శ్రీరామచంద్రునికి బాల్యంలో వైరాగ్యం
శ్రీమద్రామాయణంలో శ్రీరామచంద్రునికి బాల్యంలో పరిస్థితుల ప్రభావానికి వైరాగ్యం కలుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుని మాట ప్రకారం వశిష్ఠ మహర్షి రామునకు దివ్యమైన ఉపదేశాన్ని ఇస్తాడు. అదే యోగవాసిష్ఠమని పేరొందినది. అం దులో మొదటి అధ్యాయం వైరాగ్యమునకు చెందినది. ప్రాపంచిక సుఖాలు తుచ్ఛమైనవిగా భావించినప్పుడే భక్తి కలుగుతుంది. వశిష్ఠుడు శ్రీరామునిగాంచి ”వత్సా! నీవు ఏమి త్యజించదలిచావు? నీవు రాజభవనం వదలి అడవికి వెళ్ళాలనుకుంటే చిన్న కుటీరం అవసరమవుతుంది. చిన్న వస్త్రం ధరించాలి. కౌపీనం అవసరమౌతుంది. మంచి భోజనం వదలి కందమూలఫలాదులను తినాలి. అందు వలన మనస్సే బంధనానికి కారణమవుతుంది. మనస్సే ముక్తినిస్తుంది. మనసులో విషయ వాంఛలు లేనపుడు మానవుడు ముక్తుడవుతాడు. విషయాలను చింతన చేస్తే మనస్సుకు భయం కల్గుతుంది. విషయ చింతన త్యజిస్తే శాంతి లభిస్తుంది. స్వప్న జగత్తు వలన అజ్ఞానం కలుగుతుంది. నిద్రనుండి మేలుకొనిన పిదప స్వప్న రూపం కన్పించదు. సుఖదు:ఖాలు అజ్ఞానం వలన కలుగుతాయి. ఇవి మనస్సుకు చెందిన ధర్మాలు. రాగద్వేషాల వలన క్రొత్త ప్రారబ్దం మొదలవుతుంది. జ్ఞాని ప్రారబ్దాన్ని యోగం చేత నశింపజేస్తాడు. సాధన చేస్తూ మనస్సు చెడకుండా ఉండాలని జ...