Posts

Showing posts from February, 2022

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ వైభవము

శ్రీ అరుణగిరి ప్రదక్షిణ వైభవము అరుణాచల దివ్యక్షేత్రమునకు అత్యుత్తమ నివాళిగా చెప్పబడిన కార్యము "గిరి ప్రదక్షిణము". అరుణగిరి ప్రదక్షిణతో సకల పాపములు నశించి, అంత్యమున శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతము సమస్త భోగములకు నిలయము. దీనిపై ఎన్నో గ్రుహలు యున్నవి. వాటిలో ఎందరో మహాత్ములు నేటికీ తపము చేసికొనుచున్నారు. ఈ గిరి హిమాలయముల కన్నాప్రాచీనమైనది మరియు కైలాసము కన్నా మహత్తరమైనది. ఎందువలననగా కైలాసము - శివుని నివాసము అరుణాచలము - సాక్షాత్తు శివుడు ఎన్నో యుగములుగా అరుణాచలము ఎందరో ఉపాసకులను తన వైపుకు ఆకర్షించి వారిని కృత్తర్థులను చేసినది. ఈ పర్వతము చుట్టూ ఇరువది అయిదు మైళ్ళ వరకు దీని దివ్య తేజస్సు పడును. ఆ ప్రాంతమంతటా ఎటువంటి దీక్షా నియమములు లేవు. ఇంతటి సౌలభ్యము గల ఏకైక క్షేత్రము అరుణాచలము. "యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే" అని స్కాందపురాణము వర్ణించినది అరుణగిరి ప్రదక్షిణ గూర్చియే. జన్మాంతరముల యందు చేసిన పాపములు గూడా గిరి ప్రదక్షిణ వలన నశించును. స్కాందపురాణము "గిరి ప్రదక్షిణ" వైభవమును ఎంతో ఉన్నతముగా వర్ణన చేసినది. గిరి ప్రదక్ష

Planetary War in Astrology | Graha Yuddha

Planetary War in Astrology |  Graha Yuddha Graha Yudha or Planetary Wars Venus We know that this universe consists of different kinds of energies. Not all the energies work with each other. They work against each other too in certain situations. We have seen conflicts between human beings, animals, birds, or any living creatures. Conflicts exist even with different countries or groups within the country. Planets also do engage in a conflict like situations. When the energy of two planets comes in contact with each other, some kind of disharmony may arise.  In astrology, this phenomenon is called Graha Yuddha or planetary war.  Now the question is how close the two planets should come in contact which can be termed as planetary war. Dictums say when the distance between the planets becomes less than one degree, it can be considered as a planetary war. ....1 When we say two planets in the same degree/longitude, they may not be situated very close to each other. They may be located thousa

ప్రాచీన భారతీయ మహర్షులు 🧘‍♂️రచించిన రహస్య గ్రంధాలు

🚩ప్రాచీన భారతీయ మహర్షులు 🧘‍♂️రచించిన రహస్య గ్రంధాలు 🚩ఆసలు వాటి పేర్లు అయినా మనకు తెలుసా?🤔 🚩మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు . 🚩బృహద్యంత్ర సర్వస్వము🕉️ 🚩 భరద్వాజ మహర్షి రచించెను ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి, భయంకర వాయుగుండాల గురించి, అమిత విద్యుత్ శక్తి నుండి, అత్యుష్ణము, అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు.  ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ, సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్ర

మాఘపూర్ణిమ , మహా మాఘి

మాఘపూర్ణిమ , మహా మాఘి ఇది విశేష పర్వదినం. స్నానానికి ప్రాముఖ్యమైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) ఈ రోజునైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి. ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం. తిధుల్లో ఏ పూర్ణిమ అయిన సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిధే. ఈ తిధినాడు ఇష్టదేవతారాధన, ధ్యాన జపాది అనుష్టానాలు మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది. అన్ని పూర్ణిమల్లోకి మఘ, కార్తీక, వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్ధంగా గడుపరాదుని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. వైశాఖీ కార్తీకీ మాఘీ తిథయో౭ తీవ పూజితాః! స్నాన దాన విహినాస్తా ననేయాః పాండునందన!! స్నానదాన జపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాలు పూర్ణిమలను గడుపరాదు. మాఘ పూర్ణిమ నాడు " అలభ్య యోగం " అని కూడా అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. అది అంత తేలికగా లభించేది కాదు.

మన ప్రాచీన ఋషుల వివరములు

మన ప్రాచీన ఋషుల వివరములు భారత(ప్ర)దేశం ప్రపంచంలోనే మతం అన్నది లేని ఒక భవ్యమైన భూభాగంగా ఉండేది. ఇది ఎందఱో ఋషులకు నెలవు. వేలకొద్దీ ఋషులు ఈ దివ్యభూమిపై పుట్టారు. వారు మతం ప్రసక్తిలేకుండా, హింస లేకుండా ప్రజాహితార్థం పనిచేశారు. వారిలో కొద్ది మంది పేర్లు మాత్రమే మనకు తెలుసు. 500కు పైగా పురుష , స్త్రీ ఋషుల  పేర్లను సేకరించి ఇదిగో ఇలా మీకు అందిస్తున్నాను. అందుకోగలరు. ఋషుల నామధేయములు : 1 అంగాయన Angaayana 2 అంబరీష Ambareesha 3 అకృతవ్రణ Akritavrana 4 అక్షిల Akshila 5 అగస్త్య Agastya 6 అగ్నవేశ్య AgnaveShya 7 అగ్నిమాఠర Agnimaathara 8 అగ్నిసౌచీక (కశ్యప) Agni sowcheeka  (kasyapa) 9 అఘమన్య Aghamanya 10 అఘమర్షణ Aghamarshana 11 అఘోర Aghora 12 అజ Aja 13 అజామీఢ Ajaameedha 14 అతిథి Atithi 15 అత్రిబౌమ Atribowma 16 అనుహైవ Anuhaiva 17 అనూప Anoopa 18 అనోవేన (మూలాచారి) Anovena (Moolaachaari) 19 అపాండవ Apaandava 20 అప్నవాన Apnavaana 21 అభద్వసు Abhadvasu 22 అభరద్వాసు Abharadvaasu 23 అర్చనాన Archanaana 24 అవత్సార Avatsaara 25 అశ్ని Asni 26 అశ్వల Asvala 27 అశ్వలాయన Asvalaayana 28 అష్టాదంష్ట్ర Ashtaadamshtra 29 అష్ట

రథసప్తమికి జిల్లేడాకుకి సంబంధం ఏమిటి?

Image
🎊మహారుద్ర అఘోరపాశుపతం🎊 రథసప్తమికి జిల్లేడాకుకి సంబంధం ఏమిటి? 🎊 రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది. 🎊 దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు. 🎊 ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవవిమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. 🎊 అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒక మేక పై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి, దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆ చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. 🎊 అప్పటి నుండి ఆ చెట్టు మూల తత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. 🎊 అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేక చర్మంలా మెత్తగా

216 అడుగుల రామానుజ విగ్ర‌హం

Image
అంత‌పెద్ద రామానుజ విగ్ర‌హం ఎలా త‌యారు చేశారో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే........ గుడిలో ప్ర‌తిష్టించే చిన్న దేవును విగ్ర‌హం రూపొందించాలంటేనే ఎంతో క‌ష్టం. ఒక్కో గుళ్లో ఒక్కోలా క‌నిపిస్తుంటాడు దేవుడు. ఇక ఊరు మ‌ధ్య‌లో పెట్టే విగ్రహాల గురించి అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. సిమెంట్‌, రాయితో చేసే విగ్ర‌హాల‌ను త‌యారు చేయ‌డ‌మే అంత‌క‌ష్ట‌మైతే.. ఇక అతిపెద్ద‌దైన‌.. ప్ర‌పంచంలోనే రెండోదైన‌.. 108 అడుగుల‌.. పంచ‌లోహ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని రూపొందించ‌డం ఇంకెంత నైపుణ్యం అవ‌స‌ర‌మో ఊహించుకోవ‌చ్చు. మ‌రి, అది ఎలా సాధ్య‌మైంది? భ‌గ‌వ‌త్ సంక‌ల్పంతో పాటు చినజీయ‌ర్‌స్వామి కృష్టి, ప‌ట్టుద‌లే అందుకు కార‌ణం అంటున్నారు. చైనా కంపెనీ ప‌నితీరూ ఆ స‌మ‌తామూర్తి రూపాన్ని సాకారం చేసింద‌ని చెబుతున్నారు. ఆ వివ‌రాల‌ను దివ్య‌క్షేత్ర ప్ర‌ధాన స్థ‌ప‌తి వివ‌రించారు.  2013లో ఆలోచ‌న మొద‌లై.. 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు ప‌డింది. ముందుగా రామానుజాచార్యుల రూపంతో.. 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో ఆయ‌న‌కు న‌చ్చిన‌ మూడింటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూడు న‌మూనాల‌లోని మేలైన రూపురేఖ‌ల‌ను

తెలుసుకో దగిన ధర్మ సూక్ష్మాలు

🚩మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా! అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాం చూడండి. ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:🚩 🌹ధర్మో రక్షతి రక్షిత:  సత్య మేవ జయతే  అహింసా పరమో2ధర్మ:  ధనం మూలమిదం జగత్ 🌹 జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి 🌹కృషితో నాస్తి దుర్భిక్షమ్ 🌹 బ్రాహ్మణానా మనేకత్వం 🌹యథా రాజా తథా ప్రజా 🌹 పుస్తకం వనితా విత్తం పర హస్తం గతం గత: 🌹శత శ్లోకేన పండిత: 🌹 శతం విహాయ భోక్తవ్యం 🌹 అతి సర్వత్ర వర్జయేత్ 🌹బుద్ధి: కర్మానుసారిణీ 🌹 వినాశ కాలే విపరీత బుద్ధి: 🌹భార్యా రూపవతీ శత్రు: 🌹స్త్రీ బుద్ధి: ప్రళయాంతక: 🌹వృద్ధ నారీ పతివ్రతా 🌹 అతి వినయం ధూర్త లక్షణమ్ 🌹 ఆలస్యం అమృతం విషమ్ 🌹దండం దశ గుణం భవేత్   ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా! ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా👇 🌹ధర్మ ఏవో హతో హంతి "ధర్మో రక్షతి రక్షిత:" తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్ 🍃ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే, అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూ

స్నానం ఎన్ని రకాలు వాటి ఫలితాలు ?

స్నానం ఎన్ని రకాలు వాటి ఫలితాలు ?  అన్ని మతాలలోనూ దేవుడు, దేవుని ఆరాధన వుంది. సంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కాని మూలము, అర్థము, పరమార్ధము, ఒక్కటే.  దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు. అది ఒక నమ్మకము మాత్రమే.  స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది.  చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది.  వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్‌లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది.  గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది.  అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది.  ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది.  అసలు స్నానం అంటే ఏమిటి?  ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి? మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది.  హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు.  స్నానాలని అయిదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. 

భారతీయశాస్త్రం📖శాస్త్ర విజ్ఞానము

భారతీయశాస్త్రం📖శాస్త్ర విజ్ఞానము 👩🏻తల, కనుబొమ్మల, వెంట్రుకల లెక్క ఇదీ తెలిశాక తీరును నేటి అ'నాగరికుల 👩‍💼తల తిక్క మన భారతీయ సంస్కృతిలో అతి సూక్షామతి సూక్ష్మ విషయాలూ కాలిగోటి నుండి తల వెంట్రుక వరకు సంబందించిన వివరణ కలదు. ఎందరో ఋషులు ( శాస్త్ర-నిపుణులు) వారి తపోశక్తి🧘‍♂️తో మానవ-జీవన మార్గదర్శక-సూత్రాలను ఆచార-వ్యవహారాల రూపంలో అనుసరించుటకు వీలుగా పొందుపరిచారు.  వాటిలోని పరమార్ధం 🔬 శాస్త్రీయత 🤷🏻‍♂️ఆచారాలు🕉️   🤔 🌞సూర్యుడు మరియు ఇతర గ్రహాల☄️శక్తులు, ఆకాశాన్ని మాత్రమే కాకుండా 🧘‍♂️మన శరీరంలోని అనేక భాగాలను కూడా వ్యాపించి ఉన్నాయి.🤷🏻‍♂️తెలుసా? ముఖ్యంగా🤲 చేతులు, కళ్ళు👣 వీపులో, నవగ్రహ శక్తులు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి అందుకే స్త్రీలు ఎలాంటి కష్టాలు లేకుండా అపారమైన గ్రహాంతర శక్తులను పొందాలని భర్తలు స్నానం చేసే సమయంలో భార్యలు వీపురుద్దేవారని మన పూర్వీకులు చెప్పారు. కానీ నేడు అది స్త్రీలను అగౌరవపరచడంగా నేటి కలికాలంలో చెలామణి అవుతున్న విషయం. అదేవిధంగా, స్త్రీల కుడి కన్ను ఎడమ కన్ను సౌర మరియు చంద్ర శక్తులను కలిగి ఉంటాయి. ఈ రెండు కళ్ల మధ్య మచ్చ లేకుండా కనుబొమ్మ మధ్యభాగంలో తిలకం (బ

మహాభారతంలో సైన్స్

🧬🧬🧬శాస్త్రవేత్తలకే అంతుచిక్కని🤷🏻‍♂️ సైన్స్ మహాభారతంలో   🤔 👉మహాభారతం వ్యాసుడు రచించి 5,000 సంవత్సరాలు అవుతుంది. అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. 5 వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో ఎక్కడ అ ఏ భాష లేదు, ఏ లిపి లేదు, అలాంటి సమయంలో ఇప్పటికీ సాధ్యం కానీ ఈ విధంగా గ్రంధాన్ని రచించడం గొప్ప విషయం. 👉 మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు, ఇంతటి 5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం, లేదు రాదు. 👉మహాభారతంలోని ఆదిపర్వం లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. 👉ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, పుట్టుక - వ్యాసుడు - నియోగ ధర్మం - ద్వారా అంబా, అంబాలిక లు కనడం. దాసికి విదురుడు జన్మించడం. 👉ఇక్కడ ముగ్గురికి పుత్రుల జన్మించడం జరిగింది మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు. ⚜️ 📿 1974లో  అయోవ యూనివర్సిటీలో 📿 డోనాల్డ్ 📿 లాకె అనే ఇద్దరూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు, స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితి లే బిడ్డ లింగాన్ని నిర్ణయిస్తాయి, అని ప్రపంచానికి తెలియజేశారు. 👉నేడు మనం వాడే 📿 స్పెర్మ్ డొనేషన్* ఆనాటి - నియోగపద్ధతి ఒకటే. ఈ ఆ పిండం కింద పడింది. 👉 వ్య