Posts

Showing posts from April, 2021

శని రాహు (శపిత) యోగం - ఫలితాలు

శని రాహు (శపిత) యోగం - ఫలితాలు జాతకంలో శని రాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్పదోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపితయోగం అని అంటారు. కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు. కొంతమంది నిష్టాపరులైన జోస్యులు అయితే, ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి, ఆ జాతకునితో మాట్లాడటానికీ కూడా ఇష్టపడరు. గోచారరీత్యా శని రాహువులిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా లోకానికి ఇదే దోషం ఏర్పడుతుంది. వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని జరగదు. సామాన్యంగా అలా శని రాహువులు ఒకే రాశిలో కలవడానికి దాదాపు 11 లేదా 12 ఏళ్ళు పడుతుంది. కాని అలా కలిసినప్పుడు మాత్రం లోకంలో చాలా ఘోరాలు జరుగుతాయి. అలా కలిసిన రాశులను బట్టి కొన్ని దేశాలు, కొందరు మనుషులు, కొన్ని కొన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితము లౌతాయి. శని రాహువులు కలిసి ఉన్న సమయంలో పుట్టిన జాతకాలలో ఈ యోగం ఆయా లగ్నాలను బట్టి, ఇతర గ్రహస్తితులను బట్టి రకరకాలుగా ప్రతిఫలిస్తుంది. ఆయా జాతకులను ముప్పుతిప్పలు పెడుతుంది. కాలసర్ప యోగం ఎంత బాధపెడుతుందో ఈ యోగమూ అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది. అయితే అది బాధించే తీరూ ఇది బాధించే తీరూ వేర్వేరుగా ఉంటాయి. కా

బ్రిటిష్ వారు బెజవాడ కొనేశారు

Image
.           .🍁   3000 రూపాయలకు 🍁       .బెజవాడను కొనేసిన బ్రిటీష్ పాలకులు                       .🌷🍃🌷🍃🌷 మన బెజవాడ క్రీ.శ. 1731 నుండి క్రీ.శ. 1846 వరకూ కలువకొలను జమీందార్ల ఏలుబడిలో ఉండేదట. 1700 శతాబ్దం ప్రారంభ సంవత్సరంలో కలువకొలను తిరుపతిరావు బెజవాడలో జమీందారీనీ వ్యవస్థాపించాడు.   1731 లో ఆయన తరువాత ఆయన కుమారుడు నరసింహరావు ఆ తర్వాత అనేకమంది వారసుల చేతుల్లో ఈ జమీ నడిచిందట. 1770 లో సర్కారు జిల్లాలను ధారాదత్తంగా పొందిన బ్రిటీష్ వారు, ఈ జమిందార్లనుండి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. శిస్తు సరిగ్గా కట్టని జమీందార్లను నిర్ధ్యాక్షిణ్యంగా నిర్భందించి, చిత్రహింసలకు గురిచేసేవారట బ్రిటీష్ వారు. అలా కలువకొలను జమీందార్లు బాకీపడిన శిస్తు మొత్తం చివరి వారసులైన వెంకటనర్శింహరావు, తిరుపతిరావు-3 జాయింటు ఏలుబడి వచ్చేసరికి కొండంత పేరుకు పోయాయి. వెంకటనర్శింహరావు పెద్దవాడు కావడంతో చాకచక్యంగా తన వాటా జమీ శిస్తులను బ్రిటీష్ వారికి కట్టేసి బయటపడ్డాడు. చిన్నవాడైన తిరుపతిరావు-3, తన వాటా జమీ శిస్తు కట్టలేక, నైజాంకు పారిపోయి,కొద్దిరోజుల తరువాత మధిర వైపునుండి గెరిల్లా యుద్దం సాగించాడట. అప్పటి నూజి