మణి ద్వీప వర్ణన 01.*_

_*మణి ద్వీప వర్ణన 01.*_
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅

*ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః, ఓం పరామ్బికాయై నమః*

జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహాముని !జగదంబ కథామృతము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ? అని , వైకుoఠానికా? లేక సుమేరు గిరికా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ? అని అడుగగా, " మణి ద్వీపము, అత్యంత రమణీయము, అమ్మవారికి అది క్రీడా స్థలము , అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది. మళ్ళీ పురుషత్వము పొంది, తమ కార్యాలలో నిమగ్నులయ్యారు. ఆ పరమ దామము అమృత సాగరము మధ్యన ఉన్నది. అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది. దేవతలు స్తుతింఛిన అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన. ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము. ఈద్వీపమున కు ఉన్నంత సౌందర్యము మరి ఏ ద్వీపానికి లేదు . 

అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి , తరంగాల, చల్లని తుమ్పరలను మోసుకోస్తుంటాయి. గాలి వలన ఉవ్వెత్తున లేచే అలలు, ఆ ద్వీపానికి ఎంతో శోభను కలుగచేస్తున్నది .

ఇక్కడి ఇసుక రత్నాల మయము . అందులో చిన్న- చిన్న శంఖులు ఉన్నాయి . ఒడ్డున మత్సాలు , ఒవ్వెతున లేచి పడే తరంగాలు , తమ వెంట అమృతపు నీటి తుమ్పరలను వేదజల్లుతుంటే ఆ ద్వీప శోభ చెప్పతరము కానిది . అనేక రకాలైన ధ్వజాలతో , అక్కడక్కడ తేలే నౌకలతొ , సుధా సాగరము శోభాయమానo గా ఉన్నది . ఈ సముద్రపు ఒడ్డున రత్నమయ వృక్షాలు వింత శోభను కలుగచేస్తున్నాయి. తరువాత లోహముతో చేయబడ్డ గోడ ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి . ఇట్టి లోహపు కోటలో అనేకానేక శస్త్రాలు ధరించిన ప్రహరీలు ఉన్నారు. వీరికి యుద్ధ సంబంధిత విశేష జ్ఙానము ఉన్నది . సమస్త విద్యలు తెలుసు . ఈ రక్షకులు ఎల్లప్పుడూ ఆనందముగా ఉంటారు. 

ఈ కోటకు నలుగు ద్వారాలు . ఈ గోడ చుట్టూ అనేక గణాలు ఉంటారు . వీరంతా దేవి భక్తులు . భగవతిని దర్శించటానికి దేవతలు విమానాలు ఎక్కి ఇక్కడికి వస్తు పోతుంటారు . వందల కొద్ది వచ్చే విమాన ధ్వనులచే నిండి ఉంది . చాలా చోట్ల తీయని నీటి సరోవరాలు ఉన్నాయి. వనాలు , వృక్షాలు రత్నాల వలె మెరుస్తూ వింత శోభను కలిగి ఉన్నాయి . ఇనుప కోట , తరువాత కాంస్యపు కోట ఉన్నది . దీని శిఖరము ఆకాశాన్ని తాకుతున్నది . 

తేజానికి పూర్వ ప్రాకారానికంటే , వంద రెట్లు అధికముగా ఉన్నది . గోపురము మరియు ద్వారాల తో చాలా బాగున్నది . ఇక్కడ అన్ని రకాల జాతుల పూల వృక్షాలు , ఫలాల వృక్షాలు ఉన్నాయి . ఇక్కడ లభించని చెట్టే లేదు . అన్ని జాతుల మొక్కలు ఉన్నాయి . అనేక రకాల వనాలు , ఉపవనాలు ఎం తో శోభాయమానముగా ఉన్నాయి . అందమైన బావులు ఉన్నాయి . అక్కడి వనాలు కోయి ల పాటలతో , పక్షుల కిల కిలలతో మధుర నాదాన్ని వినిపిస్తున్నాయి . భ్రమరాల వింత ధ్వని , శోభను కల్పిమ్పగా ఇక్కడి వృక్షాల నుండి మధుర తెనే రసాలు కురుస్తున్నాయి . 

అనేక విధాల పక్షుల అందాన్ని శోభను కలుగ చేయగా , అనేక విధాల రసవాహిని నదుల ధారలు, వృక్షాలు, ఏంతో శోభాయ మానముగా ఉన్నవి. పావురాలు, పిచ్చుకలు, ఎన్నో జాతుల పక్షులు ఉన్నాయి. రామ చిలుకలు, హంసలు, ఎగురుతుంటే చెట్లు అలికిడి చేస్తున్నాయి కాంస్య ప్రాకారము కాగానే, రాగి ప్రాకారము ఉంది. ఈ ప్రాకారపు ఆకారము , చతుశ్రాకారము. ఈ రెండు ప్రాకారాలకు మధ్యన కల్ప వృక్షపు వాటిక ఉంది . వీటికి పూసే పూలు బంగారు వన్నెను కలిగి ఉంది . ఆ పూలు మెరుస్తుంటాయి . ఆకులు సహితము బంగారు వన్నె తో మిలమిల లాడుతుo తాయి . వాటి బీజాలు, ఫలాలు రత్నాలు గా మెరుస్తున్నాయి. అట్టి వనాల సుగంధము నాలుగు దిశలలో పది యోజనాల వరకు వ్యాపించి ఉంది . 

అక్కడ ఎప్పుడు వసంత రుతువు ఉంటుంది . అక్కడ పూలచే నిర్మింప బడిన పూల గొడుగులతో పూల సింహాసనము పైన వసంతుడు ఉంటాడు. “మధు శ్రీ “మాధవ శ్రీ “వారికి ఇద్దరు భార్యలు . కామదేవుని వంటి సౌoన్దర్యము కలిగిన ఈ దేవతలు పూల బంతి తో ఆడుతుంటారు . ఈ వాటిక నలు వైపులా తేనే ధారలు వడుస్తుంటాయి. పుష్పాల పైనుండి వీచే గాలులు అక్కడి కి పదియోజనాల వరకు సువాసనను మొసుకేళ్తుంది. గానాలు చేస్తూ గంధర్వులు ఇక్కడ తమ పత్నులతో విహరిస్తుంటారు . అనుపమ శోభలతో ఈ వనము మురిపింప చేయగా కోకిల ల నినాదముతో గుంజితమై ఉన్నది .
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: