Posts

Showing posts from January, 2021

మాట్లాడే మౌనం!

Image
మాట్లాడే మౌనం! స రిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష. అన్నివైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం. అలా చేయాలంటే మౌనారాధనం అవశ్యం అనుసరణీయం. ‘మౌనంగా ఉన్నవాడే ఎల్లెడలా ప్రశాంతతను పంచగలడు’ అంటాడు చాణక్యుడు. మౌనంలో మహత్తరశక్తి దాగి ఉంది. ‘మాట్లాడటం వెండి అయితే మౌనం బంగారం’ అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం. హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి. మౌనం మాట్లాడినంత తీయగా మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌనభాషకు ఉంటాయి. మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాడికే మౌనం విలువ తెలుస్తుంది. ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మొదలైన మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనగ్రాహ్యాలయ్యాయి. మన సనాతన సంప్రదాయంలో జిజ్ఞాసువులంతా ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్

కొప్పు చూడు... కొప్పందం చూడు

కొప్పు చూడు... కొప్పందం చూడు! జుట్టంటూ ఉంటే ఎన్ని రకాల కొప్పులు చుట్టినా నప్పుతుందని సామెత. కేశసంపదను స్త్రీ సౌభాగ్యంగా ఈ దేశం పరిగణించింది. సుభద్ర జడ ‘పిరుద నొయ్యారంబు మెరయు చుండుట’ను విజయవిలాసంలో చేమకూర హృద్యంగా వర్ణించాడు. ఆమె కొలనులో మునిగినప్పుడు నీటిపై తేలియాడుతున్న జుట్టును చిక్కగా వ్యాపించిన నాచు(శైవాలలత)తో పోల్చాడు. రుక్మిణీదేవి పొడవైన కేశపాశాలను భాగవతం ‘జిత మత్త మధుకరశ్రేణి వేణి... గండుతుమ్మెదల బారులకన్న మిన్నగా ఉంది’ అంది. విప్పారిన జుట్టు నెమలి పింఛంలా ఉందన్నాడు వసుచరిత్రకారుడు. ‘అనయము నీలకంధరము అభ్రమున్‌ అన్న సమాఖ్యవారితోన్‌...’ అంటూ రామరాజ భూషణుడు చెప్పిన పద్యం సాహిత్యలోకంలో ప్రసిద్ధికెక్కింది. సీతమ్మతల్లి తన పొడవైన జడతో ఉరిపోసుకోబోయిందని వాల్మీకి రాశారు. ఆమె నీలవేణిని హనుమ వేదరాశిగా దర్శించాడంటూ వ్యాఖ్యాతలు ‘వేదేనాభి సయతి...’ అనే కృష్ణయజుర్వేదంలోని శ్రుతివాక్యాన్ని ప్రమాణంగా చూపించారు. స్త్రీకి కేశసంపద మంగళకరమని పెద్దల నిశ్చితాభిప్రాయం. పనికి అడ్డమొస్తోందనో, సౌకర్యంగా లేదనో జుత్తునుత్తరించే స్త్రీలకు సత్యభామను గుర్తుచేస్తారు ప్రవచనకర్తలు. ‘వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీ

శుద్ధ సలిలం

అంతర్యామి Published : 10/01/2021 00:15 IST శుద్ధ సలిలం ఈ లోకంలో ఒక అనామకుడైనా అందరి శ్రేయస్సు కోసం పని చేయవచ్చు. అందరికీ ఉపయోగపడవచ్చు. అయితే బలమైన మాధ్యమం ఉంటేనే ఆ విషయం గాని, సందేశం గాని అంత బలంగా, విస్తృతంగా అనేకమందికి అందుతాయి. విషయం ఎంత ప్రధానమో, దాన్ని అందించే మాధ్యమం కూడా అంతే ప్రధానం. కారణం ఏదైనా ఒక వ్యక్తికి ఉన్న పేరు, ప్రాచుర్యం అతడి స్వరాన్ని అనేకమందికి చేరవేస్తుంది. చేరువ చేస్తుంది. సాధారణ వ్యక్తికంటే అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తి తన అభిప్రాయాల్ని గాని, సందేశాన్ని గాని ఎక్కువమందికి అందజేయగలడు. ఆ వ్యక్తి స్వీయ క్షేమం కోసం గాక సార్వజనీన శ్రేయస్సుకై ఆలోచించేవాడై ఉండాలి. ఆకాంక్షించేవాడై ఉండాలి. ఒక భూభాగాన్ని తడుపుతూ పారే నీరు నిస్సారమై ఉన్నా, మలినమై ఉన్నా- ఆ నీటివల్ల ఆ భూమికేమీ ఉపయోగం లేదు, ఉండదు. అదే ప్రవాహం శుద్ధ జలమై, తగిన మౌలికాలు కలిగి ఉంటే ఆ భూమి సుక్షేత్రమై చక్కని పంట పండుతుంది. పదిమంది కడుపు నింపుతుంది. అలాగే వ్యక్తి పస కలిగినవాడై ఉంటే అతడి పని, ప్రయత్నం కూడా పదుగురికి శుద్ధ సలిలంలా సవ్యమైన మార్గంలో అందుతాయి... ఈ విషయం దేన్ని తేటతెల్లం చేస్తుంది? మంచి ప్రతిభ గాని, గొప్ప

దేవకి ఆరుగురు పుత్రులు.

దేవకి ఆరుగురు పుత్రులు. జాజిశర్మ గారు భాగవతములో ఆకాశవాణి కంసుని హెచ్చరించి ఆరుగురు శిశువుల మరణానికి కారణం ఎందుకు అయింది? దీనికి భాగవతములో సమాధానము ఎక్కడా లేదు. వేరే ఏదైనా పురాణాలలో ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వివరణ.  కంసుడు పూర్వజన్మలో కాలనేమి. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన మారీచుడి కొడుకు పేరు కాలనేమి. రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు మూలిక బదులుగా సంజీవని పర్వతాన్నే తీసుకువచ్చి మూర్ఛనుంచి తేర్చాడు. మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణాదులు మూర్ఛపోతే ద్రోణగిరిపై ఉన్న విశల్యకరణి అనే మూలిక తేవాలని జాంబవంతుడు చెప్తే తాను తెస్తానని హనుమంతుడు సిద్ధ పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు రావణాసురుడు. రావణాసురుడు కాలనేమి ఇంటికి వెళ్ళి హనుమంతుడు ద్రోణగిరికి బయలుదేరుతున్న విషయం చెప్పి హనుమంతుడిని దారితప్పించి అక్కడ ఉన్న మాయాసరస్సులో స్నానం చేసేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ప్రభువు ఆజ్ఞ శిరసావహించాడు కాలనేమి. ద్రోణగిరికి మార్గం వెతుకుతూ దప్పికగొన్న హనుమకు జపంచేస్తూ మహర్షిరూపంలో కాలనేమి కనిపించాడు. ద్రోణగిరికి మార్గం చెప్పమని హనుమ అ

మృత్యుంజయ మంత్రము

*మృత్యుంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము * *ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు  *మహా మృత్యుంజయ మంత్రం:* **ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం  ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్  ముక్షీయ మామృతాత్ ** ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము;  త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు;  మృత్యోర్  = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు. తాత్పర్యం:  అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడ

కాలభైరవాష్టకం

*కాలభైరవాష్టకం* *తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం* *రుద్ర కవచం* 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 శ్రీ కాలభైరవస్వామి ఆవిర్భవించిన మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమి గా సంభావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం చెబుతుంది. ఒకసారి శివబ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు *'నేను సృష్టికర్తను... పరబ్రహ్మ స్వరూపుడను... నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి'* అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో , మూడు నేత్రాలతో , త్రిశూలము , గద , డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీకాలభైరవుడు. హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుడిని కోరాడు. శివుడి ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది.  తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. *

పతివ్రతతో అశ్వినీదేవతల పరిహాసాలు

Image
పతివ్రతతో అశ్వినీదేవతల పరిహాసాలు నైమిశారణ్యం - 5  -రచన : యం.వి.ఎస్. సుబ్రహ్మణ్యం సుకన్య -చ్యవనుడు భృగువునకు పులోమకు జన్మించినవాడు చ్యవనుడు. చ్యవనుడు నిష్కళంక తపఃశ్శాలి. ధర్మనిరతుడు. విద్యాభ్యాసం ముగిసాక నిష్కామ చిత్తంతో తపస్సు ప్రారంభించాడు చ్యవనుడు. అలా ఎంతకాలం తపస్సమాధి స్థితిలో వున్నాడో ఆ కాలానికే తెలియదు. అతని శరీరం కనిపించకుండా చ్యవనునిపై పెద్ద పుట్ట పెరిగింది. చ్యవనుడు ఆ పుట్టలోనే తపస్సు చేస్తున్నాడు.  ఆ రోజులలో వైవస్వత మనువు కుమారుడైన "శర్యాతి " ధర్మమే పరమావధిగా భావించి రాజ్యపాలన చేస్తున్నాడు.  అతని భార్య "స్థవిష్ఠ". వీరికి కలిగిన కుమార్తె "సుకన్య ". సుకన్య చుక్క. అందాల అపరంజి బొమ్మ. సుగుణాల కొమ్మ. రాయంచ నడకల ముద్దు గుమ్మ. చక్కదనాల చందమామ అయిన సుకన్యకు నవమన్మథుడులాంటి వరునితో పెళ్లి చెయ్యాలని శర్యాతి దంపతులు కలలు కంటున్నారు.  ఒకనాడు సుకన్య తన చెలికత్తెలు వెంటరాగా, పరివారంతో కలిసి వనవిహారానికి వచ్చింది. అందరూ అచ్చటి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై ఆటలు ఆడారు. పాటలు పాడారు. వారు అలా ఉల్లాసంగా వనవిహారం చేస్తుండగా సుకన్యకు ఒక పెద్దపుట్ట, ఆ పుట

భృగువు-పులోమ

Image
నిండు గర్భిణిని కామించిన పులోముడు నైమిశారణ్యం - 4 భృగువు-పులోమ భృగుపు బ్రహ్మమానస పుత్రుడు, ప్రజాపతి. హిరణ్యకశిపుని కుమార్తె అయిన దితి ఇతని పెద్దభార్య. వీరికి కలిగిన కుమార్తె దేవవర్ణి. భృగువు తన కుమార్తె అయిన దేవవర్ణిని, విశ్వదోబ్రహ్మకిచ్చి వివాహం చేశాడు. దేవదానవుల మధ్య భీకరయుద్ధం జరుగుతున్న రోజులలో శ్రీ మహావిష్ణువు అండ చూసుకుని దేవతలు విజృంభించారు. వారి ధాటికి నిలబడలేని రాక్షసులు యుద్ధభూమి నుంచి పారిపోయి భృగుపత్ని అయిన దితిని శరణు కోరారు. దితి వారికి అభయం ఇచ్చింది. ఈ సంగతి తెలిసి శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో దితిని సంహరించాడు. తన భార్య మరణానికి శ్రీహరే కారణమని తెలిసుకున్న భృగుపు కుపితుడై "నాలాగే నీవు కూడా భార్యా వియోగ దుఖాన్ని అనుభవిస్తావు." అని శ్రీహరిని శపించాడు. భృగువు యిచ్చిన శాపాన్ని శ్రీహరి, రామావతార కాలంలో సీతా వియోగం ద్వారా అనుభవించాడు. అనంతరం భృగువు, పులోమ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ పులోమ విషయం కాస్త ప్రస్తావించాలి.  పులోమ అతిలోక సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన "పులోముడు" అనే దైత్యుడు, పులోమను, వివాహం చేసుక