నక్షత్ర , బుధ లోక వర్ణన*💫

*కాశీ ఖండం - 14*
🕉️⚜️🔱⚜️🔱✡️🔱⚜️🔱⚜️🕉️

🌈 *నక్షత్ర , బుధ లోక వర్ణన*💫

💫 శివశర్మ - విష్ణుదూతలను నక్షత్ర లోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా, వారు వివరించారు. 

💫 పూర్వం బొటన వ్రేలి వెనుక భాగం చేత, సృష్టి నంతా సృజించిన దక్షడు ప్రజాపతి అయాడు. ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారంతా మంచి రూపంతో లావణ్యంతో ఉన్నవారు. వారిలో రోహిణి మిక్కిలి సౌందర్యవతి. వారందరితో దక్షుడు కాశీ నగరంలో ఘోర తపస్సు చేశారు. సోమ శేఖరుని ఆరాధించారు. ఈశ్వరుడు సంతోషించి, ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. దక్షుని కూతుళ్ళు, ‘’నీ వంటి తాపహారి, రూప సంపన్నుడు, అయిన భర్తను ప్రసాదించు‘’ అని కోరారు. వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్థాపించి, వరుణా నది ఒడ్డున, సంగమేశ్వర స్వామి సన్నిధిలో, చాలా కాలం తపస్సు చేశారు. వారి స్థిర మనస్సుకు సంతసించి, 

💫 ‘’అమ్మాయిలూ ! మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను. మీ కోరిక నేరవేరుతుంది. జ్యోతిశ్చక్రంలో మీరు అగ్రగణ్యులవుతారు. 
మీ నుండి, మేషం మొదలైన రాశులు జన్మిస్తాయి. బ్రహ్మ చేత, ఒషధీషుడుగా చేయబడిన సోముడు మీకు భర్త అవుతాడు. మీరు పూజించిన ఈ నక్షత్రేశ్వర లింగాన్ని అర్చించినవారు, నక్షత్ర లోకం చేరతారు అని వరాలిచ్చాడు శివుడు.

💫 అక్కడి నుండి, శివశర్మ, విష్ణు భటులు బుధలోకం చేరారు. ఇది బుధ లోకమని విష్ణు దూతలు చెప్పారు. దీనిని చూసిన వారు, స్వర్గాన్ని కూడా కోరుకోరు. సోముడు ద్విజ రాజయ్యాడు. రోజుకు పది పద్మాలను మాత్రమే భుజిస్తూ, రాజ సూయ యాగం చేశాడు. త్రిభువనాలను, దక్షిణగా ఇచ్చాడు. అతడు బ్రహ్మ మనుమడు.అత్రి నేత్రం నుండి జన్మించాడు. ఓషధులకు అధిపతి. షోడశకళలు ఉన్నవాడు. తన అమృత కిరణాలచే, లోకాల తాపాన్ని, తీరుస్తాడు. సోముని పదునారవ కళను, శివుడు, శిరస్సున ధరించాడు.

💫 చంద్రుడు ఆంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను, మదముతో కామించాడు. దేవతలు, ఋషులు వద్దని వారించినా వినకుండా, బృహస్పతి భార్య తార ను మోహించాడు. ఇదంతా మన్మధుని ప్రతాపం. "అజగం" అనే ధనుస్సును చేతిలో ధరించి, తన తలపై ఇతన్ని ఉంచుకొన్నా, తారను వదిలి పెట్టలేదు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మశిరోనామ కాస్త్రాన్ని, సోముడిపై విడిచి పెట్టాడు. బ్రహ్మాండ మంతా భయపడి పోయింది. వెంటనే బ్రహ్మ వచ్చి, తారను సోముని నుండి విడిపించి, బృహస్పతికి ఇచ్చాడు. ఆమె అప్పుడు గర్భవతి. ఆ గర్భాన్ని వదిలించుకోమని, బృహస్పతి ఆమెకు చెప్పాడు. ఆమె ముండ్లపోదలోకి వెళ్లి, ఒక స్తంభం చాటు చేరి, గర్భ స్రావం చేసుకొన్నది. దేవతలు ఆ శిశువును తీసుకొని వచ్చి, తారను గ్రహించమన్నారు. ఆ శిశువు సోముడికి జన్మించాడా బృహస్పతికా అని అడిగారు. ఆమె చెప్పలేక పోయింది. బ్రహ్మ వాళ్ళను దూషించాడు. బ్రహ్మ తారనే అడిగాడు. చంద్రుని కుమారుడే అని చెప్పింది. శిశువుకు ‘’బుధుడు‘’ అని పేరు పెట్టాడు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్లి, తాను తపస్సు చేసుకోవాలనుకొంటున్నానని చెప్పాడు. కాశీ వెళ్లి ఒక లింగాన్ని స్థాపించి పూజించాడు. అదే బుధేశ్వర లింగం. శివుడు ప్రీతీ చెంది వరం కోరుకోమన్నాడు. అతని కోరికననుసరించి నక్షత్ర లోకానికి పైన ఉన్న లోకం బుధ లోకమని పేరు పొందింది. బుదేశ్వర లింగం దుష్ట బుద్ధిని పోగొట్టుతుంది. సజ్జనులచే గౌరవింపబడే వారు, బుధలోకం చేరుతారు. చంద్రేశ్వరునకు తూర్పుగా ఉన్న బుధేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు, అంత్యకాలంలో, ఉత్తమ బుద్ధి పొందుతాడు.

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: