సరస్వతీ నది
బద్రీనాథ్ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న " మానా " అనే గ్రామం లోని " సరస్వతి నది " ప్రవాహం ఇది...
చైనా/టిబెట్ బోర్డర్ కి దగ్గరగా ఉన్న ఈ ఊరు భారతదేశపు చివరి గ్రామం...
సరస్వతీ నది ఇక్కడ కొండలలోంచే పుడుతుంది...
ఇక్కడ వినాయకుడి గుహ, వ్యాస గుహల్ని దర్శించుకోవచ్చు ...
వ్యాసగుహలో వ్యాసుడు కూర్చొని మహాభారత కధ చెప్పగా, వినాయకుడు గణేశ గుహలో కూర్చొని ఆ గ్రంధాన్ని ఇక్కడే రచించాడని ప్రతీతి...
ఈ వ్యాసగుహకు కొద్ది దూరంలో భీంపుల్ దగ్గర ఉదృతంగా ప్రవహించే సరస్వతీ నది కొద్ది అడుగుల దూరంలో అంతర్వాహిని అయిపోతుంది...
_పెద్ద శబ్దంతో ప్రవహిస్తూ తన మహాభారత రచనకు ఆటంకం కలిగిస్తున్న సరస్వతిని హోరు తగ్గించుకోనమని వ్యాసుడు కోరగా సరస్వతి నది వ్యాసుని మాట పెడ చెవిన పెట్టడంతో వ్యాసుడు ఆ నదిని అంతర్వాహిని కమ్మని శాపమిస్తాడు.
అంచేతే అంత ఉదృతమైన నదీ ఇక్కడ అంతర్వాహిని అయ్యి తిరిగి అలహాబాద్ లో పైకి వచ్చి గంగా, యమునలతో సంగమిస్తుంది...
Comments
Post a Comment