కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా

కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా "కర్ణుడు లేని భరతం" అనే తెలుగు జాతీయం ఎందుకు వచ్చింది?
*యతో ధర్మః తతో జయః*… ధర్మ మార్గం ఎన్నడూ విడవవద్దు — అనేది భారతం చెప్పే సందేశం ". చేతులు జోడించి చెప్తున్నాను ధర్మంగా నడుచుకోండి. అర్థ కామ మోక్షాలు అప్రయత్నంగా అవే మిమ్మల్ను అనుసరించి వస్తాయి "— అని భాగవత ఘోష. .

ఇవి వ్యాస మహర్షి మాటలు.

అధర్మమార్గమే తన అర్థార్జనకు తగి ఉన్నదని, .చిన్న నాటి నుండి పెద్దల మాట వినక, ఉగ్రమైన పనులకే అలవాటుబడ్డ వాడు దుర్యోధనుడు . కౌరవులు పుట్టినప్పుడే — వీళ్ళు

*క్రూరులు విలుప్త ధర్మాచారులు

ధృతరాష్ట్ర సుతులు అసద్వృత్తులు *

అని వాళ్ల తాత వేదవ్యాసుడే తన తల్లితోనే చెప్పాడు. దుర్యోధనుడి జన్మ అలాంటిది . తనకు సహజంగా శక్తి లేదు. కర్ణుణ్ణి నమ్ముకొని రాజ్యాలు ఏలదలచాడు ఆ దుర్యోధనుడు.

అర్జునుణ్ణి కొట్టిన వాడుగా లోక విఖ్యాతుడు కావాలి —అనే ఏకైక జీవిత లక్ష్యంగా దుర్యోధనుడి పక్షంలో నిలిచిన వాడు కర్ణుడు.

అనేక సందర్భాల్లో ఓడినా , దుర్యోధనుడు అతణ్ణే నమ్మాడు . యుద్ధరంగలో గూడా భీష్ముణ్ణి " నీవు తప్పుకోని , కర్ణుడికి అవకాశం ఇమ్మ" న్నాడు. భీష్ముడంతటి వాడే —-అర్జునుడు నా కంటే విలువిద్యల్లో అధికుడు ——-అని సభాముఖంగా ప్రకటించగా, .అందరినీ క్షణాలలో జయిస్తానని భేషజాలకు పలికిన వాడు కర్ణుడు.

నాటి అస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడి బీరమూ, అహంకృతి వ్యక్తమయ్యాయి . సహజంగా తనకు భుజబలశక్తీ , ధైర్యమూ లేకున్నా కర్ణుడి అండతో పాండవులను సాధించగలను! — అని ఒక గుడ్డి నమ్మకం ఆ ధార్తరాష్ట్రుడికి. .అంధనృపతి అండదండలు మెండుగా ఉండి, ఆడిందే ఆటగా సాగుతున్నది గూడా.

పాండవులను * పల్మాటు పరాభవించితి , …వారలన్ పోర జయింపరామియును బుద్ధి నెరుంగుదు * —అని స్వయంగానే ఏకాంతంలో తాత భీష్ముడితో అన్నవాడు , యుద్ధ విజయం అసంభవం... అని తెలిసి గూడా మిత్రుణ్ణి నిలురించని వాడు కర్ణుడు.

భీష్ముడు రణరంగంలో నిల్చినంత కాలం సమరాంగణంలో కాలు మోపనని ఆగ్రహంతో శపథం పట్టాడు.. ఐనా యుద్ధం మొదలయిందే.!

కర్ణుడు ఒక్కడి మీదనే భవిష్యత్తు నిలవలేదు.!

కర్ణుడు మేటి వీరుడే ఐనా, భీష్మ ద్రోణాదులెందరో అతణ్ణి మించిన వాళ్లు (ఉప్పు తిన్నందుకు ముప్పున బడవలసిన సేవాధర్మ పరాయణు లెందరో) — ఆ పక్షంలో ఉన్నారు. కర్తా కారయితా చైవ… అన్నట్టు అధర్మ అనుమోదకులూ ….పోవలసిన వారే! .

భీష్ముడు ఒకవేళ నేను యుద్ధం లో పాల్గొనను— అని గట్టిగా చెప్పినా అప్పటికి ఆ ఘోరకాలి ఆగేదేమో! —-కాలగతిలో భీష్మ ద్రోణుల బుద్ధీ అటే పోయింది! అని గూడా వ్యాస మహర్షి ఒకచోట అంటాడు..

ఈ భూభారం తగ్గించమని ఒకటికి రెండు సార్లు భూదేవి .ప్రార్థించినందువల్ల — అధర్మ ప్రాబల్య కారణంగా యుద్ధం అనివార్యం అయింది. యుద్ధ ప్రధాన కారణం అదే.

కర్ణుడు మాతృదోషంలో పుట్టి పెరిగాడు .

జన్మ ఎట్లా ఉన్నా , కర్మ గూడా అతని జన్మాంతర కర్మల కారణంగా వక్రంగానే నడిచింది… ఉత్తమ సహవాస భాగ్యం కలగలేదు. తానూ ఉదాత్త మిత్రుడు, ఆదర్శ ప్రాయుడూ కాలేక పోయాడు. నోరు దురుసుతనం అతని పతనానికి కారణమయింది.

ఉత్తమ మిత్రుడు ఎట్లా ప్రవర్తిస్తాడో భర్తృహరి చెప్పినదిది:—

అఘము వలన మరల్చు హితార్థ కలితు

జేయు గోప్యంబు దాచు, పోషించు గుణము

విడువడాపన్ను, లేవడి వేళ నిచ్చు

మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు— అని .

కానీ , కర్ణుడు దుర్యోధనుడి దుర్గుణాలను మరింత రెచ్చగొట్టే విధంగానే చివరి వరకూ నడుచుకొని , కౌరవ వినాశనాగ్నికి తన వంతు సమిధలు వేసి , ఎగదోశాడు గానీ , ఆర్పే యత్నం చేయలేక పోయాడు.

యుద్ధ ఆరంభ సంరంభ సమయంలో మాత్రమే ఒకసారి *ఇపుడు మనకు సమయం అనుకూలంగా కనబడదు, కారణం—. సైనికులు తిన్న దానికంటే అధికంగా విసర్జన చేస్తూన్నారు . ,.మన గుర్రాలూ అపసవ్యంగా తిరుగుతూన్నాయి అని చెప్పాడు , కానీ అతగాడు పెడచెవిని బెట్టాడు.. [ఈ విధంగానే అశ్వత్థామ గూడా ద్రోణ పతనానంతరం* భీష్ముడు ద్రోణుడు పడిపోయారు.. ఇప్పటికి ఆపి మరోసారి చూచుకొందాము.. అర్జునుడితో నాకున్న మైత్రితో నేను అందుకు పూనుకొనగలను. * .అని చెప్పాడు ]

కుంతి, శ్రీ కృష్ణుడు అతణ్ణి యుద్ధ విముఖుణ్ణి చేసే ప్రయత్నం చేశారు. భీష్ముడూ 10వ రోజు రాత్రి అంపశయ్య మీద ఉండి, పాండవులతో కలిసి ఉండు …ఈ యుద్ధం ఆగిపోియినట్లే !! అని యుద్ధం ఉపశమింపజేసే ప్రయత్నం చేశాడు.

'* నీవే రాజువవుతావు *—అని స్ఫురింపజేశాడు ఆ సరహస్య సంభాషణలో. ... కానీ కర్ణుడు * ఇకనైనా ధర్మ రాజే పాలన చేయాలి అని తెలిపి, మత్ సేవా ధర్మము నిర్వహించెద "* అంటాడు కడకు వీర మరణం పొందాడు.

కర్ణుడి దాన గుణం గణనకెక్కింది . కానీ వాక్పారుష్యం అతని బలహీనత. స్వోత్కర్ష అతని అవలక్షణం. అధర్మ పక్షావలంబనం అతని యుద్ధ మరణ హేతువు.

కర్ణుడి తలపై భారతం అనేది నానుడి. పూర్తిగా ఆలోచితం కాదు. దుర్యోధనుడి కారణంగా (కలి అంశలో పుటక ) కౌరవ వంశ నాశనం అని —-అతని జన్మ వేళ లో అనేక అమంగళాలు జరిగినట్టు, అతడినొక్కణ్ణి విడిచి వేసి వంశం కాపాడుకో అని కులబంధువులందరూ హితం ఉపదేశించినట్లు భారతంలో ఉన్నది.

నర నారాయణులు సహస్ర కవచుడి 999 కవచాలూ చిరకాల దీర్ఘ తపస్సు ల ఫలంగా వధిస్తూ వచ్చారనీ, చివరిది సూర్యుడి అభయ ప్రదానం వల్ల కొంత కాలం అతనికి రక్షణగా ఉండినది దాన్ని అంతం చేయడం కోసం నర నారాయణులు కృష్ణ అర్జునులుగా జన్మించి సాధించారని భారత కథ. ఇది అవాంతర ప్రయోజనంగా సాధింపబడినదే గానీ భారత ప్రధాన ప్రయోజనం కాదు.

కర్ణుడు యుద్ధ రంగ లో దిగక 10 రోజులు మహా సంరంభంతో భీషణ సమరం జరిగింది. అతడి ప్రమేయం ఏడు రోజులు.

కర్ణుడు పుట్టాడు. దుర్వాస మహాముని వరం వల్ల అతడే కాదు. పాండవులు అందరూ పుట్టారు. అతడు దైవికంగా దుర్యోధనుడి మిత్రుడయి, అతణ్ణి మరింత చెడగొట్టి ధైర్యం కల్పించి యుద్ధం తప్పనిది చేశాడేమో! అంత మాత్రమే.. కర్ణుడు యుద్ధం లో కాలుపెట్టను అన్నపుడు దుర్యోధనుడు యుద్ధం ఆపే ఆలోచన చేయలేదే! కర్ణుడు పోయిన తర్వాత గూడా యుద్ధం కొనసాగింది గదా!

కర్ణుడు మంచివాడా?.కాదా? అనే విషయం కాదు…

భారత యుద్ధం అతడు పుట్టకపోతే జరిగేది కాదు ….అతడు పుట్టబట్టే ఈ యుద్ధం జరిగింది—-అని భావించడం వట్టి పొరపాటే ఔతుంది.

యుద్ధ మరణం, అధర్మ పక్ష స్థితి — కర్ణుడికి రాసిపెట్టి ఉన్నవి.

దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్ కర్ణుడు అధర్మపక్షాన పోరాడినా "కర్ణుడు లేని భరతం" అనే తెలుగు జాతీయం ఎందుకు వచ్చింది?
*యతో ధర్మః తతో జయః*… ధర్మ మార్గం ఎన్నడూ విడవవద్దు — అనేది భారతం చెప్పే సందేశం ". చేతులు జోడించి చెప్తున్నాను ధర్మంగా నడుచుకోండి. అర్థ కామ మోక్షాలు అప్రయత్నంగా అవే మిమ్మల్ను అనుసరించి వస్తాయి "— అని భాగవత ఘోష. .

ఇవి వ్యాస మహర్షి మాటలు.

అధర్మమార్గమే తన అర్థార్జనకు తగి ఉన్నదని, .చిన్న నాటి నుండి పెద్దల మాట వినక, ఉగ్రమైన పనులకే అలవాటుబడ్డ వాడు దుర్యోధనుడు . కౌరవులు పుట్టినప్పుడే — వీళ్ళు

*క్రూరులు విలుప్త ధర్మాచారులు

ధృతరాష్ట్ర సుతులు అసద్వృత్తులు *

అని వాళ్ల తాత వేదవ్యాసుడే తన తల్లితోనే చెప్పాడు. దుర్యోధనుడి జన్మ అలాంటిది . తనకు సహజంగా శక్తి లేదు. కర్ణుణ్ణి నమ్ముకొని రాజ్యాలు ఏలదలచాడు ఆ దుర్యోధనుడు.

అర్జునుణ్ణి కొట్టిన వాడుగా లోక విఖ్యాతుడు కావాలి —అనే ఏకైక జీవిత లక్ష్యంగా దుర్యోధనుడి పక్షంలో నిలిచిన వాడు కర్ణుడు.

అనేక సందర్భాల్లో ఓడినా , దుర్యోధనుడు అతణ్ణే నమ్మాడు . యుద్ధరంగలో గూడా భీష్ముణ్ణి " నీవు తప్పుకోని , కర్ణుడికి అవకాశం ఇమ్మ" న్నాడు. భీష్ముడంతటి వాడే —-అర్జునుడు నా కంటే విలువిద్యల్లో అధికుడు ——-అని సభాముఖంగా ప్రకటించగా, .అందరినీ క్షణాలలో జయిస్తానని భేషజాలకు పలికిన వాడు కర్ణుడు.

నాటి అస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడి బీరమూ, అహంకృతి వ్యక్తమయ్యాయి . సహజంగా తనకు భుజబలశక్తీ , ధైర్యమూ లేకున్నా కర్ణుడి అండతో పాండవులను సాధించగలను! — అని ఒక గుడ్డి నమ్మకం ఆ ధార్తరాష్ట్రుడికి. .అంధనృపతి అండదండలు మెండుగా ఉండి, ఆడిందే ఆటగా సాగుతున్నది గూడా.

పాండవులను * పల్మాటు పరాభవించితి , …వారలన్ పోర జయింపరామియును బుద్ధి నెరుంగుదు * —అని స్వయంగానే ఏకాంతంలో తాత భీష్ముడితో అన్నవాడు , యుద్ధ విజయం అసంభవం... అని తెలిసి గూడా మిత్రుణ్ణి నిలురించని వాడు కర్ణుడు.

భీష్ముడు రణరంగంలో నిల్చినంత కాలం సమరాంగణంలో కాలు మోపనని ఆగ్రహంతో శపథం పట్టాడు.. ఐనా యుద్ధం మొదలయిందే.!

కర్ణుడు ఒక్కడి మీదనే భవిష్యత్తు నిలవలేదు.!

కర్ణుడు మేటి వీరుడే ఐనా, భీష్మ ద్రోణాదులెందరో అతణ్ణి మించిన వాళ్లు (ఉప్పు తిన్నందుకు ముప్పున బడవలసిన సేవాధర్మ పరాయణు లెందరో) — ఆ పక్షంలో ఉన్నారు. కర్తా కారయితా చైవ… అన్నట్టు అధర్మ అనుమోదకులూ ….పోవలసిన వారే! .

భీష్ముడు ఒకవేళ నేను యుద్ధం లో పాల్గొనను— అని గట్టిగా చెప్పినా అప్పటికి ఆ ఘోరకాలి ఆగేదేమో! —-కాలగతిలో భీష్మ ద్రోణుల బుద్ధీ అటే పోయింది! అని గూడా వ్యాస మహర్షి ఒకచోట అంటాడు..

ఈ భూభారం తగ్గించమని ఒకటికి రెండు సార్లు భూదేవి .ప్రార్థించినందువల్ల — అధర్మ ప్రాబల్య కారణంగా యుద్ధం అనివార్యం అయింది. యుద్ధ ప్రధాన కారణం అదే.

 *కర్ణుడు మాతృదోషంలో పుట్టి పెరిగాడు .* 

జన్మ ఎట్లా ఉన్నా , కర్మ గూడా అతని జన్మాంతర కర్మల కారణంగా వక్రంగానే నడిచింది… ఉత్తమ సహవాస భాగ్యం కలగలేదు. తానూ ఉదాత్త మిత్రుడు, ఆదర్శ ప్రాయుడూ కాలేక పోయాడు. నోరు దురుసుతనం అతని పతనానికి కారణమయింది.

ఉత్తమ మిత్రుడు ఎట్లా ప్రవర్తిస్తాడో భర్తృహరి చెప్పినదిది:—

అఘము వలన మరల్చు హితార్థ కలితు

జేయు గోప్యంబు దాచు, పోషించు గుణము

విడువడాపన్ను, లేవడి వేళ నిచ్చు

మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు— అని .

కానీ , కర్ణుడు దుర్యోధనుడి దుర్గుణాలను మరింత రెచ్చగొట్టే విధంగానే చివరి వరకూ నడుచుకొని , కౌరవ వినాశనాగ్నికి తన వంతు సమిధలు వేసి , ఎగదోశాడు గానీ , ఆర్పే యత్నం చేయలేక పోయాడు.

యుద్ధ ఆరంభ సంరంభ సమయంలో మాత్రమే ఒకసారి *ఇపుడు మనకు సమయం అనుకూలంగా కనబడదు, కారణం—. సైనికులు తిన్న దానికంటే అధికంగా విసర్జన చేస్తూన్నారు . ,.మన గుర్రాలూ అపసవ్యంగా తిరుగుతూన్నాయి అని చెప్పాడు , కానీ అతగాడు పెడచెవిని బెట్టాడు.. [ఈ విధంగానే అశ్వత్థామ గూడా ద్రోణ పతనానంతరం* భీష్ముడు ద్రోణుడు పడిపోయారు.. ఇప్పటికి ఆపి మరోసారి చూచుకొందాము.. అర్జునుడితో నాకున్న మైత్రితో నేను అందుకు పూనుకొనగలను. * .అని చెప్పాడు ]

కుంతి, శ్రీ కృష్ణుడు అతణ్ణి యుద్ధ విముఖుణ్ణి చేసే ప్రయత్నం చేశారు. భీష్ముడూ 10వ రోజు రాత్రి అంపశయ్య మీద ఉండి, పాండవులతో కలిసి ఉండు …ఈ యుద్ధం ఆగిపోియినట్లే !! అని యుద్ధం ఉపశమింపజేసే ప్రయత్నం చేశాడు.

'* నీవే రాజువవుతావు *—అని స్ఫురింపజేశాడు ఆ సరహస్య సంభాషణలో. ... కానీ కర్ణుడు * ఇకనైనా ధర్మ రాజే పాలన చేయాలి అని తెలిపి, మత్ సేవా ధర్మము నిర్వహించెద "* అంటాడు కడకు వీర మరణం పొందాడు.

కర్ణుడి దాన గుణం గణనకెక్కింది . కానీ వాక్పారుష్యం అతని బలహీనత. స్వోత్కర్ష అతని అవలక్షణం. అధర్మ పక్షావలంబనం అతని యుద్ధ మరణ హేతువు.

కర్ణుడి తలపై భారతం అనేది నానుడి. పూర్తిగా ఆలోచితం కాదు. దుర్యోధనుడి కారణంగా (కలి అంశలో పుటక ) కౌరవ వంశ నాశనం అని —-అతని జన్మ వేళ లో అనేక అమంగళాలు జరిగినట్టు, అతడినొక్కణ్ణి విడిచి వేసి వంశం కాపాడుకో అని కులబంధువులందరూ హితం ఉపదేశించినట్లు భారతంలో ఉన్నది.

నర నారాయణులు సహస్ర కవచుడి 999 కవచాలూ చిరకాల దీర్ఘ తపస్సు ల ఫలంగా వధిస్తూ వచ్చారనీ, చివరిది సూర్యుడి అభయ ప్రదానం వల్ల కొంత కాలం అతనికి రక్షణగా ఉండినది దాన్ని అంతం చేయడం కోసం నర నారాయణులు కృష్ణ అర్జునులుగా జన్మించి సాధించారని భారత కథ. ఇది అవాంతర ప్రయోజనంగా సాధింపబడినదే గానీ భారత ప్రధాన ప్రయోజనం కాదు.

కర్ణుడు యుద్ధ రంగ లో దిగక 10 రోజులు మహా సంరంభంతో భీషణ సమరం జరిగింది. అతడి ప్రమేయం ఏడు రోజులు.

కర్ణుడు పుట్టాడు. దుర్వాస మహాముని వరం వల్ల అతడే కాదు. పాండవులు అందరూ పుట్టారు. అతడు దైవికంగా దుర్యోధనుడి మిత్రుడయి, అతణ్ణి మరింత చెడగొట్టి ధైర్యం కల్పించి యుద్ధం తప్పనిది చేశాడేమో! అంత మాత్రమే.. కర్ణుడు యుద్ధం లో కాలుపెట్టను అన్నపుడు దుర్యోధనుడు యుద్ధం ఆపే ఆలోచన చేయలేదే! కర్ణుడు పోయిన తర్వాత గూడా యుద్ధం కొనసాగింది గదా!

కర్ణుడు మంచివాడా?.కాదా? అనే విషయం కాదు…

భారత యుద్ధం అతడు పుట్టకపోతే జరిగేది కాదు ….అతడు పుట్టబట్టే ఈ యుద్ధం జరిగింది—-అని భావించడం వట్టి పొరపాటే ఔతుంది.

యుద్ధ మరణం, అధర్మ పక్ష స్థితి — కర్ణుడికి రాసిపెట్టి ఉన్నవి.

 *దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్ —* అన్నారు పెద్దలు. దానానికి పేరుకెక్కాడు. ఏ కారణమైనా మంచి దానాలు చేసి చిరకీర్తి పొందాడు. అది వాగ్దోషాన్ని వారించలేదు. అందరిలో అశాంతిని ప్రోది చేసింది. వాళ్ల వేదన ఫలం గూడా చవిజూడవలసి వచ్చింది. తప్పదు.—అన్నారు పెద్దలు. దానానికి పేరుకెక్కాడు. ఏ కారణమైనా మంచి దానాలు చేసి చిరకీర్తి పొందాడు. అది వాగ్దోషాన్ని వారించలేదు. అందరిలో అశాంతిని ప్రోది చేసింది. వాళ్ల వేదన ఫలం గూడా చవిజూడవలసి వచ్చింది. తప్పదు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: