత్తార ఉంది ఎలా అంటాడు. ఎదో ఊహించేయటమే. ముహూర్తమునకు స్వక్షేత్రగతుడయి ఉన్న చంద్రునివలన విపత్తార, ప్రత్యక్ తారల దోషములు హరించును. మరియు విపత్తార, ప్రత్యక్ తారలకు చంద్రబిలము బాగున్నచో తార దోషమ పరిహారము అగును. అందుచేతనే వివాహాది శుభముహూర్తములకు తారాబలముకన్నా చంద్రబలమే ముఖ్యముగా చూచెదరు. అట్లుకానప్పడు ప్రథమనవకంలో జన్మతార ద్వితీయ నవకంలో వివత్తార, తృతీయ నవకంలో ప్రత్యక్ తార మూడు నవక

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విదేశీయానం.. ఎవ‌రికి.. ఎప్పుడు ఎలా కలుగును?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విదేశీయానం.. ఎవ‌రికి.. ఎప్పుడు ఎలా కలుగును? టెక్నాల‌జీ పెరిగిపోతున్న ఈ కాలంలో మ‌న దేశ యువ‌త దూసుకుపోతోంది. అన్ని దేశాల్లోనూ, అన్ని రంగాల్లోనూ మ‌న యువ‌త ముందుంటున్నారు. మ‌న వారికి విదేశాల్లో మంచి డిమాండ్ కూడా పెరుగుతోంది.  దీంతో విదేశాలకు వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరులోను పెరుగుతోంది. దీనికి తగ్గట్టే ఉపాదికి తగ్గ  విద్యను ఇక్కడే ఆర్జిస్తున్నారు. ఉద్యోగం కాకపోయిన విద్యా కోసమైన విదేశాలకు వెళ్ళాలని ఆశించేవారు చాలా మంది ఉన్నారు. అయితే అందరు వెళ్ళగలుగుతున్నారా, అందరికి అలాంటి అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది వారి వారి జాతకాలను బట్టి ఉంటుంది. ఏయే గ్రహాలు జాత‌కుడిని విదేశీయానం వైపుకి తీసుకుపోతాయో పరిశీలిద్దాం. దూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించే వారు పూర్వ‌కాలంలో జ‌ల యానం చేసే వారు. అంటే నౌక‌ల ద్వారా త‌మ గ‌మ్యం చేరుకునే వాళ్లు. అప్ప‌టి కాలంలో విమానయానం లేదు కాబట్టి. జలయానం చేయాలంటే జల రాశులైన కర్కాటకం, మీనం, వృశ్చిక రాశులతో పాటు చంద్రబలం కూడా ఉండితీరాలి. ఇప్పుడు విమాన ప్రయాణాలు పెరిగాయి. దీనికి వాయుతత్వ రాశులైన మిధున, కుంభ, తుల రాశుల యొక్క ప్రభావం అధికమని చెప్పవచ్చును. ద

🌹రాశి లగ్నాలు జాతకుల లక్షణాలు🌹

Image
🌹రాశి లగ్నాలు జాతకుల లక్షణాలు🌹 🌹రాశి లగ్నాలు  జాతకుల లక్షణాలు🌹 మేషలగ్నములో జన్మించినవారి లక్షణాలు మేషలగ్నములో జన్మించినవారు రూపవంతులు, విద్యానిపుణులు, వినయము గలవారు. కుటుంబ  సభ్యులపై అభిమానము చూపుదురు. చురుకైన తత్వమూ, వాడి నేత్రములు, కోప స్వభావము, తామస గుణము వన విలాస ప్రీతి అందరు తన స్వాదీనములో ఉండాలనే కోరిక, దీర్ఘ కాల శత్రువులు ఉంటారు. గొప్ప దైర్యము, అధికమైన ఆశ. అధిక ధనము, మంచి భోజన ప్రియులు వీరు. వీరిలో కోప స్వభావం కనిపిస్తుంది. వృషభ లగ్నములో జన్మించినవారి లక్షణాలు దేవతలను, గురువులను, పూజించు గుణము కలిగి ఉంటారు. క్షత్రియ స్వభావము, స్వల్పసంతానము, దర్పములలో రాజసము శాంతమైన బుద్ది కలిగి ఏ పనైనను బుద్ది బలంతో సాధిస్తారు. ఆరోగ్యం, ఆనందంతో జీవిస్తారు. వీరు భోజనప్రియులు. కార్యశూరులు, శ్రమకోర్చి పనులు నెరవేర్చువారు కాగలరు. మృదు స్వభావం కలిగి ఉంటారు. కామా వాంఛ అధికంగా ఉంటుంది. మిధున లగ్నములో జన్మించినవారి లక్షణాలు బంధు ప్రీతి, దయాగుణము, ఊహాలలో తేలిపోయే స్వభావం వీరిది. పట్టనపట్టు విడువక పూర్తిగావించుచుందురు. అన్నివేళలా మిత్రులకు సహకరింతురు. నూతన పరిశోధనలను చేయుచుందురు. ఇక వీరు ఆరోగ

దశ మహావిద్యలు - ఫలితాలు

#దశ మహావిద్యలు - ఫలితాలు తొలి మహా విద్య కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. 2 వ మహా విద్య దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. 3 వ మహా విద్య అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉ

శ్రీరామచంద్రుని వనవాసకాలం

శ్రీరామచంద్రుని వనవాసకాలం 1వ రోజున చైత్ర శుద్ధ దశమినాడు వనవాస ప్రయాణo. రాత్రి తమసాతీర వాసము. 2వ రోజున జాహ్నవీ తీరవాసము - గుహుని రాక. 3వ రోజున గంగా దక్షిణ తీర తరువు క్రింద సేద. 4వ రోజున ప్రయాగలో భరద్వాజ దర్శనము. 5వ రోజున యమునాతీర వాసము,చిత్రకూట ప్రవేశము. 6న  సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చుట, రాత్రికి దశరధుని మృత్యువు. 7న కౌసల్యాదుల విలాపము. భరతునికై దూతలను పంపుట. 8వ రోజునుండి 12వ రోజువరకు భరతుని అయోధ్యా ప్రయాణము. 13వ రోజున పౌరలౌకిక కర్మ. 14వ రోజునుండి 17వ రోజువరకు వనమార్గము బాగు చేయుట. 18వ రోజునుండి 20వ రోజువరకు భరతుని వన ప్రయాణము. 21నుండి 23వ రోజువరకు భరతుడు రాముని వద్దనుండుట. 24వ రోజునుండి 27 వరకు భరతుడు అయోధ్యకు పాదుకలతో తిరిగి వచ్చుట. 45వ రోజున పాదుకా పట్టాభిషేకము. శ్రీరాముడు చిత్రకూటమున పదిన్నర మాసములుండెను. మొదటి సంవత్సరము ఇట్లు గడిచెను. పిదప చిత్రకూటము విడచి దండాకారణ్యమున ప్రవేశించి ఋషుల ఆశ్రమములను చూచుచూ గడిపినవి 10సంవత్సరములు. ఆ తర్వాత పంచవటిలో ఒకటిన్నర సంవత్సరములు. ఈ విధముగా పన్నెండున్నర సంవత్సరములు పూర్తి అయ్యెను. 13వ సంవత్సరము కొంచెము మిగిలి ఉందనగా మాఘశుద

మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే

మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందు