మంత్ర శాస్త్రం

*మంత్ర శాస్త్రం* 

*మంత్రాలు రెండు రకాలు :*
*1. దీర్ఘమంత్రాలు, 2. బీజ మంత్రాలు.*

*మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు ఉంటాయి.*

*ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.*

*దీర్ఘమంత్రాలు వేదపాఠాల లాగా ...గాన రూపములో ఉంటాయి. వీటిలో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.*

*గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై,* 
*ఇరవెై నాలుగు అక్షరాలతో,*
*ఇరవెై నాలుగు చంధస్సులతో,*
*ఇరవెై నాలుగు తత్త్వాలకు సంకేతంగా భాసిస్తోంది.*

*గాయత్రీ మంత్రం లోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి,*
*‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.*

*‘గాయత్రీ’ మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు.* 

*అందుకే చాలామంది సంధ్యా వందనాది సమయాల్లో గాయత్రీ మంత్రాన్ని జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.*

*" హ్రస్వ బీజమంత్రాలు " మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.*

*దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనలపై ఆధారపడి ఉంటాయి.*

*ఈ మంత్రసృష్టి ఎలా జరిగింది ? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.*

*అందుకు సమాధానం : త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించిన*
*సత్యోపదేశాలే ‘మంత్రాలు’.*

*అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది.*

 *ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి.*

*అయితే, మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ, లోపాలు చేయకూడదు. ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.*

*ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.*

*1. ఋషి :*
*మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.*

*2. ఛందస్సు :*
*శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పుతున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడుకొనేందుకు గాయత్రి వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకున్నారు.*

*3. దేవత :*
*ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠానదేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.*

*4. బీజం :*
*మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.*

*5. శక్తి :*
*మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.*

*6. కీలకం :*
*మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, సర్వసిద్ధులను పొందుతాడు.*

*7. అంగన్యాసం :*
*అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి.*

*శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.*

*8. వినియోగం :*
*చతుర్విధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగమని అంటారు.*

*ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచార రహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.*

*పండుగ సమయాలలో, గ్రహణ సమయాలలో,*
*అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.*

*"మంత్రాలు కర్మార్థమై జనించాయి".*

 *ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమరీతిలో జపించడం వలన ఆ* 
*మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.*

*మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు.* *ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, 'నారాయణ’ అనే మంత్రజపం వల్ల అవి ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.*

*భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.*
*గాయత్రీ మంత్రజపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు.*

*మహాత్ములు కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించారు. అవి :*

*" ఓం "...*
*సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.*

*అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృద్, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, సత్వ - రజో - తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.*

*వేదం ఓంకారరూపం...*

*ఋగ్వేదం నుండి ‘అ’ కారం,*
*యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,*
*సామవేదం నుండి ‘మ’ కారం*
*పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.*

*శ్రీం...*

*అమ్మవారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.*

*హూం:...*

*సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవిక క్రోధం యొక్క శబ్దం "హూం "...*

*ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.*

*రం:...*

*ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.*

*ఐం:...*
*జ్ఞాన బీజం. ఏకాగ్రత, శక్తులను ప్రసాదిస్తుంది.*

*మాం:...*
*మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.*

*సోహం :*
*శ్వాస యొక్క స్వాభావిక బీజం.*
 
*‘సో’ ఉచ్ఛ్యాసం,*
*‘హం’ నిశ్శ్వాసం.* 

 
*‘సో’ శక్తి ‘హం’ శివుడు.*

*గాయత్రీ మంత్రం:...*

*గాయత్రి ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో... గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి.* *గాయత్రీ దేవిని ... గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రిని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.*

*ఏకాక్షర మంత్రం – ‘ఓం’.*

*అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు.* *మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన.*

*ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా !*

 *అలాగే సకల దేవతామూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నులవుతున్నారు.*

*మహాశక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. "ఐం, శ్రీం, హ్రీం, క్లీం " అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి.*

*ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.*

*సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.*

*సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..*

*1. తామస మంత్రం: తామస భావంతో ఉచ్ఛారణ చేసేవి.*

*2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.*

*3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.*

*ఛంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు.* 

*ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది.*
~~~~Forwarded~~~~

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: