తాంత్రిక అంటే ఏమిటి


తాంత్రిక విద్య అంటే ఏమిటి :-

ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని, రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు. దాన్ని తంత్ర అనరు. కుతంత్రాలు అంటారు. ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు, వస్తువులను, ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం. తంత్ర అనేది ఒక శక్తి గల మంత్రంతో గూడిన సాధనం లాంటిది. ఆ సాధనమును శత్రు సంహారానికి ఉపయోగించవచ్చు. చెడు సంకల్పంతో చెడు కార్యములకు ఉపయోగించవచ్చు. కత్తితో ఫలములను, దర్భలను కోయవచ్చు జీవహింస చేయవచ్చు. అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి ఉంటుంది. మంచికి చేస్తే మంచి ఫలితంను, చెడుకు చేస్తే చెడు ఫలితాలను పొందటం జరుగుతుంది. 

భారతంలో శకుని, తంత్రంను ఉపయోగించి తన ఇష్ట కార్యసిద్ధి జరుపుకోవడానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు. అందుకు కారణంగా అది చెడు అవడం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయింది.

 కాని కౌరవులు పాచికల రూపంలో ప్రేతాత్మలను ఉపయోగించి, చెడు బుద్దితో చేసిన పాపం, తాంత్రిక కర్మ వలన చివరకు సర్వ నాశనం అయిపోయారు. చేసే సంకల్పమును బట్టి ఈ తాంత్రిక విద్యల ద్వారా ఫలితాలు పొందడం జరుగుతుంది.

 శ్రీకృష్ణుడు తాను సృష్టించిన మంచికి, ధర్మానికి చెడు ఎదురవుతున్న సందర్భంలో ఆ చెడును నిర్మూలించగల శక్తి ఆ పరమాత్మకి ఉన్నప్పటికీ, తంత్ర విద్యల ద్వారా మానవ రూపంలో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి నిర్మూలించాడు. 

ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలనా మార్గాలను తంత్ర విద్యల రూపంలో ఆ శ్రీ మహావిష్ణువే వరంగా ప్రసాదించారు. 

మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను, వారు చేసే లేదా చేయించే అభిచార కర్మలను, మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించారు. 

ఎంతో శక్తివంతులు మరియు శూరులూ, ధీరులు, ధర్మ పరాయుణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది. 

చరిత్రలోకి వెళితే అణు ఆయుధాలు తంత్ర విద్యలే కదా? 

మహాభారతంలో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైన నాగాస్ర్తం, దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు. ఆగ్నేయాస్త్రం, కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది, పాశుపతాస్త్రం ఇది మహాదేవుడికి సంబంధించినది. వాయవ్యాస్త్రం ఇది కేతువు, వాయు దేవుడికి సంబంధించినది. వారుణాస్త్రం ఇది వరణుడికి సంబంధించినది. ఇలా ఎన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదంలో భాగాలే .. 

అంటే ఇక్కడ మనం తెలుసుకోవల్సినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలు. రాక్షస పీడను, శత్రు పీడను, నిర్మూలించడం కోసం రూపొందించిన విద్యలు .. 
ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో కూడా రాక్షస పీడను నిర్మూలించి లోక కళ్యాణం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు. 

ఇందులో మర్మం ఏమిటి అంటే పైశాచిక తనాన్ని నిర్మూలించడమే !! 

కొంత శ్రద్ధగా గమనిస్తే ఇందులో మర్మం అర్థం అవుతుంది. ఎదుటి వారి పై తంత్ర విద్యలు ప్రయోగించాలన్న వారికి పూర్వ జన్మ పాపాలు, శాపాలు అధికంగా ఉంటేనే అవి వారి పై ప్రభావాన్ని చూపుతుంది. 

అంటే చేసే ప్రతీ క్రియ కూడా కర్మ ఫలమే .. అది మంచి కానీ చెడు కానీ, పైశాచిక గ్రహాల చెడు ప్రభావాలను నిర్మూలించడానికి మాత్రమే తంత్ర విద్య ఉపయోగపడతాయి .. 

మన నుదిటి వ్రాత ఆ బ్రహ్మ ఆజ్ఞానుసారం జరుగుతుంది. మనిషి ఎదుర్కొనే భాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం ఈ తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించారు. 

ఇందులో అంతర్యం ఏమిటి అంటే, వర్షం వచ్చినప్పుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుంచి తడవకుండా ఉండగలుగుతాం .. 

వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత .. 
మండుటెండ కాచినపుడు పాదరక్షలు దరించడం ఆ వేడి తాపం నుంచి కాళ్ళు కాలకుండా రక్షించుకోవడం. 

వేడి తాపం అనేది సూర్య గ్రహ రూపంలో బ్రహ్మ మనపై చూపుతున్న వ్రాత .. 
వర్షం నుంచి, సూర్య తాపం నుంచి కాపాడే గొడుగు, పాదరక్షలు గ్రహ దోష నివారణా మార్గాలు లాంటివి .. 

విధిని తప్పించుకోవడం కష్టం కానీ, తామస, రజో, లక్షణాలు కలిగిన శత్రు పీడ నివారణా, అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు ..!! 

ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంత వరకు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి .. 

అలా కాకుండా కామ, క్రోధ, మద, మత్సర్యాలతో, అసూయతో, ఈర్ష్యా ధ్వేషాలతో ఇతరులపై చేయడం అంత మంచిది కాదు. 

శక్తివంతమైన ఈ తాంత్రిక విద్యలను అభ్యసించడం వల్ల మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసిన అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు .. 

స్త్రీ అనుబంధ ప్రాప్తి, స్త్రీ సాంగత్య ప్రాప్తి, నష్ట ద్రవ్య ప్రాప్తి, కార్యసిద్ధి, వ్యాపార అభివృద్ధి, కోర్టు వ్యవహారాలు, మొదలైన వాటిలో విజయాన్ని పొందుతారు... 

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఏ స్థాయిలో ఉన్నవ్యక్తికి ఆ స్థాయిలో శత్రు పీడ ఉంటుంది .. 

వివిధ దుష్ట గ్రహ ప్రభావం ఉంటుంది .. అందరికీ ఆర్థిక వెసులుబాటు ఉండదు.. మీ శత్రు సంహారం కోసం చేయగలిగే ఈ తంత్ర మార్గాలను ఆర్థిక బలం, అంగ బలం లేని వారు కూడా అభ్యసించవచ్చు ..
ఉపయోగించవచ్చు .. 
జీవుడు తాను పుట్టిన నాటి నుండి మరణించే వరకు తన యొక్క పూర్వ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలాన్ని అనుభవించడానికి విధి రూపంలో ఎన్నో ఎన్నెన్నో అనుబందాలను, ఆనందాలను, ఐశ్వర్యాలను, ప్రేమానుబంధాలను, భాధ్యతలను, సుఖాలను అనుభవించడం జరుగుతుంది .. 

పూర్వ జన్మలో ఎవరితోనైతే శత్రుత్వం కలిగి ఉంటారో, ఈ జన్మలో వారికి బాంధవ్యాల రూపంలో సంబంధం బాంధవ్యాలు ఏర్పడతాయి .. 

ఇలా ఎన్నో రకాలుగా జరుగుతుంది .. 
పూర్వ జన్మలో తాము ఎదుర్కొన్న అనారోగ్య , ఆర్థిక, సామాజిక, కుటుంబ, బంధుత్వాలు ఋణశేషం ఇహ జన్మలో మానవుడు అనుభవిస్తున్నాడు .. 

ఆ పూర్వ జన్మలో గ్రహాల ద్వారా యోగాల, అవయోగాల ద్వారా వాటిని అనుభవించి కర్మఫలాన్ని సంపూర్ణం చేసుకోవడం జరుగుతుంది .. ఇది శాస్త్ర సమ్మతం !!! 

అయితే ఈ జన్మలో ఎదుర్కొంటున్న , ఎదుర్కోబోయే సమస్యలు, దోషాలు వేద జోతీష్య శాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం .. 

కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టినప్పుడు ఈ కర్మఫలంలో ఉండే అతి భయంకరమైన మానసిక, శారీరక సంక్షోభాలకు గురి చేసే విధి వ్రాతను తప్పించుకోవడం ఎంతవరకు సాధ్యం ? అని ప్రతీ ఒక్కరికీ సందేహం కలుగక మానదు !? 

విధి అనేది తప్పక అనుభవించాల్సినదని దాని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రతీ ఒక్కరూ అనుకుంటూ ఉంటారు !! 

పురాణాల ప్రకారంగా చూసినట్లైతే గంధర్వులు, యక్షులు, శాపాలకు గురి కావడం మనం చదివాం .. 
శాపాలకు గురి కావడం అనేది విధి .. 
శాపాలకు విమోచన, విరుగుడు చేసుకోవడం అనేది ఆత్మ సంకల్ప విధి !! 

పూర్వ జన్మ కర్మఫలం శరీర రూపంలో ఆత్మ అనుభవించడం జరుగుతుంది .. 

శరీరం రూపంలో ఉన్న ఆత్మ పాపపుణ్యాలను అనుభవించడం వలన స్థూల శరీరానికి మాత్రమే ఆ నొప్పి, ఆనందం తెలుస్తాయి .. 

అంతేగానీ శాశ్వత అత్మకు కాదు .. 
కర్మ ఫలం ద్వారా కానీ, మానసిక దౌర్బల్యం వలన గాని, సమస్యలు ఎదుర్కొంటున్న శరీరమునకు ఉపశమనం ఇచ్చే మార్గాలే అంతరాత్మ ద్వారా మనకు భగవంతుడు తెలిజేస్తాడు.. 

ఆ భగవంతుడు ఇచ్చిన తాంత్రిక మార్గాలే ఈ తంత్ర విద్యలు .. 

కర్మఫలాన్ని అనుభవించడానికి మనపై భగవంతుడు ఏర్పరిచిన ఈ మాయా బంధాల సమస్యలను ఎదుర్కోవడానికి ఆ పరమాత్మే మార్గాలను చూపాడు .. 

మహాభారతంలో శత్రువులను సంహరించడం కోసం శ్రీ కృష్ణుడు అర్జునుని చేత ప్రయోగింపబడ్డ శస్త్ర అస్త్రాలు తంత్రములే కదా ..!! 
గ్రహాల రూపంలో, గ్రహాల ద్వారా ప్రయోగింపబడ్డ అత్యంత శక్తివంతమైన నాగాస్త్రం, దీనినే వశీకరణాస్త్రం అని పేరు .. 

ఈ వశీకరణ అస్త్రం శుక్రుడు, రాహు గ్రహముల సహాయంతో ప్రయోగిస్తారు .. 
గ్రహముల ద్వారా మంత్రములను ప్రయోగించే వాటిని అస్త్రాలు అంటాం.. 

తంత్ర విద్యలను అభ్యసించి ఉపయోగించి ప్రయోగించడాన్ని తంత్ర అంటాం.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: