పంచ సరోవరాలు - 1.మానస సరోవరం

_*పంచ సరోవరాలు…*_
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
 
మన సంస్కృతీ సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాల ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం తీర్థమంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించు కుంటూన్నాం. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడా ఉండేది. అలా తీర్ధాలకు చేసే యాత్రాలనే తీర్థయాత్రాలని పిలుచు కుంటున్నాం. ఈ పుణ్య భారాతవనిలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా ఎన్నో క్షేత్రాలు, పర్వతాలు, గుహలు, లోయలు, నదీసంగమ స్థానాలున్నాయి. వీటితోపాటు సరోవరాలు కూడ ఆధ్యాత్మికాను భూతిని కలిగిస్తున్నాయి. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం

 _*1.మానస సరోవరం*_
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్బవించింది. అందుకే దీనిని గతంలో ‘బ్రహ్మసరం’ అని పిలిచే వారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు త్రీవమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతులకోసం సృష్టించాడని పురాణ కథనం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రసన్నం చేసు కోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాలపాటు సాగింది. అదే సమయంలో ఆ పన్నెండేళ్ళపాటు ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గర దాపుల్లోని జలవనరులన్నే ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీనది దాకా వెళ్ళాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేక పోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ దేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఓ బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజులు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, ‘జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే’ అని సంకల్పం చెబుతుంటాం. ఈజంబూ ద్వీపం అఖండభారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు ‘జం’ అనే శబ్దం వస్తుందేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూ లింగ ప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూ ద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జమ్బూద్వీపమనే పేరు రావడానికి కూడ కారణం మానస సరోవరమనేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మారం ఓ కథను చెబుతుండటం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనులు ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభ దేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్ప బడుతోంది. ఇక, బౌద్ధగ్రంథాలు మానస సరోవరాన్ని అనోతత్త అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులు, కాయలు చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వులు ఆ పువ్వులపై కూర్చోనేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.

మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ పేడు వరుసల్లో చెట్లు, దాని మధ్యలో ఓ పెద్ద భవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షంఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటూండే వారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకొని బంగారంగా మారాయిని చెబుతుంటారు. ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51 శక్తిపీఠాలలో మానస సరోవరం కూడ ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉందంతాన్ని విన్న పరమశివుడు ఆగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞవాతికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, ఆ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరుగసాగాడు. ఫలితంగా లోకాన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు కుక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మానస సరోవరాన్ని తాకినా, స్నానామాచారించినా బ్రహ్మలోకం చేరుకున్తారానీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగు తుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయడంవల్ల పితృ దేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు, ‘ఓం’ ఆకారంలో ఉంటుండటం విశేషం.

ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.

చాలామంది మానస సరోవర పరిక్రమం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవరతీరం వెంబడి నడిస్తే 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజుల సమయం కూడ తీసు కుంటుంది. ప్రదక్షిణా మాగ్రం దుర్గమంగా ఉంటుంది. మార్గ మధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్య క్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారానే పరిక్రమ చేస్తున్నారు.ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరతప్పదుగా, మానస మశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓవిధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడ అధికంగానే ఉంటోంది. శ్రమ కూడ అధికం. ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధనాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యతా అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచు కున్నవారు ‘అండర్ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందు ముందుగా వచ్చినవాళ్ళకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్ రాజధాని ఖాట్మండు మార్గంద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రికులు చెబుతున్న విషయాలు. శ్రమ దమాదులకు ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృత నిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: