చిత్తైకాగ్రము, ఆహారవిహార నియమము


చిత్తైకాగ్రము, ఆహారవిహార నియమము, ప్రాణా యామాఖ్యాసము, వేద శాస్త్రములు నేర్చుట స్వధర్మానుష్ఠానముచే నీదుర్గతిని తొలగింపజేసికొనగలము.

మన వేధశాస్త్ర విహితమైన ధర్మాచరణముచే చిత్తమాలిన్యము తోలంగును. చిత్త సంస్కారమగు కొలది ధర్మాచరణము ప్రబలును తద్వారా జ్ఞాన వికాసాదులు గలుగగలవు.
అందుచేతనే 'వేదోదితం స్వకంకర్మ నిత్యం కుర్యా దతంద్రితః తద్ధికుర్వన్‌ యధావక్తి ప్రాప్నోతి పరమాంగతి మే అని వ్యాసభగవానులు, వైదిక సాంప్రదాయ సిద్ధమైన, కర్మాచరణము ముఖ్యాతి ముఖ్యమని వచించెను.

ఈ వేదోదితమైన కర్మాచరణముద్వారా ''పరమాంగతిం'' పొందనర్హులగునురని వ్యాసభగవానుల లోకహిత వచనములను బలపరుచుటకై ఆదిశంకర, భగవత్పూజ్య పాదులు సహితము 'వేదో నిత్యమధీయ తాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం|| 
అని, వేదాధ్యయనము వేదమున చెప్పిన కర్మానుష్ఠానము, ముఖ్యాతి ముఖ్యమని వచించెను. ఇన్ని తెలిసిననూ యిప్పుడు మనవల్ల నేమగునులే! యనిగాని, ఎవరో పండితులైనవారే యీ వైదిక కర్మానుష్ఠాన మాచరింపదగిన దనిగాని నిరుత్సాహబడదగదు
అనుగన్తుం సతాంవర్త్మ కృత్స్నంయది నశక్యతే
స్వల్పమవ్యనుగన్తవ్యం మార్గస్థోనావసీదతి|| అను నానుడి చొప్పున వేదచోదితములైన కర్మలను సంపూర్ణముగా నాచరింప శక్తి లేకపోయిన నూ యధాశక్తి నేని ననుసరింప దగును. గారిని వెళ్ళువాడేనాటికేని పడి పోడుగదా!

''వేదో నారాయణః సాక్షాత్‌, తదఖ్యాసే మహా& భ##వేత్‌' అని హేమాద్రియను, యాదవరాజ మహామంత్రి తన థర్మశాస్త్రమున వేద ప్రాముఖ్యమును గూర్చి వచించెను వేదాభ్యాసము చేయువారు మహనీయులని వాకొనెను. కనుకనే, ఆరణ్యకశ్రుతిలో 'బ్రాహ్మణభ్యో వేదవిద్యోదివేదివే నమస్కుర్యాత్‌'' అని గలదు. వెదవేత్తలైన బ్రాహ్మణులను చూచినచో ప్రతిదినము నమస్కరింపుమని పై వేదవాక్కునకు భావము.

కనుకనే ''వేదోఖిలంథర్మమూలమ్‌'' సమస్త ధర్మములకు వేదమే మూలమందురు. ''ధర్మమూలంవేదమాహుః'' అనియు పై విషయమును గూర్చి మరియొక మహనీయుడంగీకరించెను. ఆపస్తంబ మహర్షిపుంగవుడు పైయిరువురి మహాత్ముల భావాలను గూర్చి వివరించుచు ''థర్మజ్ఞసమయః ప్రమాణం వేదాశ్చేతి'' యని వచించెను. ''వేదమూలాః స్మృతయః'' యని శంభుడను ఋషీశ్వరుని వచనము.

అందుచేతనే 'శ్రుతింపశ్యన్తి మునయఃస్మరన్తిచ తదాస్మృతిం| తస్మాత్‌ ప్రమాణముభయం ప్రమాణౖఃప్రమితంభువి అని నుడివిరి, మహర్షులు వేదములలోని థర్మములను స్మరించిరి. ఆ స్మరించ నథర్మములను 'స్మృతులు' అనుపేర వ్రాసిరి. కాన యీ వేదములనదగిన శ్రుతులును. శ్రుతులలో థర్మములను స్మరించి వ్రాసిన స్మృతులును రెండు లోకమానమనవంటి మానవ సామాన్యమునకు ప్రమాణభూతములైనవి యనినిర్ణయించిరి.

కాన ''ప్రమాణాని, ప్రమాణజ్ఞైః పరిపాల్యానియత్నతః| సీదన్తిహి ప్రమాణాని ప్రమాణౖః ఆవ్యవస్థితైః అను రీతిని వేదశాస్త్రముల రెంటిని ప్రయత్నముచేతనేని రక్షించుచుండదగినది, రక్షించడమనగా నందలి థర్మములను యథాశక్తిని ఆచరించుటయే రక్షణమునకు చరితార్థము
ధర్మంశనైఃసంచినుయాత్‌, వల్మీకమివవర్తికా|
పరలోక సహాయార్థం, సర్వభూతాన్యపీడయ&.
ఈ వేదశాస్త్రములలో చెప్పిన సనాతన దర్మములను మనము యధా శక్తిని ఆచరించుచునె యుండదగినది. ఎట్లనగా చీమలు పుట్టను పెట్టి పెంచులాగున ధర్మ వృద్ధిచే మానవునకు కల్గు ఫలములు రెండు. ఒకటి ఈ లోకమున సర్వులకు బాధను కలిగించనట్టి సుఖజీవనము మరొకటి పరలోకమున సుఖ సంతోషములు బడయు సాధన సంపత్తికి కారణము గాగలదు. అందుచేతనే ''ధర్మేణహి సహాయేవ తమస్తరతిదుస్తరమ్‌||'' అనిరి.

 ఎంతటి దుస్తరమైన బాధనుంచియేనియు ధర్మముయొక్క సహాయముతో తరింపగల్గుచుందురు.

కనుక వైదిక ధర్మమునుగూర్చి మన పెద్దలంతగా నాచరించుచు నాచరింపజేయ విథిగ ప్రయత్నించుచు వచ్చిరి. ఎందుకనగా ''ప్రధానం వైదికం కర్మ గుణభూతం తధేతరత్‌ | గుణనిష్ఠః ప్రధానంతు, హిత్వా గచ్ఛత్యధోగతిమ్‌''|| అనియనిరి. వేద ధర్మ ప్రోక్తమైన కర్మాచరణము తుచ్ఛమని మానివేసినచో అధోగతిపాలగుదురేగాని వేరు గతేలేదు. 

అందుచేతనే
''యావైదికమనాదృత్సకర్మ. స్మారేతిహాసకం|
మోహాత్యమాచరే ద్విప్రోనసపుణ్యనయుజ్యతే||''
ఎవరైతే. వేదమార్గ ప్రతిపాదితమైన కర్మలను వదలివేసి అనగా ఆచరించక మాని, అన్యములైన వానిని యాచరింప చూచినచో పుణ్యగతులు లేవనిరి.

శ్రౌతం కర్మనచేచ్ఛక్తఃకర్తుం స్మార్తం సమాచరేత్‌ |
తత్రాప్యశక్తః కరణకుర్యాత్‌ ఆచారమంతతః||
శ్రౌతసంబంధమైన యజ్ఞయాగాదులు చేయుటముఖ్యము. అట్లు చేయ శక్తిహీనులైనచో, స్మృతికర్మలనేని యాచరింపదగుననిరి. ఇవియు చేయనొల్లనిచో ఆచారవంతుడుగనేని మెలంగుచుండవలయుననిరి. 

శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠానములెల్లయు మూఢప్రాయముగ నాచరింపక, వానియొక్క యర్థము నఱింగి యాచరించినచో ఫలాధిక్యముమెండు కాన
''జ్ఞాన యుక్తస్యకర్మణః ఫలాధిక్యం, ఛందోగాః ఆమనన్తి అను నానుడి చొప్పున, వేదదశాస్త్ర సంబంధమైన సంధ్యా వందనాది కర్మలెల్లయు, కాలము - ఫలము అర్థము తెలిసికొని ఆచరించునెడల ఫలాధిక్యముగలదని పెద్దల తలంపు, ఈ యర్థమే ''యదేవ విద్యయాకరోతి తదేవ వీర్య వత్తరంభవతి'' అని పెద్దలు పై శాస్త్ర భావాలకు ప్రమాణముగ నీవేద శ్రుతిని ప్రమాణముగ భావించుచుందురు,
దీనివలన తేలిన సారాంశమేమనగా మానవుడు ఇహపర సాధనార్థమై వైదిక కర్మలాచరించుట విధియనియు, అందులోను, అర్థము తెలిసి కొని యాచరించు నెడల ఫలము మెండనియు తేట తెల్లము. అందుచేతనే
''యజ్ఞానాం తపసాంచైవ శుభానాంచైవ కర్మణాం|
వేదఏవద్విజాతీనాం నిశ్రేయ సకరః పరః||
యజ్ఞానాం - శ్రౌతస్మార్తానాం, తపసాం - కాయసన్తాప రూపాణాం చాంద్రాయణాదీనాం, శుభానాంచ కర్మణాం - ఉపనయనాది సంస్కారాణాం, అవబోధకత్యేన. వేద ఏస ద్విజాతీనాం పరమో - నిశ్రేయ సకరో మోక్షకరోనాన్యః, వేదఏ వెతి తన్మూలత్వేన స్మృతేః అపిఉపలక్షణార్థం ''అను వాఖ్యరీతిని'' శ్రౌతస్మార్తకర్మలకును చాంద్రాయణాది తపస్సులకును, వేదమే ప్రధానము. ఆరీతిని స్మృతులును పదమ ప్రమాణములుగ నొప్పుచుండును.

తవసశ్చ పరస్యెహ నిత్య స్వాధాయవాన్‌ ద్విజః నిత్యము వెదాభ్యాసమొనర్చుచుండునెడల నదియే తపస్సుగ ప్రకాశించగలదు. కాన ''పరస్యచ తపసః చాంద్రాయణాదేః, యత్భలం తదపి నిత్య స్వాధ్యాయ వానా ప్నోతి'' అనవరతము వేదాభ్యాస మొనర్చుచుండునేల, చాంద్రీయణాది తపములచే గల్గు ఫలమెల్ల వేదము పఠించు విప్రునకుగలుగ గలదు.

మఱియు వేదశాస్త్రములయొక్క యాధిక్యమునుగూర్చి యోగవాశిషమున నీరీతి నుగ్గడింపబడియున్నది.
''యదాస్మాత్ర్పాప్యతే శాస్త్రాత్‌ తత్తద్వేదాదవాప్యతే.
అస్మిక్‌ జ్ఞాతే క్రియం జ్ఞానం ద్వయం యాతిపవిత్రతాం శాస్త్రము చేసెద్ది యెరుంగదగునో దానినే వేదముచేతను నెరుంగదగును. కాన వేదశాస్త్రములు రెండు ప్రమాణములు. 

కనుకనే
''దృడ బద్ధ ధర్మమూలః, వేదస్కంధః పురాణ శాఖాఢ్యః
క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపః. జయంతి''
అని ధర్మము మూలము, వేదము స్కంధము, పురాణములు, శాఖలు, యాగములు. పుష్పములు, మోక్షము ఫలము పరమేశ్వరుడు, యీవృక్షమునకు వేరువంటివాడు గాన జయమగుగాక యందురు. అనగా వేద కార్యములచే పొందు ఫలముచే విజయము లభించుగాక యని భావము.

కొందరు కర్మతుచ్ఛము జ్ఞానముమిన్న యను భావముచే కర్మమార్గ ప్రవర్తకులుగాక భ్రష్టులగుచుందురు. అట్టిభావము కలుగకుండుటకై యోగవాశిష్ఠమున
''మోక్షస్య కారణంకర్మ? జ్ఞానంవా? మోక్షసాథనము భయంవా? 
వినిశ్చిత్య ఏకం కథయ కారణమ్‌''|| అను ప్రశ్నకు
''ఉభాభ్యామేవ పక్షాఖ్యాం, యధా, ఖే. వక్షిణాంగతిః
తధైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమంపదయ్‌,
అని మోక్షమునకు కర్మ కారణమా? 
లేక జ్ఞానం కారణమా? రెండు కారణములేనా? యని యడుగగా. 

పక్షి యాకసమున యెగురుట కెట్లు రెండు రెక్కలు ముఖ్యమో నారీతిని మోక్షపదము చూఱగొనుటకు గూడ వేదబోధితములైనకర్మజ్ఞానములు రెండు ముఖ్యములని నిర్ణయించిరి. కాన కర్మాచరణము యత్యంన్తావశ్యము.
ఈకర్మజ్ఞానములురెండు యనవసరములే మరియు నీరీతిని వచించిరి.

కేవలాత్‌ కర్మణో జ్ఞానాన్నపి మోక్షోభిజాయతే కిన్తూ
భాభ్యాం భవేన్మోక్షం సాధనం తూభయంవిదుః
కేవలము కర్మ కారణముకాదు, కేవలము జ్ఞానము మోక్షమునకు కారణములు కాజాలదు కర్మజ్ఞానములు రెండూ మోక్షమునకు కారణభూతములు గాన వేద సంబంధమైన కర్మజ్ఞానములు రెండు ప్రధానములగుచున్నవి.
ఇందుకై యోగ వాశిష్ఠమున నొక యుపాఖ్యానముగలదు. కాని యా కథయంతయు వివరిమించడందనవసరము, అవసరమున్నచో నందు విపులముగ చూడనగును. సంక్షేపముగ మాత్రము వచింతును.

అగ్ని వేశ్యుడని యొక మహర్షిగలడు. అతనికి కారుణ్యుడనియెడి పుత్రుడు గలడు ఈ కారుణ్యుడు, ఉపనయనానంతరము విద్యాభ్యాసమునకై వెళ్లి, వేదశాస్త్రముల నెల్ల పఠించి యింటికివచ్చెను. అనవరతము జ్ఞానమె ముఖ్యాతి ముఖ్యమని భావించి కర్మాచరణముమాని మెలంగుచుండెను.
ఈ కుమారుని ప్రవర్తననము తండ్రి గుర్తించినవాడై నిటు ప్రశ్నించెను.
''కీమేతత్‌ పుత్రకురుషేపాలనంనస్వకర్మణః''
నీ వెందుకీరీతిని నిత్య కర్మానుష్ఠానమును పాలించుట లేదు?

''అకర్మనిరతః కథం సిద్ధింప్రాప్స్యసితద్వద|''
కర్మాచరణములేనిది సిద్ధిని నీవెట్లు పొందగలవు? అనగా దైవసంబంధమైన శక్తిని (సిద్ధి) నీవెట్లు పొందగలవు?
''కర్మణోస్మాన్నివృత్తేః కింకారణం తన్ని వేద్యతాం''
కర్మాచరణము మానినందులకుగల కారణమును వచింపుమని ప్రశ్నించెను,
ఎందుకనగా ''యావజ్జీవమగ్ని హోత్రం| నిత్యం సంధ్యాముపాసయేతీ|
ప్రవృత్తి రూపోధర్మోయం| శ్రుత్యాస్మృత్యాచ చోదితః||

అను ధర్మానుసారము జీవితపర్యంతము, ఔపాసనము, నిత్యము సంధ్యావందనము వదలక యాచరింపదగిన ప్రవృత్తి రూపమనదగిన ధర్మమయ్యది వేదశాస్త్రములచే నిర్ణయింపబడిన విధులుగదా! వీనిని నీవెట్లు వదలి వేయగల్గితివో వచింపుమని వేడగ పుత్రుడైన కారుణ్యుడు నిరుత్తరుడై తండ్రి యాజ్ఞచే కర్మాచరణమునకు పూనుకొని సిద్ధిని బడసినట్లుగలదు. ఈ యుపాఖ్యానముచే తేలిన సారాంశ##మేమనగా తాము తొలుత కర్మాచరణమునకు పూనుకొనియుండి బిడ్డలకు సహా వేదశాస్త్ర సిథ్ధములైన కర్మజ్ఞాన మార్గములు ప్రబోధించుటకు తగిన యర్హత సంపాదించుకొని యుండడమవసరము. కానీ నేడు తండ్రులకు తొలుత తెలియదు, బిడ్డలకు యీ వేదశాస్త్ర జ్ఞానముయొక్క యావశ్యకతను గూర్చి బోధించుదామనే తలంపేని తలంపరు. ఈ రితిని దుస్థితికివచ్చి కర్మ భ్రష్టులుగ మారుచుండుట మిక్కిలి శోచనీయము.

మనము కర్మాచరణము చేయకున్ననూ మన సంతతియేని కర్మజ్ఞానములను సాధించి వంశోద్ధారకులు కావలయుననెడి తలంపు గలుగవలయును. ఎందుకనగా,
''కాలే కాలే పృధక్‌ బ్రహ్మస్‌ భూరివీర్య విభూతయః|
భూతేష్వభ్యుదయం యాన్తి, ప్రతీయన్తేచ కాలతః|
అను ధర్మానుసారము బల సంపదలు ఒక్కొక్క కాలమున ఒక్కొక్కని యందు వికసించి వృద్ధిపొంది లీనమగు చుండునుగాన, ఎవని యదృష్టవశము వశమున నేరీతినేని వేదశాస్త్ర జ్ఞానబలముచే కర్మాచరణమాచరించి, యితరులకు మార్గదర్శికుడై రాణించెడి సంపదచే దైవబలమున నెవరి యందెట్లెట్లుండునో? గదా! కాన మనమాచరింపలేకపోయిననూ నిరుత్సాహబడక బిడ్డల నేని యుత్తమ కర్మిష్ఠులుగ తీర్చవలసిన ధర్మము ప్రతి తల్లి దండ్రలందును విధిగ నున్నదని విస్మరించరాదు.
''జయత్యధిక యత్నవా&'' అను నానుడి చొప్పున యెక్కువగా ప్రయత్నించుకొలది జయము సాధించగల్గుటకు వీలుండును. అందుచేతనే ''సర్వేణ పౌరుషాతీ సమవాప్యతే''యనియందురు. 

పురుషప్రయత్నముచే సర్వమూ సాధింపబడుచుండును. పురుషప్రయత్నమైన కర్మ రెండు విధములుగ నుండునందురు. ''ద్వివిధం విద్ధిపౌరుషం'' ఈ రెండువిధములైన కర్మలనదగినవి పురుష ప్రయత్నమునకే ''ప్రాక్తనం చైహికం చేతి'' అని. ప్రాక్తనకర్మ, యైహిక, కర్మయని రెండు విధములు, ప్రాక్తన కర్మకే. అదృష్టమనియు నామాంతరము. ఈ యదృష్టప్రాప్తి సాథనకె, కర్మాచరణము ముఖ్యమందురు, ఈ కర్మాచరణమునకై మెలంగు విధికే ''సదాచార'' మని నామాంతరము.
''యస్తూదార చమత్కారః సదాచార విహారవాన్‌|
సనిర్యాతి జగన్మోహాత్‌, మృగేంద్రః పంజరాదివ||
అనునానుడి చొప్పున. చతురుడైన సదాచార కుశలుడు, ఈ లోకమోహమను బోను నుండి' సింహము బోనులోనుండి వెలువడి వచ్చులాగుస మోహమునుండి వెలువడగలడు.

''శాస్రైః సదాచార విజృంభిత దేశధర్మైః|
యత్కల్పితం ఫలమతీవ చిరవ్రరూఢం|
తస్మిక్‌ హృది స్మృరతి చోపన మేతి చిత్త |
మంగావళీ తదను పౌరుష మేత దాహుః||
అనునట్లు మానవుని చిత్తశుద్ధి, జ్ఞానము, వేదాది శాస్త్రముల వలననూ సత్పురుషుల ఆచారాదుల వలననూ, స్వథర్మానుష్ఠానము వలననూ, సత్పలవిద్ధికై, మనస్సున ఉపాయ రూపమున స్మృరింపజేయును, ఈ సత్ఫలమును పొందవలయుననెడి వాంఛయే, పిదప కార్యరూపమున మానవుడుపయోగించును. 

ఈ కార్యరూపమున మెలంగుటకే ''పౌరుషమని'' పెద్దలు చెప్పుదురు. కాన తన చేతగాలేదే! యని నిరుత్సాహాబడక తన సంతతివారేని సాధింపదగు రీతిని సత్కర్మాచరణమునకై దోహద మొసంగుట విథియై యున్నది. ఎందుకనగా
పుత్రేణ లోకాజయతి పౌత్రేణా నంత్యమశ్నుతే|
అధ పుత్రస్య పౌత్రేణ నాకమే వాధిరోవాతి||
యను థర్మము ప్రకారము ధర్మబద్ధమైన పుత్రునిచే లోకములు జయింపవచ్చును, ధర్మబద్ధమైన పౌత్రునిచే సమస్తము బడయవచ్చును, కాన పుత్ర పౌత్రులు ధర్మవంతులై సత్కర్మానుష్ఠాన ధురీణులై యున్నచో ఇహపర సుఖములెల్లయు పొందననువగును గాన,
సప్తపరాన్‌ సప్తపూర్వా& షడన్యాస్‌ ఆత్మసప్తమాన్‌
సత్పుత్ర మథిగచ్ఛానః తారయే దేనసో 
భయాత్‌ ||
సత్పుత్ర జననముచే తనకు మునుపుండిన యేడ్గురి తరింపజేయును. అనంతర మేడ్గురిని తరింపజేయగలడు గాన సత్పుత్రి జననమవసర మందురు.

ఈ సత్పుత్ర జననమునకుగాను. వైదికి కర్మానుషానమున. పుంసవన సీమంత జాతకర్మ నామకరణాది సంస్కారములు విధిగ జేయవలయునని సూత్రకారులు నిర్ణయించి యున్నారు.

ఈశ్వర సాన్నిథ్య ప్రాప్తికిగాను మన పూర్వీకులైన వేద వేత్తలగు మహర్షులు నలువది సంస్కారములను. ఎనిమిది ఆత్మగుణములను యేర్పరచి యున్నారు. ఇది యన్నియు స్మృతిరూపాలనియు పెద్దలందురు. స్మృతులు యిరువదియెన్మిది గలవు. ఇందులో పదునెనిమిది ముఖ్యములు మిగిలిన పదియు యుపస్మృతులందురు, మనువు. యాజ్ఞవల్కులు, హరితులు, పరాశరులు మొదలైన మహనీయులీ స్మృతికర్తలు,
ఈ స్మృతులను శ్రుతులను పరిశీలించి' ఆపస్తంబమహర్షి, ఆశ్వలాయనమహర్హి, బౌధాయన మహర్షి, మొదలైన వేద వేత్తలు సూత్రములను రచించిరి. వీనికే ఆపస్తంబ మహర్షి సూత్రము. ఆశ్వలాయన మహర్షి సూత్రము. బౌధాయన మహర్షి సూత్రము అని వ్యవహరించుచుందురు.

ఈ సూత్రముల సహాయమున వేదమంత్రములను మనమెట్లెట్లు యేయేకార్యములకు వినియోగించుకొనునది తెలిసికొనగల్గు చున్నాము యీవైదిక కార్యములకే ''సంస్కారములనెడి నామాంతరము గలదు ఈ సంస్కారములు నలువది.

''సంస్రియతే జ్ఞానమోగ్యతాం ఆపద్యతే పురుషస్య చిత్తం అనే నేతి సంస్కారహః అను వ్యుత్పత్తి ననుసరించి, మానవుని మనస్సు బ్రహ్మజ్ఞానమునుc బొందుటకు యోగ్యమగురీతిని సంస్కరింపబడునుగాన ''సంస్కార'' మని వ్యవహారము, యీచత్వారింశత్సంస్కారములచే గల్గుఫలమేమనగా
''చత్వారింశత్సంస్కారా, అష్టావాత్మ గుణాశ్చ
సబ్రహ్మణస్సాయుజ్యం సాలోక్యంచ గచ్ఛతి''
''యస్యఖలు సంస్కారాణాం ఏక దేశోపి, అధా೭ష్టావాత్మ గుణాయది సబ్రహ్మణః సాయుజ్యం సలోకతాంచ గచ్ఛతి'' అను గౌతమ ధర్మసూత్రములో (೮ ೧೪ ೨೪) చెప్పిన రీతిని' ఎవడీ నలువది సంస్కారములు గలిగి ఎనిమిది ఆత్మగుణములు గలిగియుండునో నట్టివాడు బ్రహ్మలోకమునుబొంది బ్రహ్మసాయుజ్యము నందగలడు.

ఒకవేళ నలువది సంస్కారములను సంపూర్ణముగ బొందక బోయిననూ. కొన్నింటినేని పొందియుంటి, ఆత్మగుణాష్టకముతో కూడియున్న చో అట్టివాడు సహితము బ్రహ్మసాయుజ్య పదవి నందగలడు.
''సచ సంస్కారః శ్రవణాదేసతి జ్ఞానే ఉవకరోతి'' ఈ సంస్కారములు. వేదాన్త విషయకమైన, శ్రవణ మనన నిధిధ్యాసాదులు గలిగి నప్పుడు, మానవునకు జ్ఞాన విషయమున నుపకరించగలవు, పందొమ్మిది సంస్కారములకు ''బ్రహ్మ సంస్కారములందురు. ఎనిమిదింటిని ''పితృకర్తృకములందురు. నాలుగింటిని అచార్య కర్తృకములని పేరుః ఏడింటిని స్వకర్తృకములని వ్యవహారము ఇరువదొకటికి దైవ సంస్కారములు. అనియు నందురు, దయాదాక్షిణ్యాది యెనిమిదింటిని ఆత్మగుణములందురు. వీని వివరణము సవివరముగ నిందు పరిశీలించెదను పరికింతురుగాక:-

పితృకర్తృకములన దగిన యెనిమిది సంస్కారము లెవ్వియన, 'గర్బాధాన, పుంసవన, సీమంతోన్నయన, జాతకర్మనామకరణాన్న ప్రాశ చౌలోపనయనములనదగిన యెనిమిది సంస్కారములు బాలునికి గాను తండ్రి జేయదగిన సంస్కారములు.

ప్రాజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవములనదగు నాలుగింటిని ఆచార్య కర్తృకములు అనగా సంస్కారములు చేయించు, గురువు (పురోహితుడు) చేయదగినవి వీనినే ''వేదవ్రతములనియు నామాంతరముగ వ్యవహారమున్నది.

సమావర్తన, సహధర్మచారిణీ సంయోగ, దేవ, పితృభూత, మనుష్య బ్రహ్మ యజ్ఞాదులున్ను చేరి యేడింటిని తానే స్వయముగా చేయదగిన సంస్కార సప్తకము.

ఆష్టక, పార్వణ, శ్రాద్ష, శ్రావణీ. ఆగ్రహాయణీ, చైత్రీ అశ్వయుజీ, అగ్న్యాధేయం. అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాస. చాతుర్మాస్యాని. ఆగ్రయణష్టి, నిరూఢపశుబంధ సౌత్రామణీ, అగ్నిష్టోమ, అత్యగ్నిష్టోమ. ఉక్థ్యన. షోడశీ వాజపేయ, అతిరాత్ర. అప్తోర్యామ. నామక ఏకవింశితి సంస్కారములు దైవ సంస్కారములు అని యందురు.

దయా, క్షాన్త్యన నూయా శౌచానాయాస మాంగల్యకార్పణ్యా స్పృహాదులనదగు నెనిమిది గుణములు ఆత్మగుణములని పేరు. ఈ నలువది సంస్కారములు, ఎనిమిది ఆత్మగుణములు కలిసి, అష్టాచత్వారింశత్సంస్కారములని సంస్కారుల నిర్ణయము.

శ్రీశ్రీశ్రీ జగద్గురు వర్యులు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు చంద్రశేఖరేంద్ర గురువర్యులొకచోట నీ సంస్కారముల ప్రాముఖ్యమునుగూర్చి వంచించు నిట్లనిరి, ''కర్మ'' అంటే యేమిటి? పని. ఒకబట్ట తయారుకావాలంటే, పూర్వాం గంగా నెన్నో పనులు చేయాలి, అట్లె ఒకడు ఆత్మవేత్త కావాలంటే యెన్నో పనులు చేయాలి. 

గుణకర్మలతో నీ పనులు చేయాలి. ఈ పనులకే ''సంస్కారములని పేరు,
ఒక పదార్థనికున్న దోషం పోగొట్టి దానిని గుణవంతంచేసేది సంస్కారం. జీవాత్మకున్న దోషాలను పోగొట్టి గుణపూర్ణం చేయడానికేర్పడిన కార్యాలే సంస్కారాలు.

యీ సంస్కారములలో మొదటిది ''గర్బాధానము|| ''గర్బః ఆధీయతే యేననిషిక్తం వీర్యం అమోఘం భవతి తథ్గర్బాధానం.'' అను వర్ధముప్రకారము అమోఘమైన వీర్యముచే గర్బము ధరింపబడు సంస్కారము గాన గర్భాదానమందురు దీనినే ''నిషేకః యనియువ్యవహరింతురు ''నిషేకాత్‌ బైజికం, చైనోగార్భికంచాప మృజ్యతే'' యనగా ఈ సంస్కారముచే బీజ దోషము గర్భదోషము శాంతించునుగాన నిషేకమనియు నందురు. బీజదోషశాంతి, గర్భదోష శాంతికిగాను చేయు సంస్కారమయ్యది తొలుత జన్మమెట్లు కలుగునది యెరుంగుట యవసరము.

''పుణ్యౖః దేవత్వమాప్నోతి. పాపైస్థావరతామియాత్‌|
సమాభ్యాం పుణ్యపాపాభ్యాం మానుష్యం ప్రాప్నుయాన్నరః||
అను సూతసంహిత వచనము ప్రకారము పుణ్యముచె దైవత్వము పాపత్వముచే. నీచపుజన్మ. పుణ్యపాప మిశ్రముచే మనుష్యత్వము లభించును. ఈ వచనమునకు తగిన వేదవాక్యమిట్లుగలదు ''(పుణ్యౖర్దేవత్వం ఇతిపుణ్యన పుణ్యం లోకంజయతి. పా పీన పాపం, ఉభాభ్యామేన మనుష్యలోకం ఇతి శ్రుతిః)
సూర్యాద్వృష్టిః, వృష్టేః ఓషధయః, ఓషధీభ్యోన్నం,
అన్న పానంచ నిత్యం భుంక్తేచ మానవః | పంచభూతాత్మకం|
భుక్తం. అష్ట సారాత్మనాద్విధా|
సూర్యుని వలన వర్షము. వర్షమువలన పంటలు. పంటలవలన ధాన్యము (అన్న పదార్థములు) అన్న పానములను మానవుడు గ్రహించుటచే యెనిమిది విధములైన ధాతువులు శరీరమున వృద్ధియగుచుండును.

ఈ యష్టధాతువులు ''కిట్టం వురీషం మూత్రాస్థి మేదోమజ్జాత్మనా భవేత్‌ యనురీతిని ''శుక్ల శోణిత. పురీష మూత్రములు, ఎముకలు మేధస్సు మజ్జధాతువు'' అనునవి శరీరమున వృద్ధినొందును.

''అగ్నినావర్ధతే మజ్జా'' అనురీతిని ''మజ్జాధాతువు అగ్నివల్ల వృద్ధిపొందును. ''లోహీతంవర్థతే జలాత్‌'' జలతత్వముచే ''లోహితధాతువు వృద్ధిపొందును. ''భువామా ంసస్య వృద్ధిస్యాత్‌'' భూతత్మముచే మాంసము వృద్ధిపొందును.
ఆకాశాద్ధాతవః సర్వేవర్ధంతే, వాయునాబలమ్‌'' అను రీతిని ధాతువులన్నియు వాయుతత్వముచే, ఆకాశతత్వముచేతను. వృద్ధిపోందును,
''శుక్ల శోణిత సంయుక్తం కలిలం బుద్బుదంతధా'' స్త్రీపురుష సంయోగముచే నేర్పడు శుక్లశోణితములచే ఏకరాత్రోషితం కలిలం'' అనునట్లు ''కలిలం'' అను పేర చేరియుండును.
సప్తరాత్రోషితం బుద్బుం భవతి'' ఏడు దినములు స్త్రీ గర్భమున బుద్భుదాకారమున (నురుగుగ) నుండును.

యీ సంస్కారములలో మొదటిది ''గర్బాధానము|| ''గర్బః ఆధీయతే యేననిషిక్తం వీర్యం అమోఘం భవతి తథ్గర్బాధానం.'' అను వర్ధముప్రకారము అమోఘమైన వీర్యముచే గర్బము ధరింపబడు సంస్కారము గాన గర్భాదానమందురు దీనినే ''నిషేకః యనియువ్యవహరింతురు ''నిషేకాత్‌ బైజికం, చైనోగార్భికంచాప మృజ్యతే'' యనగా ఈ సంస్కారముచే బీజ దోషము గర్భదోషము శాంతించునుగాన నిషేకమనియు నందురు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: