Posts

Showing posts from October, 2023

Pancha Mahapurusha Yogas

Pancha Mahapurusha Yogas Pancha means five and mahapurusha means a great person. Pancha mahapurusha yogas give the combinations that produce 5 kinds of great persons. There are 5 basic elements of which this universe is made of. These are called pancha bhootas (five existences) or pancha tattvas (five natures). They are: • Agni tattva (fiery nature) • Bhoo tattva (earthy nature) • Vaayu tattva (airy nature) • Jala tattva (watery nature) • Aakaasa tattva (ethery nature) Mars, Mercury, Saturn, Venus and Jupiter (respectively) represent these 5 elements. Pancha mahapurusha yogas produce five kinds of great persons with one of these 5 elements playing a predominant role in their personalities. *Ruchaka Yoga:* If Mars is in a quadrant in own sign or exaltation sign, it is called Ruchaka yoga. *Bhadra Yoga:*  If Mercury is in a quadrant in own sign or exaltation sign, it is called Bhadra yoga. *Sasa Yoga:*  If Saturn is in a quadrant in own sign or exaltation sign, it is called Sasa yoga. *M

ఆడవాళ్ళ ముక్కుసంపెంగ - కళ్ళు తుమ్మెదల రెక్కలు

ఒక రోజు కృష్ణ దేవ రాయలు సభలో 'కవులందరూ అందమైన ఆడవాళ్ళ ముక్కును సంపెంగ తోనూ, కళ్ళను తుమ్మెదల రెక్కల తోనూ పోలుస్తారు కదా! ఎందు వలన?' అని అడిగాడట. అష్ట దిగ్గజాల్లో ఒకడైన రామరాజ భూషణుడు వెంటనే లేచి చమత్కారంగా యీపద్యం వినిపించాడు.          నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మే         లా నన్నొల్లదటంచు గంధఫలి పల్కాకన్ తపంబొనర్చి యో           షా నాసాకృతి దాల్చె సర్వ సుమన సౌరభ్య సంవాసి యై         పూనెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ అర్థము:--అన్ని పూలమీద వ్రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మెద యింత సువాసనతో వున్న నా మీద ఎందుకు వ్రాలి మకరందాన్ని గ్రోలదు? అని సంపెంగ అలిగి బ్రహ్మ దేవుణ్ణి గూర్చి ఘోరమైన తపస్సు చేసిందట. అప్పుడు బ్రహ్మ కవులు యికపై నిన్ను అందమైన ఆడవాళ్ళ ముక్కుతోనూ, కళ్ళను తుమ్మెదల రెక్కలతోను పోలుస్తారు. అప్పుడు నీకు రెండు వైపులా రెండు తుమ్మెదలు నీ పై వ్రాలినట్టు అవుతుంది, నీ కోరిక తీరుతుంది లే అని వరం యిచ్చాడట. అందుకని కవులు ముక్కును సంపెంగ తోనూ కళ్ళను తుమ్మెద రెక్కల తోనూ పోలుస్తున్నారు. మహారాజా! అని చెప్పాడట. కవులకు యీ సమయ స్ఫూర్తి వుంటుంది. అప్పటికప్పుడు యిలా

శాపగ్రస్తుడు*

*శాపగ్రస్తుడు*        ==========          రాత్రి పదకొండు అయి ఉంటుంది. కిటికీలోంచి తెల్లటి, చల్లటి వెన్నెల గది అంతా పరచుకుంది. మా గదిలో ఉన్న మిగతా నలుగురు, వాళ్ళ మంచాల మీద హాయిగా పడుకున్నారు, నేను తప్ప. నిద్ర పట్టక మంచంమీద అటూఇటూ దొర్లుతున్నాను. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా కొడుకు, కోడలు నన్ను ఈ వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వాళ్ళ వివరాలు ఏవీ నాకు తెలియలేదు. తెలుసుకోవాలని నేనూ ప్రయత్నం చేయలేదు.   నా భార్య మరణించిన ఓ ఏడాదికే నాకు ఇక్కడికి స్థాన చలనం. "భగవంతుడా నేనేం పాపం చేసాను? " కన్న కొడుకు ఉండి కూడా నాకు ఏమిటీ దుస్థితి ? అనుకున్నా, మనసులో. ఇదే ప్రశ్న గతంలో కూడా నాలుగు సార్లు వేసుకున్నాను.       ***** ***** *****    మొదటిసారి వేసుకున్నది, పదవ తరగతి చదువుతున్న రోజుల్లో....  ఆ రోజు పరీక్షా ఫలితాలు వచ్చిన రోజు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న పెద్దన్నయ్య బయటనుండి రిజల్ట్స్ పడిన పేపర్ తెచ్చి, "ఇదిగో ఈ సన్యాసి పరీక్ష తప్పాడు. ఇలా పరీక్ష తప్పడం మన ఇంటా వంటా లేదు" అంటూ బిగ్గరగా కేకలేయసాగాడు. ఆయనకు డిగ్రీ చదువుతున్న చిన్నన్నయ్య, ఇంటర్ చదువుత

అన్నం గురించి ఉపాఖ్యానం

అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది. అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం. వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి, పవిత్రత వస్తాయి. వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు దైవతా స్తోత్రములు ఫఠిస్తూ, పారాయణ చేస్తూ, మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట చేసిన పదార్థాలు తిన్నవారి మనస్సులు కూడా సంతోషంగా వుంటాయన్నది పూర్వీకుల విశ్వాసం. లోకంలో మానవులలో దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ

అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేది బమ్మెర పోతన రచించిన భాగవతములోని ప్రాచుర్యం వహించిన పద్యం. తెలుగు సేయబడిన భాగవత ప్రారంభంలోని ప్రార్థనా పద్యాలలో దుర్గాదేవిని ఉద్దేశించింది. ఇది ఉత్పలమాల పద్యం. వృత్త్యానుప్రాసాలంకారము: మ్మ అని ప్రాసలో నాలుగు సార్లే కాకుండా మరొక ఆరు సార్లు మ్మ కారం ప్రయోగించిన తీరు, నాలుగో పాదంలో త్వ కార వృత్యనుప్రాస అలంకారం ఈ పద్యానికి అందాలు అద్దాయి. దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక. అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది. దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమ

“ఖానాదేవి” జ్యోతిష్య నిపుణురాలు

“ఖానాదేవి” మనకు తెలియని జ్యోతిష్య నిపుణురాలు భారతావని అందించిన అత్యుత్తమ జ్యోతిశ్శాస్త్రవేత్తల్లో ఒకరు ఖానాదేవి. భారతావనికి చెందిన మహోన్నత మహిళల గురించి మాట్లాడినపుడల్లా స్వామి వివేకానంద ఆమె పేరును ప్రస్తావించేవారు. జ్యోతిష, ఖగోళ శాస్త్రాల్లో వరాహదేవుడు గొప్ప నిపుణుడు ఉజ్జయినికి చెందిన విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిధ్దికెక్కిన వారిలో ఆయన ఒకరు. వరాహదేవుడు, ధరణీ దేవి దంపతులకు మిహిరుడు జన్మించాడు. మిహిరుడు జ్యోతిశ్శాస్త్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరుగాంచాడు. శ్రీలంక రాజకుమారి అయిన ఖానాదేవిని అతడు వివాహమాడాడు. ఆమెకి కూడా చిన్నప్పటినుండి జ్యోతిశ్శాస్త్రం పట్ల అపారమైన మక్కువ. పెరిగి పెద్దవుతున్న కొద్దీ జ్యోతిషంలో ఆమె దిట్టగా మారింది. విక్రమార్క చక్రవర్తి మిహిరుని నైపుణ్యం తెలిసి ఆయనను తన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించాడు. జ్యోతిష్యం గురించి రాజసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మిహిరుడు, వరాహదేవుడు సమాధానాలు ఇచ్చేవారు. కొన్ని క్లిష్టమైన సమస్యలకి వారు ఖానాదేవిని ఆంతరంగికంగా సంప్రదించి ఆపైన రాజసభలో వాటికి బదులిచ్చేవారు. విక్రమాదిత్యుడికి ఈ సంగతి తెలిసింది. ఖానాదేవిని కూడా రాజసభకు త

మదనాభిషేక సాలభంజిక 2. చెప్పిన కధ.

సాలభంజిక కధలు - 1 మదనాభిషేక సాలభంజిక 2.  చెప్పిన కధ. భోజరాజు మళ్ళీ ఒక మంచి రోజున ఆ సింహాసనాన్ని అధిష్టించాలని ప్రయత్నం చేయగా ఒక సాలభంజిక ఇలా అంది. "ఓ! భోజరాజా! మా విక్రమార్కుడికి ఉన్నంత ధైర్యసాహసాలు నీకు లేవు. కావున ఈ గద్దె నెక్కబోవటం నీకు సాధ్యం కాదు ఎందుకంటే, ఉజ్జయనిలో మా విక్రమార్కుని రాజ్యం విష్ణు మూర్తి రాజ్యం కంటే గొప్పది. కావున విను, మా విక్రమార్కుని రాజ్యంలో క్రూరుడు, కుత్సిత బుద్ధి కలవాడు, నీరసాత్ముడు, దూషకుడు, దుర్మార్గుడు, అనాచారుడు, అబద్ధాలు చెప్పేవరు, అవినీతి పరులు, బద్ధ కస్తులు, దుర్భలులు, మదాంధులు, మదన వికారం చెందిన వారు, స్తిరత్వం లేని వారు, ఇలాంటివారు మచ్చుకైన ఉండరు. ఐతే అటువంటి రాజ్యంలో ఒకనాడు ఒక విదీశీయుడు ప్రవేశించాడు" అని ఆ సాలభంజిక చెప్పసాగింది.          రాజ దర్శనం కాగానే, రాజుకు నమస్కరించి తాను దేశ దేశాలు తిరిగి వచ్చానని చెప్పాడా విదేశీయుడు.          అందుకు రాజు "దేశం నలుమూలలా చుట్టి వచ్చావు గనుక, నీవు చూసిన వింతలేమైనా చెప్పు" అని అడిగాడు.          అందులకా సిద్ధుడు "నేను ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒకసారి తూర్పు కొండల ప్రాంతంలో ఒక భాగ్య వంతమైన

సాలభంజిక 1 - వినోదరంజిత చెప్పిన కధ.

సాలభంజిక కధలు - 1 సాలభంజిక 1 - వినోదరంజిత చెప్పిన కధ "32 సాలభంజికలు 32 కథలు" చెప్పి భోజరాజుని సింహాసనాన్ని అధిష్టించకుండా అడ్డుకున్నాయని చెప్పుకన్నాం కదా? ఐతే వాటిలో ఒక కథ ఇప్పుడు చెప్పుకుందాం. విక్రమార్కుడు ఒకనాడు నిండు కొలువులో సభ తీరి ఉన్న సమయంలో అక్కడికి ఒక కవీంద్రుడు వచ్చాడు. అతడు మహా పండితుడు, సకల భాషా కోవిదుడు, సంస్కృత ప్రాకృత చతుర్విధ భాషా విశారదుడు. అందువల్ల మన విక్రమార్కుడిని నాలుగు భాషల్లో దీవించి ఆసనం మీద కూర్చుని, తనని తాను పరిచయం చేసుకున్నాడు. అదెలా అంటే? ఓ రాజేంద్రా! నా పేరులో ఆరు అక్షరాలుంటాయి. అందులో మొదటి అక్షరం తీసివేస్తే నేను "అశ్వవేదినౌతాను"  రెండక్షరాలు వదిలిపెడితే "నాట్యకర్తనౌతాను"  మూడక్షరాలు తీసేస్తే "గతవిదుడనౌతాను"  నాలుగక్షరాలు విడిచి పెడితె "నేర్పరినౌతాను"  ఐదు అక్షరాలు వదిలిపెడితే "బుధుడనౌతాను"  అన్ని అక్షరాలు కలిపి చదివితే "బుద్ధిబలమున్న వాడినౌతాను"  ఇది కేవలం నేతిబీరకాయ చందాన చెప్పటం కాదు, నువ్వు అన్ని విద్యలలోను ఆరితేరినవాడివి గనుక నాపేరు తెలుసుకోగలవు అని విక్రమార్కుడిని ప్రశ్నించి అడి

సాలభంజిక కధలు - విక్రమార్కుడు

సాలభంజిక కధలు విక్రమార్కుడు  పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉంటాడు తెలుసు కదా? ఐతే ఆ విక్రమార్కుడుకి ఒక సింహాసనం ఉంది. ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి?  భూలోకంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది (దీనికి చాలా పేర్లు ఉన్నాయి అవన్ని మరోసారి). ఐతే ఈ పట్టణం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉంది. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే. ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట. ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. వీరికి మంత్రి భట్టి.  కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్య త్యాగంచేసి దేశాంతరం వెళ్ళి పోయాడు. తర్వాత మన విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు.  అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊ

సాలభంజిక కధలు -4

సాలభంజిక కధలు -4 ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పుకుందాం ...          పూర్వము సూర్యవంశంలో పుట్టిన సుదర్శనుడనే రాజు అయోధ్యాపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు నిత్యం అన్నదానాలు క్రమం తప్పకుండా చేస్తూ దేవతల మెప్పు కోసం యజ్ఞ యాగాలు చేస్తూ మిక్కిలి పేరు పొందాడు.          ఐతే ఒకనాడు సరయూ నదీతీరంలో యజ్ఞం చేస్తూండగా, త్రిలోక సంచారి ఐన మన నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు సుదర్శనుడు నారదుని భక్తితో పూజించి అర్ఘ్య పాద్యాదులనర్పించి సవినయంగా "ఓ మహాను భావా! మీ రాకవల్ల కృతార్ధుడనయ్యాను, మారాజ్యము పావనమైంది, తమరింకా ఏఏ ప్రదేశాలు చూచి వచ్చారో సెలవీయండి" అని ఎంతో వినయ విధేయతలతో అడిగాడు.          అందుకు మన నారదుడు అతని సేవలకు మెచ్చి "పరమ ధర్మ శీలుడవైన ఓ రాజా! నీ కీర్తి బ్రహ్మ లోకంలో నలుదిశల పొగడబడు తున్నది. నీ దాన ధర్మాల గురించి నీ ప్రాశస్త్యం గురించి విని నిన్ను చూడాలని వచ్చాను" అని అన్నాడు.          అందుకు సుదర్శనుడు "స్వామీ నాపై దయతో మీరిలా వచ్చారుగానీ నేనెంతటి వాడను?" అని ఎంతో వినయంగా నమస్కరించాడు. అందుకు ముని "ఓ ధరణీశా! నీ చరిత్ర బ్రహ్మ లోక

సాలభంజిక కధలు -3

సాలభంజిక కధలు -3   ఇప్పుడు మరొక సాలభంజిక చెప్పిన కథ చెప్పు కుందామా?           మా విక్రమార్కుడు గర్వం లేకుండా వినయ విధేయతలు కలిగిన రాజు. క్షణంలో కరిగి పోయే కలిమిని సైతం తన మంచితనంతో కట్టి పడేయగల సమర్ధుడు.          ఐతే, అంత ధనం ఉన్నప్పుడు తగినంత దాన గుణం ఉండాలి కదా!? అందుకని అశ్వమేధ యాగం చేయాలని తల పెట్టాడు. అందుకు తగినట్టుగా బంధు మిత్ర సపరివారాన్నందరిని ఆహ్వానించాడు.          చేసేది పుణ్య కార్యం గనుక "గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు, యక్షులు" తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు. సరే! వచ్చిన వారందరిని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేసాడు. ఐతే, వారిలో సముద్రుడు లేక పోవటంతో చింతించి, ఒక పురోహితుణ్ణి కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు.          ఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు, తిమింగలములు, అనేక సుడిగుండములు ఉండే సముద్రాన్ని చేరాడు. దానికి సమీపంలో నిలబడి సముద్రుడిని పిలిచి పిలిచి అలసి పోయాడు. అప్పుడు తనలో తను "సరసత్వము సన్మానము లేని చోట స్నేహం పనికి రాదను కున్నాడు. దారి దోపిడి వారికి దాన ధర్మాలు చూపించటం లాంటిది." అని ఎంచి మరలి పోవాలనుకుని ఆఖరి స

Stree Dosha

Stree Dosha Stree Dosha is an astrological condition in the horoscope of a person resulting from the curse of a woman during the past lives. Stree dosha is one of the most prominent malefic effects noted in the horoscope of people. The ill effects of this condition can pronounce adverse results in the married life of the concerned individual. One of the chief causes for Stree dosha is the curse of the wife during the past life in response to the cruelties done to her. One of the other causes for Stree dosha is forgetting or not worshipping the family deity. Stree dosha is reflected in the horoscope through the conjunction of Venus with any of the malific grahas like Rahu, Ketu or Saturn. This can also be reflected by the poisoning of Venus being affected by the influence of Rahu, Ketu or Saturn. The other name of this condition is Aka Stree Dosha. Stree dosha can result in adverse effects in the life of a person.   Some of the adverse results noticed due to Shrapit dosha is the sicknes

మణిద్వీప వర్ణన

💐💐మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ...💐💐 మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు. ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో, పసుపు..కుంకుమలతో..నవరత్నాలతో.. రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యదాశక్తి అమ్మకు పూజచేసుకుంటూ.. నైవేధ్యాలుగా 32 రకాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు. 32 రకాల నైవేధ్యాలకు శక్తిలేనివారు యదాశక్తి నైవేధ్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము.  మొగలి పూవు, బంతి పూవూ పూజకు పనికిరాదు. మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది. ఇవ్వికాక ఇంకేమైనా ఉన్నా, వీటిలో ఏమైనా అమ్మ పూజకు పనికిరావన్నా తెలియజేయండి  1. మల్లెపువ్వులు  2. గులాబి  3. సన్నజాజి  4. విరజాజి  5. సెంటుమల్లి  6. డిసెంబరంపువ్వులు  7. చామంత

జ్యోతిషశాస్త్రంలో 10వ ఇల్లు - సమాజంలో మీ కీర్తి మరియు ప్రాముఖ్యత.

మీ పదవ ప్రభువు ఒక నిర్దిష్ట ఇంట్లో ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో 10వ ఇల్లు - సమాజంలో మీ కీర్తి మరియు ప్రాముఖ్యత. నాటల్ చార్ట్ యొక్క పదవ ఇల్లు కోణీయమైనది మరియు మకరం మరియు శని గ్రహం ద్వారా పాలించబడుతుంది. ఒక వ్యక్తి సమాజంలో కీర్తి మరియు ప్రాముఖ్యతను సాధించగలడా అని ఈ ఇల్లు చూపిస్తుంది. ఒక వ్యక్తి నడపబడుతున్నాడా మరియు ప్రతిష్టాత్మకంగా ఉన్నాడా లేదా విజయవంతం కావడానికి అవసరమైన ఉత్సాహం లేకపోయినా ఇది చూపిస్తుంది. సాటర్న్ నెమ్మదిగా ఉండే గ్రహం, కాబట్టి 10వ ఇంటిని తెరవడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియ, మనకు ఏది నచ్చుతుందో మరియు మనం నిజంగా ఇష్టపడేదాన్ని కనుగొనడానికి చాలా సమయం అవసరం కావచ్చు. అతను కృషికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, తద్వారా వారి లక్ష్యంలో పట్టుదలతో మరియు అవసరమైన అన్ని వనరులను వర్తింపజేసేవారికి విజయం ఎదురుచూస్తుంది. దేనికి బాధ్యత వహిస్తారు 2 వ మరియు 6 వ గృహాలతో పాటు, ఇది కెరీర్ గృహాలలో ఒకటి, ఒక వ్యక్తికి ఏ వృత్తులు బాగా సరిపోతాయో చూపిస్తుంది. పదవ ఇల్లు మీ వృత్తిని ఎంచుకోవడానికి బాధ్యత వహిస్తుంది మరియు పని వైపు మీ చేతన అడుగులు మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి మరియు సంతృప్తిని కలిగించడ

10th house in astrology - your fame and importance in society.

What does it mean when your tenth Lord is in a certain house? 10th house in astrology - your fame and importance in society. The tenth house of the natal chart is angular and is ruled by the sign of Capricorn and the planet Saturn. This house shows whether a person can achieve fame and significance in society. It shows whether a person is driven and ambitious, or lacks the enthusiasm needed to succeed.  Saturn is a slow planet, so the opening of the 10th house is a very long process, we may need a lot of time to find what pleases us and what we really love to do. He rewards hard work so that success awaits those who persevere in their goal and apply all the necessary resources for this. What is responsible for Along with the 2nd and 6th houses, this is one of the career houses, showing which professions will best suit a person. The tenth house is responsible for choosing your career, and your conscious steps towards work that will allow you to maximize yourself and bring satisfaction.