మణి ద్వీప వర్ణన - 15*_

_*మణి ద్వీప వర్ణన - 15*_
🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸

*ఓం శ్రీ గణేశాయ నమః ,*
*ఓం శ్రీ గురుభ్యో నమః*
*ఓం శ్రీ పరామ్బికాయై నమః*

అపారమైన పరమ జ్యోతి అమ్మ భువనేశ్వరీ తమ మధుర మైన వాక్కు తో పలుకాగానే , వీణా నాదాన్ని సహితము వెల-వెల పోయింది . ఆమె పలుకులు వీణా నాదము కన్న మిన్నగా ఉన్నయ్యి . ఆమెకు ఎందఱో సఖులు, దాసీలు. దేవతాస్త్రీలు. అఖిల దేవతల బృందము ఆమెను చుట్టు ముట్టి ఉన్నారు, అందరు ఆమె ఆజ్ఙ కొరకు వేచి ఉన్నారు. ఆ తల్లి ఇచ్చా శక్తి , జ్ఞాన శక్తి , క్రియా శక్తి చే సంపన్నురాలు. లజ్జ, తుష్టి, పుష్టి , కీర్తి , కాంతి, కీర్తి , క్షమా దయా, బుద్ధి మేధా,, ఇవన్ని మూర్తిభవించి అందరు అమ్మచెంత చేరాయి. జయా, విజయా, అజితా, అపరాజితా, నిత్యా , విలాసిని, దోగ్ధ్రీ అఘోరా, అమంగాళా ఇవి తొమ్మిది శక్తులు, భగవతి పరామ్బిక సేవ లో తత్పరులైయ్యి ఉంటారు . శంఖ నిధి, పద్మ నిధీ భగవతి కి పార్శ్వ భాగాన ఉన్నారు. పద్మ నిధి
నవరత్న వహా, కాంచనసహత్ర ,సప్త దాతువహా, సంఘ్యక్, నదులు, ఈ ధాతువులనుండి ప్రవహిస్తాయి . ఇవన్ని వెళ్లి సుదాసగారములో కలుస్తాయి. ఈ విధముగా సమస్త శక్తులు కలిగి ఉన్నట్టి భువనేశ్వరీ దేవి , భువనేశ్వరుని తో కూడి ఉన్నది.” సర్వేశుడు “ అన్న బిరుదు భువనేశునికి అమ్మ వలన నే వచ్చినది. వ్యాసులవారు చెపు తున్నారు రాజా, ఇప్పుడు ఈ చిoతామణి గృహము యొక్క పరిమాణము గూర్చి విను.“ఇది ఓక వేయి యోజనాలు తో అతి పెద్దగా ఉన్న విశాలమైన భవనము. వేయి యోజనాల పొడవు, వేయి యోజనాల వెడల్పుతో ఉంది . దీనికి ఉత్తరాన అనేకమగు సుదీర్ఘముగా ఉన్న ప్రాకారాలు ఉన్నయి. పూర్వ ప్రాకారాని కన్న ఉత్తర ప్రాకారములు రెండంతలుగా ఉన్నాయి. అని చెప్ప బడింది .

దేవి భగవతి మణి ద్వీపము భూమి పైన లేదు, అంతరిక్షములో ఉన్నది . ప్రళయములో,దీనికి వినాశము లేదు. ఇది సృష్టికి ముందు కూడా ఉన్నది. కాని ఇందులో కార్యాను కూలముగా సంకోచాలు, వికాసాలు జరుగుతుంటాయి. ఇందులో భగవతి మహామాయ నివసిస్తుంది. ఇక్కడికి సమస్త లోకాలనుండి అమ్మ భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మను గూర్చి తపస్సును చేసుకుంటూ తమ ప్రాణాలు వదులుతారు .
అందరు వెళ్లి మహోత్సవ దగ్గరికి చేరి పోతారు.అక్కడ ఘ్రుత కుల్యా , దుఘ్ద కుల్యా, దధీ కుల్యా , మధస్త్రవా ,అమృత వహా,, ద్రాక్షారసవహా , జమ్బురసవహా , ఆమ్రేక్షు రసవహా. ఈ నదులు ప్రవహిస్తుంటాయి. మనోరథ ఫలాలు ఇచ్చేటి, వృక్షాలు , బావులు, సరస్సులు, అందరు, యథేష్టముగా సేవిచు కొరకు , అన్ని దొరకుతాయి. మణి ద్వీపములో ఎవరు రోగాల బాధలు తో ఉండరు. వృద్దాప్యములు ఉండవు, ఈ దివ్యమగు క్షేత్రము లో కామ క్రొధములుండవు. అక్కడ నివసించే ప్రతి ఒక్కరు యవానవస్తలోనే ఉంటారు. స్త్రీ యుక్తముగా కోటి సూర్య తేజముతో ప్రకాశిస్తుంటారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు దేవిని ఉపాసిస్తారు. 7 కోట్ల మహా మంత్రాలు దేవిని ఆరాధిస్తుంటారు . కారణ బ్రహ్మ స్వరూపిణి. శివా . మాయాబలము చే సబల విగ్రహాన్ని సృష్టించింది. మహావిద్యలు , సతతము ఆమెను సేవిస్తాయి .

వ్యాసులు చెపుతున్నారు రాజ ఈ మణి ద్వీపాన్ని ఎవరు వర్ణించలేరు , ఒక్కోసారి చిన్న పెసరు గింజ అంత ప్రకాశము కనబడితే మరో పక్క సూర్యడిలా తేజం కనపడు తుంటుంది, ఒక్కో సారి, మరకత మణి లా ప్రాకాశాన్ని వెదజల్లు తుంటుంది ఒక్కో సారి విద్యుత్తూ లా కనపడితే , ఒక్కో సారి మధ్యాన్హ తేజము ప్రకాశమానముగా కోటి సూర్య కాంతులు కనపడతాయి . ఒక్కో చోట సిందూర్ వర్ణ కాంతి కనపడితే వెంటనే రక్తవర్ణ మెరుపు కనపడుతుంది, నీలమణి కాంతులు వెదజల్లుతుంటుంది , కొన్ని చోట్ల దావానల కాంతి పుంజాలు కనపడతాయి . ఇవన్ని వన్నెలు కలిగిన కాంతులతో ఎల్లప్పుడూ దేదిప్యమానముగా ప్రకాశించే అమృత మయ కాంతుల లోకమే ఈ మణి ద్వీపము .

వర్ణించలేని కాంతులచే నిర్మితమైన గోపురాలు, ప్రాకారాలు, భవనాలు, మందిరాలు, వృక్షాలు, నేమిల్లు కోకిలలు అన్ని జాతుల పక్షులు , అన్ని ఆత్మా స్వరూప ప్రకాశాన్ని పూనీ వెలుగొందే ఈ లోకమే మణి ద్వీపము. ప్రపంచలో ఉన్నట్టి అన్ని ఆనందాలు ఇక్కడ లభ్యము అవుతాయి. మధుర సుగందితంయ్యి ఉన్నట్టి ఈ లోకము రంగురంగు ల ఎండలచే చల్లని కాంతి యుతముగా ఉన్నది , దర్పణ రూపములో ప్రకాశిస్తూ , ఒక్కో సారి జాలము లా ప్రకాశిస్తున్నది. రాజు కు కలిగేటి ఆనందమును మొదలుకొని , బ్రహ్మ పర్యంతము పొంద గలిగే ఆనందము ఇక్కడ లభిస్తుంది .

మహాదేవి పరమదామము అయినట్టి ఈ పురిని స్మరిచిన , సమస్త పాపాలు హరించి పోగలవు. చివరి సమయమందు దీనిని స్మరించిన మణిపురి నివాసమే తథ్యము ,”దేవి భాగవతము లో 8వ అధ్యాయమును మొదలుకొని 12 ఆదాయము పర్యంతము “అధ్యాయ పంచకము అని చెప్పబడింది . దీనిని నిత్యమూ పతించిన చొ భూత ప్రేత పిశాచ బాధలు తొలగి , పోతాయి వాస్తు , గ్రహ శాంతి చేయ దళిచినప్పుడు ప్రయత్నా పూరవకముగా ఈ అధ్యా యాలను చదివిన యెడల శుభములు చేకూరుతాయి.

*ఓం శ్రీ మాత్రె నమః*

*“సర్వం శ్రీ లలితార్పనమస్తూ “*

*అమ్మ త్రిపుర సుందరీ ! తల్లీ ! నాకు ఇంతటి భాగ్యమును ప్రసాదించి నీకు శతకోటి ప్రణామాలు*అందరికి శుభాలు కలిగించి ,“ ఆత్మ సత్యము అన్న తలంపును కలిగించి” మంచి మార్గాన నడిపించు. పరస్పర ప్రేమాభిమానాలు మాయందు ఉదయింప చేసి , ,మంచి మార్గాన నడిపించు . అందరి కష్టార్జిత సంపదలను కాపాడు ,పరివార ఆనదములు అందరికి లభించి , సుఖ సంతోషాలు కలిగి అందరిని సుభిక్షముగా ఉంచు తల్లీ !అందరికి, మంచి జ్ఞాన తృష్ణ కలిగించు “నీకు జయము, జయము తల్లీ !” ఓం శాంతి , శాంతి శాంతిహిః.*
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: