బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యం

కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న రహస్యం ఏంటి..?
బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే భయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. బల్లులు సాధారణంగా ఇళ్లలో వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతుంటాయి. బల్లి గురించి చాల అపోహలున్నాయి. ఇది విష పురుగు అని. అంటే అది కరవదు గాని అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుక అది ఏదేని ఆహార పదార్థాలలో పడితే దాన్ని తిన్న వారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ వున్నది. అదే విధంగా బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు..... కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.
మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు "క్రిష్ణ... క్రిష్ణ " అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్ధం చేస్తే రాహు గ్రహ ప్రభావమని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్ధం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది ..,? బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం...
బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది. 
బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ ...అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడ కుండా....కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది. పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి' క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది. ఇక్కడి అమ్మవారి మందిరంపైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి.
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది. బంగారు బల్లిని తాకటంతో అప్పటివరకూ చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటిది అసలు సిసలు బంగారు బల్లే కనిపిస్తే..? నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరిని విస్మయానికి గురి చేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని.. అవికూడా ఎక్కడో కాదు.. మన శేషాచల అడవుల్లో అన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించటం లేదు. 
ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది.
హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. ‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం. అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు. 
ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: