Posts

Showing posts from June, 2020

ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు 

శాస్త్రం-94 ఆలస్య వివాహానికి కొన్ని జ్యోతిష్య సూత్రాలు          పూర్వం బాల్య వివాహాలు జరిగేవి. అప్పటి సమాజ పరిస్ధితులను బట్టి రజస్వల కాకుండానే పెత్తందార్లకు బలికాకూడదని తల్లిదండ్రులు వివాహాం చేసేవారు. ఇప్పటి సామాజిక పరిస్ధితులలో మనిషికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు రావటం, బాలికల రక్షణ ఏర్పడిన తరువాత రజస్వల అయిన తరువాత వివాహం చేయటం మొదలుపెట్టారు. ఈ  రోజుల్లో తన కాళ్ళ మీద తాను నిలబడటానికి సమాజానికి వీరి వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవటం వల్ల కొంత వివాహ ఆలస్యం అవుతుంది. సాధారణంగా చట్టరీత్యా బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తరువాత వివాహ అనుమతి ఉంది. చదువు పూర్తయ్యేవరకు 23 సంవత్సరాలు పడుతుంది. ఉద్యోగం దొరికే సరికి 2 సంవత్సరాలు పడుతుంది. 25 సంవత్సరాలు అనుకుంటే 25 సంవత్సరాలు దాటినవన్నీ ఆలస్య వివాహాలే అనవచ్చును. సమాజంలో వస్తున్న నూతన పోకడలు, సినిమాల ప్రభావం, శారీరక, మానసిక వ్యాధుల ప్రభావం, అధికమైన, ఇష్టమైన మరియు నియంత్రణలేని ఆహార పదార్ధాలు తీసుకోవటం వలన సరియైన వ్యాయామం లేక శరీర అవయవాలు అందవికారంగా తయారు కావటం,  ప్రతి ఒక్కరూ

పూరీజగన్నాథం: జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన

Image
పూరీ జగన్నాధుని రథోత్సవం పౌరాణిక గాథా మహిమలకు, నిష్కపటమైన శ్రద్ధావిశ్వాసాలకు, చక్కని సంస్కృతికి, వైభవ చరిత్రకు కేంద్రంగా విలసిల్లుతున్న క్షేత్రం - పూరీజగన్నాథం. ఎన్నో తీర్థాలు, కుండాలు, దేవతా మందిరాలు శోభిల్లుతున్న ఈ క్షేత్రంలో ప్రధాన మందిరం - బలభద్రాసుభద్రాసమేత జగన్నాథస్వామి వేంచేసిన దివ్యాలయం. వీరి ముగ్గురితోపాటు సుదర్శనమూర్తీ నెలకొని ఉన్న ఆలయమిది. పురాణాలప్రకారం - ఈ రూపాన్ని తీర్చిదిద్దినవాడు బ్రహ్మదేవుడే. ’ఇది కేవలం కోష్ఠమయం కాదు, దారు(కర్ర) రూపంలో ఉన్న నారాయణ బ్రహ్మమే’ అని స్కాందపురాణం చెబుతోంది. దివ్యత్వాన్ని వదనం ద్వారా సంపూర్ణంగా ప్రకటించే ప్రత్యేకత ఈ విగ్రహాల్లో ఉంది. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే సుదర్శన శక్తి, విష్ణు వైభవాన్ని స్పష్టంగా (సు)దర్శింపజేసే జ్ఞానదీప్తి...అని ఆగమాల సమన్వయం. ప్రకృతికీ, జీవునికీ అతీతుడై, ఇరువురినీ నియంత్రించే పరతత్వాన్ని ’పురుషోత్తముడు’ అంటారు. ఆ పురుషోత్తముడు నారాయణుడు ఈ క్షేత్రంలో ’పురుషోత్తమ’ నామంతో శోభిల్లుతున్నాడు. అందుకే ఆయన పేరుపైనే ఈ స్థలాన్ని ’పురుషోత్తమ క్షేత్రం’గా శాస్త్రం వ్యవహరించింది. ఐశ్వర్యకారిణియైన మహాలక్ష్మి ఇక్కడ అన్

-:: జగన్నాథ పంచకమ్ ::-

Image
ఈ రోజు శ్రీ జగన్నాథ రథయాత్ర. జగన్నాథుని ధ్యానించుకోడానికి అనువైన శ్రీ జగన్నాథ పంచకము  -:: జగన్నాథ పంచకమ్ ::- రక్తాంభోరుహదర్పభంజన మహాసౌందర్యనేత్రద్వయం ముక్తాహారవిలంబి హేమముకుటం రత్నోజ్జ్వలత్కుండలమ్ । వర్షామేఘసమాననీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రినాథం భజే ॥ 1॥ ఫుల్లేందీవరలోచనం నవఘనశ్యామాభిరామాకృతిం విశ్వేశం కమలావిలాసవిలసత్పాదారవిందద్వయమ్ । దైత్యారిం సకలేందుమండితముఖం చక్రాబ్జహస్తద్వయం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం లక్ష్మీనివాసాలయమ్ ॥ 2॥ ఉద్యన్నీరదనీలసుందరతనుం పూర్ణేందుబింబాననం రాజీవోత్పలపత్రనేత్రయుగలం కారుణ్యవారాంనిధిమ్ । భక్తానాం సకలార్తినాశనకరం చింతార్థిచింతామణిం వందే శ్రీపురుషోత్తమం ప్రతిదినం నీలాద్రిచూడామణిమ్ ॥ 3॥ నీలాద్రౌ శంఖమధ్యే శతదలకమలే రత్నసింహాసనస్థం సర్వాలంకారయుక్తం నవఘన రుచిరం సంయుతం చాగ్రజేన । భద్రాయా వామభాగే రథచరణయుతం బ్రహ్మరుద్రేంద్రవంద్యం  వేదానాం సారమీశం సుజనపరివృతం బ్రహ్మదారుం స్మరామి ॥ 4॥     దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలైరాకాన్తభూమండలమ్ । వజ్రాభామల చారుగండయుగలం నాగేంద్రచూడోజ్జ్వలం సంగ్రామే

Across the Karakorams: India-China Dispute through the Centuries

Image
Across the Karakorams: India-China Dispute through the Centuries Akshay Chavan June 21st 2020 The recent tensions between India and China in Ladakh have thrown a spotlight on this often-forgotten disputed border. While much has been written and said about the Line of Control (LOC) and the conflict with Pakistan, India’s border dispute with China is far older, going back to the days of the Great Game of the 19th century, when the British and Russian empires vied for power in Central Asia, drawing borders on maps across unchartered terrain. It is impossible to understand the current conflict, without understanding this background. The Galwan Valley face-off was most immediately triggered by India building a road that connects Leh, the capital of Ladakh, with the exotically named Daulat Beg Oldi, an Indian military base located on the northernmost tip of India, in the Karakoram mountains. Sitting 5,065 metres above sea level, Daulat Beg Oldi is also India’s highest military ai

కారకోరమ్స్ అంతటా: భారతదేశం-చైనా వివాదం

Image
కారకోరమ్స్ అంతటా:  భారతదేశం-చైనా వివాదం అక్షయ్ చవాన్ చేత జూన్ 21, 2020 వద్ద 12:21 అపరాహ్నం లడఖ్‌లో భారత్‌, చైనా మధ్య ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న ఈ వివాదాస్పద సరిహద్దులో వెలుగు చూశాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) మరియు పాకిస్తాన్‌తో ఉన్న సంఘర్షణ గురించి చాలా వ్రాయబడి, చెప్పబడినప్పటికీ, చైనాతో భారతదేశం యొక్క సరిహద్దు వివాదం చాలా పాతది, ఇది 19 వ శతాబ్దపు గ్రేట్ గేమ్ రోజులకు, బ్రిటిష్ మరియు రష్యన్ సామ్రాజ్యాలకు వెళుతుంది మధ్య ఆసియాలో అధికారం కోసం పోటీ పడ్డారు, అపరిచిత భూభాగంలోని పటాలపై సరిహద్దులను గీయడం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోకుండా, ప్రస్తుత సంఘర్షణను అర్థం చేసుకోవడం అసాధ్యం. గల్వాన్ వ్యాలీ ముఖాముఖి భారతదేశం లడఖ్ రాజధాని లేహ్‌ను కలిపే రహదారిని నిర్మించడం ద్వారా వెంటనే ప్రేరేపించబడింది, భారతదేశం యొక్క ఉత్తరాన కొనపై ఉన్న కరాకోరం పర్వతాలలో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డి అనే భారతీయ సైనిక స్థావరం. సముద్ర మట్టానికి 5,065 మీటర్ల ఎత్తులో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డి కూడా భారతదేశపు ఎత్తైన సైనిక వైమానిక స్థావరం, మరియు పశ్చిమాన సియాచిన్ హిమానీనదం మరియు తూర్పున అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కలిగి ఉంది, అయితే వాయ

శ్రీ సూక్తమ్ విశిష్టత

శ్రీ సూక్తమ్ విశిష్టత (ప్రతి రోజు శ్రీ సూక్తము తో అమ్మవారికి రెండు పూటలా కుంకుమ అర్చన చేయండి. మీ ఇంట్లో ఇంక ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు, దారిద్ర్యము అప్పుల బాధలు ఉండవు.చాలా శక్తివంతమైనది శ్రీ సూక్తము)శ్రీ చక్రం ఉన్నవారు శ్రీ సూక్తము తో రోజు ఈ విధంగా చేయవచ్చు). శ్రీ చక్రం లేని వాళ్ళు కూడా మామూలుగా ఒక తమలపాకు మీద శ్రీ సూక్తం తో కుంకుమార్చనలు చేయవచ్చు శ్రీ సూక్తం, అర్దం 🙏 - వేదాలలో, పురాణాలలో ఉన్న మహాలక్ష్మీ స్తుతుల కూర్పే శ్రీ సూక్తం. మన దక్షిణ భారత పూజా విధానంలో ఇది బహుళ ప్రాచుర్యం సంతరించుకున్నది. ఆ శ్రీమహాలక్ష్మి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా కలగటానికి దీని పారాయణ శ్రద్ధగా చేద్దాము. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్ శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్ పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాము

గ్రహాలు/వాటిస్థితి/మానవ శరీరం పై వాటి ప్రభావం

*గ్రహాలు/వాటిస్థితి/మానవ శరీరం పై వాటి ప్రభావం *గ్రహాలపై జీవపదార్ధ స్వరూప స్వభావాలు, ఉపగ్రహాలపై వున్నటువంటి వాటికి వేరుగా వుంటాయి* సోలార్ యూనిట్లో (సౌర కుటుంబంలో) సూర్యుని ఉపరితలం – గ్రహాల కేంద్రానికి సంబంధించిన అయస్కాంత క్షేత్ర ఆకర్షణ – వికర్షణ కేంద్రీకృత స్థాయిని, అలాగే గ్రహాల ఉపరితలం – ఉపగ్రహాల కేంద్రాలను అనుసరించి – ఆయా గ్రహాల ఉపగ్రహాలకు సంబంధించిన జీవ పదార్ధ స్వరూప స్వభావాలు ఎక్కువగా ఆధారపడి వుంటాయి. అందుకే, సాధారణంగా, ఒక సోలార్ యూనిట్లో – ఎప్పటికప్పుడు – ఘనరూప జీవుల ఉత్పత్తి లేదా ఫలదీకరణ/దరిమిలా పునరుత్పత్తి 'కేవలం ఒకే గ్రహం' పై వుంటుంది కాని, ఆ గ్రహానికి సంబంధించిన ఉపగ్రహం/ఉపగ్రహాలపై, ఆ రకమైనటువంటి అవకాశం చాలా అరుదుగానే సాధ్యం. అయినా, గ్రహంపై జీవ పదార్ధం – జీవికి, ఉపగ్రహ ఉపరితలంపై ఫలదీకరణ ప్రక్రియకు, చాలా తేడా వుంటుంది. ఈ విషయంలో, హైడ్రోమాగ్నెటిక్ – ఎలక్ట్రోమాగ్నెటిక్ వుమ్మడి ప్రభావంగా – దాని సంబంధ అంశాలు, జీవుల వుత్పత్తి కార్యంలో 'స్టెమ్ సెల్స్' ఏర్పాటు అనేక రకాలుగా వుంటాయి. జీనోమ్ అమరిక విధానాన్ని పరిపూర్ణంగా పరిశీలించ గలిగితే, ఈ విషయం స్పష్టం అవుతుంది. జీవ సృష

శ్రీ సూక్తం విశిష్టత

Image
 సూక్తం విశిష్టత వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పనిసరిగా చేయాలి. పురుష దేవుళ్లను అర్చన చేసేటప్పుడు వేదోక్తంగా పురుష సూక్త విధిలో పురోహితుని ద్వారా పూజదికాలను చెయ్యాలి. స్త్రీ దేవతామూర్తుల్ని పూజించేటపుడు శ్రీసూక్త విధాయకంగా గోత్ర నామాదులతో అర్చన చేయడం, చేయించడం జరుగుతుంది. విశేషంగా నిర్వహించే పూజల్లో శ్రీ సూక్త విధాయకంగా అర్చనలుంటాయి. సూక్తులన్నీ ఉన్నతమైన వేదాంత భావాలతో నిండి ఉంటాయి. వేదసూక్త పఠనంలోని పారలౌకిక ప్రయోజనాన్ని భక్తులు గ్రహించాలి. శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరియొకటి లేదు. నిత్య పూజాక్రియల్లో శుభకార్య నిర్వహణలో ఈ సూక్త పఠనానికి ప్రాధాన్యత ఉంది. నిజమైన సిరి జ్ఞానమే అని శ్రీ సూక్తం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించ