అపరాహ్ణ కాలము"

"అపరాహ్ణ కాలము" అనగా ప్రధానంగా సూర్యుడు అస్తోన్ముఖుడగు కాలము అని మనం గ్రహించాలి. 


గయ అనగా సూర్యుని అస్తోన్ముఖ కాలము లేక "అపరాహ్ణ కాలము" అని గయా శీర్ష పదమునకు ఆధి దైవికార్థము.గయలో పిండప్రదానము పుణ్యప్రదము అనగా అపరాహ్ణ కాలమందు పితృ దేవతలకు చేసిన పిండప్రదానము పుణ్యప్రదము.

"అపరాహ్ణ కాలం" పితృదేవతలను పూజించటానికి, శ్రేష్టమైనది అని వేదం తెలియజేస్తున్నది.

అయితే అపరాహ్ణ కాలము ఏది?
సూర్యోదయం నుండి, అస్తమయం దాకా పగలును ఐదు భాగములు చేస్తే, నాలుగవ భాగము అపరాహ్ణ కాలము. ఉదాహరణకు, సూర్యోదయం 6.00గంటలకు, అస్తమయం 6.00 గంటలకు అనుకుందాం. ఈ పగలును ఐదు భాగములు చేస్తే ఒక్కొక్క భాగము 2 గంటల 24 నిమిషములు. 
అప్పుడు, 
1.సూర్యోదయం 6.00 గంటల నుండి 8.24 వరకు

2). ప్రాతఃకాలము. 8.24 నుండి 10.48 వరకు

3).  సంగమ కాలము. 10.48 నుండి 1.12 వరకు 

4).మధ్యాహ్ణ కాలము. 1.12 నుండి 3.36 వరకు అపరాహ్ణ కాలము.

5). 3.36 నుండి సాయంత్రం 6.oo వరకు సాయాహ్ణ కాలము.

  కాబట్టి అపరాహ్ణ కాలమైన 1.12 నుండి 3.36 వరకు పితృకార్యములైన శ్రాద్ధాదులకు ప్రశస్తమైనది. పగలు ఒక్కొక్కప్పుడు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అది గమనించి కాల విభాగం చేసుకోవాలి.

"అపరాహ్ణ కాలము" అనగా ప్రధానంగా సూర్యుడు అస్తోన్ముఖుడగు కాలము అని మనం గ్రహించాలి.

*గయా శీర్షే,వటే చైవ,పితౄణాం దత్త మక్షయమ్* 

అని శ్రాద్ధ కాలంలో పఠిస్తారు.
అనగా, గయా క్షేత్రంలో, వటవృక్ష మూలమున, విష్ణు పాదమందు పితరుల నుద్దేశించి చేసిన పిండ ప్రదానం మొదలైన పితృకర్మలు అక్షయ ఫలము నిచ్చును" అని శాస్త్ర వచనము. ఇది మంత్రము యొక్క "ఆధి భౌతిక" అర్థం.

 *గయ శిరసి ఉత్తరాహ్ణే, పశ్చిమాయాం దిశి, గయః, అస్తం గృహ నామ* 
(వైదిక.నిఘం).

గయ అనగా సూర్యుని అస్తోన్ముఖ కాలము లేక "అపరాహ్ణ కాలము" అని గయా శీర్ష పదమునకు ఆధి దైవికార్థము. "వట" శబ్దమునకు సూర్యుడు అని అర్థం.
(వట,సూర్యే,తరౌ,లోకే, అని శాశ్వత నిఘంటువు)

 *వటే గయా శీర్షే సతి*  అనగా సూర్యుడు అస్తోన్ముఖు డగుచుండగా (అపరాహ్ణ కాలము) పితరుల నుద్దేశించి చేసినపిండోదక క్రియలు అక్షయ మగును అని తాత్పర్యము.

మృతులైన తల్లిదండ్రులు, బంధువులకు, పుత్రాదులచే నొసగబడే శ్రాద్ధము, పిండప్రదానము, తిలతర్పణము మొదలైనవి, వారికి ఎట్లు చేరును? అని ఋషులు ప్రశ్నించగా, సూతమహర్షి ఇలా సమాధానం ఇచ్చారు:

శ్లో *వసూన్ వసన్తి చ పితౄన్*
 *రుద్రాంశ్చైవ పితామహాన్* 
 *ప్రపితామహాం స్తథాది౽త్యా*
 *నిత్యేవం వైదికీ శృతిః* 

శ్లో *నామగోత్రే పితౄణాం తు*
 *ప్రాపకం హవ్య కవ్యయోః* 
 *శ్రాద్ధస్య మంత్రాః శ్రద్ధా చ*
 *ఉపయోజ్యాశ్చ భక్తితః* 

శ్లో *అగ్నిష్వాత్తాదయ స్తేషా*
 *మాధిపత్యే వ్యవస్థితాః* 
 *నామ, గోత్రం,కాల, దేశాః,*
 *భవాంతర గతా నపి* 
 *ప్రాణినః ప్రీణయం త్యే తే*
 *తదాహారత్వ మాగతాన్* 

పితృ, పితామహ, ప్రపితామహులు, వరుసగా వసు, రుద్ర, ఆదిత్య రూపులని వేదము తెలియజేస్తున్నది. మృతి చెందిన వారి నామ, గోత్రములను చెబుతూ, మంత్రోచ్చారణ చేస్తూ, శ్రద్ధతోను, భక్తితోను, పితృ కార్యములు చేయాలి.
అలా చేసినప్పుడు " *అగ్నిష్వాత్వాదులు* " అనబడే పితృదేవతలు సంతృప్తి చెంది, మృతులైన వారు ఏ జన్మనెత్తి ఉన్నా, ఏ దేశ, కాలములకు సంబంధించి ఉన్నా, పుత్రాదులు ఇప్పుడు వారికి ఇచ్చే హవ్య, కవ్యాదులను, వారికి యోగ్యమైన ఆహారంగా అందించి వారిని తృప్తి పొందిస్తారు. (మత్స్య పురాణం)

Comments

Popular posts from this blog

హనుమాన్ చాలీసా

అష్ట భైరవ మంత్రం

KAPU SURNAME AND GOTRALU: