Posts

Showing posts from January, 2023

మాఘపురాణం -10వ 11వ 12వ అధ్యాయములు

MAAGHA PURANAM -- 10 మాఘపురాణం -10వ అధ్యాయము మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు మాఘపురాణము గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి. పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణయందు ఆసక్తి గలవాడు అయ్యాడు. . అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసారు. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను. కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసారు. సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శు

మాఘపురాణం - ఏడవ అధ్యాయం

MAAGHA PURANAM -- 7 మాఘపురాణం - ఏడవ అధ్యాయం మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును గురించి తపస్సు చేయ ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా! నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ అభీష్టం నెరవేర్చెదను” అని పలికాడు. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయమ’ ని ప్రార్థించాడు.

గర్భిణీకి సీమంతం చేయడం వెనుక ఉన్న రహస్యం!

Image
గర్భిణీకి సీమంతం చేయడం వెనుక ఉన్న రహస్యం! గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేయించి.. జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి.. కాళ్లకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, పూలతో జుట్టుని అలంకరించి.. కొత్త చీర కట్టి కుర్చీలో కూర్చోబెడతారు. ముత్తయిదవులందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఇంత ఘనంగా చేసే ఈ సీమంతం పండుగ వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? దీని వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? అవేంటో తెలుసుకుందాం పదండి. ఆడవారి జాతక కర్మలని మొత్తం 16 కర్మలు ఉంటాయి. వీటిని జన్మ సంస్కారాలు అని కూడా అంటారు. బిడ్డ పుట్టక ముందు మూడు, పుట్టిన తర్వాత 13 జాతక కర్మలు ఉంటాయని పెద్దలు చెబుతారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడ

భస్మధారణము

Image
భస్మధారణము ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్ఠివర్ధనం | ఉర్వారుక మివబన్దనాత్  మృత్యో ర్ముక్షీయ మామృతాత్ || శ్రీకరంచ పవిత్రంచ శోకరోగనివారణం | లోకే వశీకరణం పుంసాం భస్మం త్రిలోకపావనమ్ || ఊర్ద్వపుండ్ర ధారణము లలాటే సతతం దేవ్యాశ్రియా విరాజితమ్ | చతుశ్చక్రం నమస్యామి కేవలం కనకప్రభమ్ || మంత్రం రానివారు  నమః శివాయ అని చెప్తూ భస్మధారణ చేయాలి. స్త్రీహత్య, గోహత్య, వీరహత్య, అశ్వహత్య, పరనింద, అకారణహింస, పంటలనుదొంగిలించడం, తోటలను పాడుచేయటం, ఇల్లు తగలబెట్టడం, పాపుల నుంచి అన్నవస్త్రాలు, ధాన్య,జల, సువర్ణ దానం పట్టటం, పరస్త్రీసంగమం, బహిష్ఠయివున్న భామలతోసంగమం, అవివాహితలతోసంగమం, విధవతోసంగమం, మాంసం-తోలు-ఉప్పు అమ్మడం,చాడీలు చెప్పడం, కపటంగా ప్రసంగించడం, దొంగసాక్ష్యం, అసత్యం, అవి పూర్వజన్మవైనా ఈజన్మలోవైనాసరే, తెలిసిచేసిన తెలియకచేసిన నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి. ఆఫై దేవుడి ముందు దీపారాధన చేయాలి.🪔🪔🪔👏🌸🌸🍏🍏🌺🌺🥭🥭

సంక్రాంతి ముగ్గుల చరిత్ర:

Image
సంక్రాంతి ముగ్గుల చరిత్ర:  మొదటి ముగ్గు ఎవరు వేశారు?  రంగవల్లి ఎలా పుట్టింది? సంక్రాతి అనగానే ముగ్గులు, పిండి వంటలు, కొత్త బట్టల తళుకులు, తమిళ నాట అయితే మార్గాహి సాంస్కృతిక సౌరభాలు వెదజల్లుతూ పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో ఇళ్లన్నీ దర్శనమిస్తాయి. ఈ రంగు రంగుల ముగ్గులకి కూడా ఒక చరిత్ర ఉందా? ఇవి కేవలం సంస్కృతిలో భాగమా? ఆధునిక యుగంలో ఇంకా వీటికి ప్రత్యేకత ఉందా? ముగ్గుల చరిత్ర ఏమిటి? ఇవి ఎలా రూపాంతరం చెందాయి? "థౌజండ్ సోల్స్: విమెన్, రిచువల్ అండ్ ఎకాలజీ ఇన్ ఇండియా, ఆన్ ఎక్స్‌ప్లొరేషన్ అఫ్ ది కోలం" అనే పుస్తక రచయత విజయ నాగరాజన్ తన పుస్తకంలో ముగ్గులు, వాటి చరిత్ర, మహిళల జీవితంలో వాటి ప్రాధాన్యతలను విస్తృతంగా చర్చించారు. ముగ్గులను ఉత్తరాదిలో రంగోలి, తమిళనాడులో కోలం, బెంగాల్‌లో అల్పన, రాజస్థాన్ లో మండన, సంస్కృతంలో మండల అని అంటారు. ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఏమి లేవని అంటూ, వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని. తమిళ సంస్కృతిలో తొలిసారిగా

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

Image
 విష్ణు సహస్రనామ స్తోత్రాలు 1 కి  2  సార్లు  పైకి చదువుచూ, కంఠస్థం చేయండి .  ప్రతిపదార్థాలు  కూడా  మనసు  బెట్టి, చదివి, చక్కగా ఆకళింపు చేసుకోండి. మీరు, కలకండ పలుకులు  చప్పరించినంత మాధుర్యాన్ని / అమృతాన్ని చవిచూడవచ్చు  #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము  🕉️ శ్లోకం 01 🕉️ హరి : ఓమ్ విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|| భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః|| 1. విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము), సకల విషయము లందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు. 2. విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు). 3. వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు) ; అంతటినీ నియంత్రించి పాలించు వాడు. 4. భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్