కుబేర పచ్చ కుంకుమ

కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటుంది..?🍃

కుబేర పచ్చ కుంకుమ

మన భారతదేశంలో ”పసుపు-కుంకుమ”లను మంగళకరమైనవిగా మరియు ‘సౌభాగ్య’ చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా, పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేవి ‘పసుపు- కుంకుమ’లే! పసుపులో పచ్చి పసుపు, కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు అని పలురకాలు ఉన్నాయి.

అలాగే… కుంకుమలో కూడా పలు రకాలు ఉన్నాయి. ఎరుపు, ముదురు ఎరుపు, సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ, (ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.) మొదలైనవి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కానీ కుంకుమ లో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి చాలామందికి తెలియదు. దీనినే కుబేర పచ్చకుంకుమ అంటారు. ఈ కుబేర పచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది.

పురాణాలలో కూడా ఈ కుంకుమ వర్ణించబడింది. ఇది కుబేరునికి చాలా ప్రీతికరమైనది. పార్వతీ దేవికి కూడా ప్రీతికరమైనది పచ్చ కుంకుమే. ఈ కుంకుమ గురించి శివపురాణం ఇలా వివరించింది. పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగావున్న శివ పార్వతులను చూశాడట. ప్రతిరోజూ దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు ‘అంబిక’ను దర్శించగానే నిర్గాంత పోయాడు

ఒక్క క్షణం ‘పార్వతీదేవి’ని, తన భార్య గా ఊహించుకున్నాడట. ‘సర్వజ్ఞాని’ ఆ సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా? సర్వేశ్వరునికి కోపం వచ్చింది. శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది. శివ పార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు.

👉కుంకుమ తిలకధారణ శుభానికి సంకేతంగా చెప్తారు.

👉నిత్యం ఈ కుబేర కుంకుమ తిలకధారణ చేయడం వలన దృష్టి దోష నివారణ తొలగి నూతన తేజస్సు కలుగుతుంది.

👉ఈ కుబేర కుంకుమతో పాటు కుబేర కాయిన్ కూడా ఇస్తున్నారు. దీనిని పూజామందిరంలో ఉంచి నిత్యం పూజించడం వలన శుభాలు కలుగుతాయి.

👉కుబేరుని అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వారు ఐశ్వర్యవంతులు అవుతారు. సుఖ శాంతులు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి.



ఆ చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట. కుబేరుడు గడగడా వణికిపోయాడు. పరమశివుని కాళ్ళ మీదపడి మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు ”మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపా లు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది.

ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది” అని కుబేరుని దీవించాడు. అంత కుబేరుడు పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో స్తుతించాడట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట. వారి అనుగ్రహంతో కుబేరునికి స్వస్ధత చేకూరిందట. అయినా శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్షగా, మచ్చలు శాశ్వతంగా వుండిపోయాయట.

పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీదేవి పసిమి ఛాయ.. అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చినప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది. ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగు పెట్టి తీసిన పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు. ఈ నీలవర్ణం, ఆ పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు, అక్కడ ఒక అద్భుతం జరిగిందట. ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా ‘ఆకుపచ్చ’గా మారిపోయిందట.

నీలం పసుపు రంగులను మిశ్రం చేస్తే, ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. కుబేరుడు ఆ ‘ఆకుపచ్చ మట్టి’ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహం నుండి విముక్తి పొందాడట. అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట. ఆనాటినుండి ‘పచ్చరంగు’ కుబేరునికి ప్రీతిపాత్రమయిందట. ‘పచ్చరంగు కుంకుమ’ కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రత ను సంతరించుకుంది. దీన్ని పూజగదిలో పెట్టుకున్నా, నుదుట ధరించినా ఐశ్వర్యాన్ని ఇస్తుంది.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: