దుర్వాగణపతి వ్రతం

దుర్వాగణపతి వ్రతం

రేపు గురువారం ఆగస్టు 12వ తేదీ శ్రావణ శుద్ధ చవితి అనగా దుర్వా గణపతి వ్రతము

'దుర్వాంకురము ' లనగా గరిక చిగుళ్ళు. వీటితో గణపతిని పూజిస్తారు. శ్రీ మహా గణపతి యొక్క దుర్వా గణపతి వ్రతము ఈ విధంగా చేయవలెను. ' శ్రావణ శుద్ధ చవితి ' నాడు దుర్వా గణపతి వ్రతము చేయుదురు.

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు వ్రాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి, (బియ్యపు పిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని, చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

🌺 పూజకు కావలసిన వస్తువులు :-* 🌺

దీపారాధన విధానము :
దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలో వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనె గాని, కొబ్బరి నూనె గాని, ఆవు నెయ్యి గాని వాడ వచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచ పాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించ రాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని, చెంబు గాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.

🌺🌺 దుర్వా గణపతి పూజకు కావలసిన వస్తువులు :* 🌺🌺

విఘ్నేశ్వరుని బొమ్మ (తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తీసుకొనవలెను.)

పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గి పెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్నోపవీతములు, ముఖ్యముగా 
గరిక చిగుళ్ళు నైవేద్యము కొరకు ప్రత్యేక పదార్దములు.
యజమానులు (పూజ చేసేవారు) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.

1. "ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు 
తీసుకొని లోనికి తీసుకోవాలి
2. "ఓం నారాయణాయ స్వాహా" అనుకొని ఒకసారి
3. "ఓం మాధవాయ స్వాహా" అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను. తరువాత
4. "ఓం గోవిందాయ నమః" అని చేతులు కడుగు కోవాలి.
5 . "విష్ణవే నమః" అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి.
6. "ఓం మధుసూదనాయ నమః" అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
7. "ఓం త్రివిక్రమాయ నమః" క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.
8 ,9 ."ఓం వామనాయ నమః" "ఓం శ్రీధరాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి.
10. ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి.
11. ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి.
12. ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను.
13. ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14. ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను.
15.16. ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, నేత్రాలు తాకవలెను.
17.18. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, రెండు చెవులూ తాక వలెను.
19.20. ఓం నార సింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, బొడ్డును స్పృశించ వలెను.
21. ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం, హృదయం తాకవలెను.
22. ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను.
23.24. ఓం హరయే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను, ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి, వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను.

Durva Ganapathi Vrutham, విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలోను " గరిక (గడ్డి) " పత్రం అంటే విఘ్నేశ్వరునికి అమిత ఇష్టము .

గరికతో పూజిస్తాం గనుక ఈ స్వామిని దూర్వాగణపతి అని కూడా పిలుస్తారు. ఈ స్వామిని అర్చించేటపుడు జంట గరికపోచల తో ఇరవై ఒక్కసార్లు పూజించాలన్న నియమము ఉన్నది.

యమధర్మరాజు కుమారుడు అనలాసుదుడు. ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు. అందువల్ల ఆయన శరీరము నుంచి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి.

అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్ధించాడు. గణపతి అనలాసురుడిని తన బొటన వేలితో నలిపి ఉండలా చుట్టి చటుక్కన మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడంవల్ల విఘ్నేశ్వరుని ఉదరములో అమితమైన వేడి పుట్టింది. గణపతిని ఈ పత్రితో పూజిస్తే శనిదోషం తొలగిపోతుంది!

దాంతో ఆయన బొజ్జలో వివరీతమైన తాపము పుట్టింది. దేవతలు ఆయన భాదను చూడలేక నీటితోను, అమృతంతోను ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. నివారణ కోసము ఈశ్వరుని ప్రార్ధించగా …... అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను.

సంస్కృతములో గరికను " దూర్వరం " అంటారు. శివుడు ఇచ్చిన సూచనతో గణపతి తాపము వెటనే చల్లారిపోయింది.

శ్రావణమాసంలో వచ్చే బహుళ చతుర్ధి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించడం సర్వ విఘ్నహరం. ఈ నామాలు మహా విశేష ఫలప్రదమైనవి. నిరంతరం పఠించిన శుభములు కలుగును. 

విఘ్నేశ్వరుణునికి గరిక (గడ్డి) పత్రం అంటే మహాప్రీతి. దూర్వా గణపతి వ్రతంనాడు స్వామిని 21 రకాల గరికతో పూజించడం వలనే 'దూర్వా గణపతి' అంటారు.

ఈ వ్రత విధానంలో 21 నామాలతో వినాయకుణ్ణి అర్చించి 21 ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించాలి.
1. ఓం గజననాయ నమః
2. ఓం గణపతయే నమః
3. ఓం హేరంబాయ నమః
4. ఓం ధరణీ ధరాయ నమః
5. ఓం మహా గణపతయా నమః
6. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
7. ఓం క్షిప్రప్రసాదనాయ నమః
8. ఓం అమోఘ సిద్దియే నమః
9. ఓం అమితాయ నమః
10. ఓం మంత్రాయ నమః
11. ఓం చింతామణయే నమః
12. ఓం నిధయే నమః
13. ఓం సుమంగళాయ నమః
14. ఓం బీజాయ నమః
15. ఓం ఆశాపూరకాయ నమః
16. ఓం వరదాయ నమః
17. ఓం శివాయ నమః
18. ఓం శాక్యపాయ నమః
19. ఓం పార్వతీనందాయ నమః
20. ఓం వాక్యతయే నమః
21. ఓం ఢుంఢి వినాయకాయ నమః

దూర్వా గణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖసౌఖ్యాలు.. శుభాలు కలుగుతాయని తెలుస్తుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: