ఏయే చెట్లు నాటాలి

_*మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.*_ 

 *స్కంద పురాణంలో*  ఒక చక్కని *శ్లోకం* ఉంది.

*అశ్వత్థమేకం పిచుమందమేకం*
*న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|*
*కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ* *పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||.*

*అశ్వత్థ* =  *రావి*  (100% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) - 1

 *పిచుమందా* = *నిమ్మ* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది)- 1

*న్యగ్రోధ* = *మర్రి చెట్టు* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) - 1

*తింత్రిణి* = *చింత* (80% కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహిస్తుంది) - 10

*కపిత్థ* = *వెలగ* (80% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) - 3

*బిల్వ* = *మారేడు*  (85% కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది) - 3

*అమలకా* = *ఉసిరి* (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది) - 3
 *ఆమ్రాహ్* = *మామిడి* (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది) - 5
  *వాపి*  - *నుయ్యి* 

*అర్థం* 
ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి  ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణం)

ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం

ఇంకా ఏమీ తప్పులేదు, మన తప్పును మనం సరిదిద్దుకోవచ్చు.

*గుల్మోహర్*, *నీలగిరి* లాంటి చెట్లు మన దేశ పర్యావరణానికి ప్రాణాంతకం.

పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరించడం వల్ల మనకు మనమే గొప్ప హాని చేసుకున్నాం.

రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.

ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్‌ను పెంచుతాయి. 
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.

ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా *గుల్మోహర్*, *యూకలిప్టస్* *(నీలగిరి)* చెట్లను నాటడం లోప్రారంభించాం. యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. 
ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది. గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.

*గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు* అని పిలుస్తారు.

*మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|*

*పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||*

*భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో  శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు*.

రాబోయే సంవత్సరాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రావి, మర్రి, వేప తదితర చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.

*తులసి* మొక్కలను *ప్రతి ఇంటిలో* నాటాలి.

మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన *భారతదేశాన్ని* ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.

భవిష్యత్తులో మనకు *సహజ ప్రాణవాయువు* సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.

*రావి*, *మఱ్ఱి*, *మారేడు*, *వేప*, *ఉసిరి* మరియు *మామిడి* * మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి *ఆరోగ్యకరమైన* మరియు *ప్రకాశవంతమైన* *పర్యావరణాన్ని* అందించడానికి ప్రయత్నిద్దాం.

🌳🌳🌳🌳
🙏

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: