Posts

Showing posts from September, 2018

క్రియాయోగులు

Image
క్రియాయోగులు   Share   ఎందరో  మహానుభావుల పుట్టినిల్లు మన భారతదేశం. యోగిపుంగవులు హిమాలయాలయ పర్వత గుహల్లో తపస్సు చేసుకొని ముక్తి మార్గంలో ముందుకు సాగారు. దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు ఈ హిమాలయ సొగసులను క్రీడావనంగా చేసుకున్నారు. దేవతలంతా పున్నమి నాడు జ్యోతి స్వరూపంలో వచ్చి స్నానమాడి పునీతులయ్యే సుందర ప్రదేశమే మానససరోవరం. ఎందరో మహనీయులకు ఇది ఆవాసం, మహిమలకు నిలయం హిమాలయం.  ఇచ్చోటనే కదా ఈశుని శిరమున  జారిన జాహ్నవి, చేరి భూమికి,  ఇచ్చోటనే కదా హిమగిరి పుత్రిక  వలపుల తేలించె పరమశివుని  ఇచ్చోటనే కదా ఇక్షు బాణము వాని  ఇల్లాలి మాంగల్యమేటకలసె  ఇచ్చోటనే కదా పిచ్చి ప్రవరాఖ్యుండు  కామించు వనితను కాదుయనెను.  మానససరోవరాంర మధురపవన  హతులనూగెడి హిమగిరి వావ్యభూమి  సర్వఔషధుల నెలవు సాధుమునుల  మాన్య జనులకు వాసంబు మంచు కొండ    దక్షయజ్ఞంలో పరమేశుని అర్ధాంగి సతీదేవి ఆహుతైపోగా వైరాగ్యంతో మహేశుడు తీవ్ర తపోదీక్షలో ఉన్నాడు. ఆ సతీదేవి సాంబశివుడినే కోరి హిమవంతుని పుత్రికయై పార్వతి అనే పేరుతో పుట్టింది. దేవతలు, మునులు ఎంతో పరితపించి వారి మనస్సులో వలపు రగిలించడానికి రతీ మన్మథులను పంపారు. ఇక్షు

క్రియాయోగులు 6

Image
క్రియాయోగులు 6   Share (గత సంచిక తరువాయి) తమ  అనుభవాలు, బాల్య కథలుగా స్వామీజీ తమ శిష్యులకు వివరించేవారు. ఒకసారి వారమ్మ మంచి పెద్ద పనస పండు తెచ్చింది. దాని కమ్మని వాసన తేనెలూరే పనస తొనల రుచి సాటిలేనిది. అలాంటి పండు అంటే ఎవరికి ఇష్టముండదు. వారి కుటుంబసభ్యులు అందరూ తినాలని దాచిన ఆ తొనలను బాల నాగరాజు స్వామి లేని సమయంలో చాలా తినేశాడు. తల్లి వచ్చి చూసింది. ఏమీ తెలియని అమాయకునిలా ముఖం పెట్టివున్న మన్నుతిన్న బాలకృష్ణునిలా, వెన్నతిన్న వెన్న దొంగలా ఉన్న ఆ బాలుడిని చూసి ఆగ్రహించి కఠినంగా దండించింది. దాదాపు అలసిపోయినా స్పృహ తప్పేదాకా కొట్టింది. చిన్న తప్పుకే ఇంత దండన విధించిన ఆ తల్లిపై మమకారం తగ్గింది. అనుబంధం అంతరించింది. తల్లిదండ్రుల ప్రేమ దూరమైనట్లు తోచింది. ఇది ఒక దైవ ప్రేరితమో లేక వైరాగ్యానికి నిర్దేశయో, యోగ మార్గానికి అనుబంధమేమో. ఈ బాలనాగరాజు సామి 5 సంవత్సరాల వయస్సులో ఉన్న కాలంలో ఆ పరంగిపట్టి ఆలయంలో గొప్ప ఉత్సవం జరుగుతోంది. నలుమూలల నుంచి వేలాది జనం  తిరునాళ్లకు వచ్చారు. ఎక్కడ చూసినా సందడి, కోలాహలం, బాజా భజంత్రీలు, భజనలు, అంగళ్ల సందడి. ఈ బాలనాగరాజు ఆలయ ద్వారం ప్రక్కగా ఈ వినోదం చూస్తూ నిలబడి ఉ

క్రియాయోగులు-3

Image
క్రియాయోగులు-3   (గత సంచిక తరువాయి) మహావతార్‌ బాబాజీ ఎవరా మహావతార్‌ బాబాజీ ? ఎలా అగస్త్యుల అనుగ్రహం పొందారు? వారు ఎలా ప్రసిద్ధులయ్యారు? అనే విషయాలను తెలుసుకుందాం. మహావతార్‌ బాబాజీ అది దక్షిణ భారతదేశంలో పోతంగీ పర్వత ప్రాంతం. కుర్తాళం తీరంలో దట్టమైన అరణ్యం. కుర్తాళం అనేది 64 శక్తి పీఠాలలో శక్తిమంతమైనది. అది ఆదిపరాశక్తి మూలస్థానం. ఆ సమీపంలో 14 ఏళ్ల వయసున్న ఓ బాలుడున్నాడు. అతన్ని చూస్తే ధ్రువుడా, ఝటావల్కధారా?, బాలకుమారస్వామా?, సిద్ధేంద్రుడా? అనిపిస్తుంది. ఆ తోజోమయుడు భయంకర అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడు. శరీరం, మనస్సు, చిత్తం, బుద్ధి, ఆత్మ అన్నిటినీ ఏకోన్ముఖం చేసి ధ్యానం చేస్తున్నాడు. మహానుభావుడు, సకల విజ్ఞానవేత్త, దేవర్షి, అగస్త్య మునీంద్రుల దర్శన అనుగ్రహం, ఉపదేశం ధ్యేయంగా కఠోరదీక్ష చేస్తున్నాడు ఆ బాలకుడు. క్రిమికీటకాలు పెట్టే బాధల్ని కూడా అతను పట్టించుకోవడం లేదు.     అటువైపు అరుదుగా వచ్చే సాధువులు, యాత్రికులు ఈ బాలుడిని దర్శించి అతని తపోదీక్షకు మెచ్చి ఆహారం, పానీయం అందించేవారు. అగస్త్యులవారు పురాణ పురుషుడు. నిజంగా తనకు దర్శనం ఇస్తాడా? అనే సంచయం ఆ బాలకుడికి ఉంది. అయినా బలవంతంగా మ

క్రియాయోగులు 4

Image
క్రియాయోగులు 4 (గత సంచిక తరువాయి) ''ఏడీ  మీ గురువు భోగీంద్రులు, నాయానా రా... నీవల్లనే ఈ బాలుడు ఈ స్థితికి వచ్చాడు'' అని పిలవగా ఆ బాలుడి యోగక్షేమాలు చూడటానికిి సమీపంగా ఉన్న భోగీంద్రులు వచ్చి అగస్త్యుల పాదాలపై పడి ''స్వామీ ఈ బాలయోగి వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది'' అని స్తుతించాడు. ''భోగీంద్రా.... ఎవరీ బాలుడు? ఇతని దీక్షకు కారణణ ఏమిటి?'' వివరించమన్నారు అగస్త్యులు. ''స్వామీ తమకు తెలియనిదా నా విషయం. ఈ బాలుడి విషయం తమకు తెలియదా'' అన్నాడు భోగీంద్రుడు.  ''నాకు తెలిసినా తెలియకున్నా విన్నవించండి. విన్న వించడం సంప్రదాయం, మకరి చే చిక్కిన మదగజం ఆర్తి, అచ్యుతునకు తెలియకనా, కౌరవ సభలో అవమానం పొందు సమయంలో ద్రౌపది ఆపద తెలియకనా, వారు ఎలుగెత్తి పిలిచి, తమ అర్తిని విన్నవించాక కరుణించాడు కమలదళనేత్రుడు'' అనగానే ఈ బాలదీక్షపరుని వృత్తాంతం భోగీంద్రులు అగస్తులకు ఇలా విన్నవించుకున్నాడు. బాల బాబాజీ బాల్యం క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలలో శాక్యముని, గౌతమ బుద్దుడు అవతరించి, అహింసే పరమ ధర్మం అని ప్రతిపాదించారు. ధర్మం శరణం గచ్

క్రియాయోగులు-2

క్రియాయోగులు-2   భారతదేశానికి హిమాలయాలు శిరఃప్రాయములు, కన్యాకుమారి పాదపీఠంగా, మూడు దిక్కులా సముద్ర జలాలు, పాదప్రక్షాళన చేస్తుంటాయి. ఇక మధ్య కటి సూత్రమైన వడ్డాణమై వింధ్య పర్వతం విరాజిల్లుతుంటుంది. ఆ వింధ్య పర్వత రాజుకు కొద్దిగా అహం కలిగింది. నేనింతటి వాడిని ఉండగా లెక్కచేయకండా మేరు పర్వతానికి మాత్రమే ప్రదక్షిణం చేస్తున్నాడు ఆ భాస్కరుడు అనుకుని.. ‘‘మతి తప్పిందా నీకు’’ అని ఆ సూర్యుడిని అడిగాడు. దానికి సూర్యుడు.. ''బ్రహ్మదేవుడి ఆదేశం ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరగటం నా ధర్మం. దాన్ని నేను నిర్వర్తిస్తున్నాను'' అని చెప్పాడు. దీనికి ఆగహ్రించిన వింధ్య పర్వతరాజు చుక్కలు తాకునట్లు అమితంగా పెరగజూశాడు. దాని వల్ల సూర్యచంద్రుల కాంతి భూమిపై ప్రసరించడానికి అవరోధం కలిగి, అంధకారమైంది. దేవతలెందరో చెప్పి చూసినా వినలేదు. ఇక మన మాట వినడని వేలుపులు నిర్ణయించుకొని ఆఘటనా ఘటన సమర్థుడైన అగస్త్యుని చెంతకు చేరి.. దేవా మునీంద్రా! ఈ వింధ్య గర్వం వలన భువనాలకు ఉపద్రవం కలుగుతోందని, దాన్ని నివారించాలని ప్రార్థించారు. అగస్త్యుడు కూడా ఆ త్రోవనే దక్షిణం చేరాలని బయలు దేరాడు. వింద్యాచలం చేరాడు. అగస్త

క్రియాయోగులు 23

Image
క్రియాయోగులు 23   Share (గత సంచిక తరువాయి) బంధాలు వీడాయి గురుగోవింస్వామి  బ్రహైక్యం చెందారు. తన నిర్యాణం తెలిసిన స్వామి వాసుదేవులను పిలిచి, తన పుస్తకాలను ఉపనిషత్తులు, సాలిగ్రామాలు అప్పచెప్పారు. అనారోగ్యం కలిగింది. మన్యుసూక్తం పారాయణం చేశాడు. వాసుదేవులు పారాయణం చేస్తుండగా స్వామి విశదీకరించారు. వాసుదేవుని ఆశీర్వదించారు. ఇక కాల సమీపించిందని స్వామి, వాసుదేవుని వద్దకే ఉండమన్నారు. ఆ స్వామి నిర్యాణానికి మౌనస్వామితో సహా భక్తులంతా దుఃఖితులైనారు - అక్కడి ఆచార ప్రకారం స్వామి భౌతిక దేహాన్ని కృష్ణానదిలోకి విడిచారు. అంత్యక్రియలు వాసుదేవులే చేసి గురు ఋణం తీర్చుకున్నాడు. తరువాత వాసుదేవులకు ఉత్తరదిశగా పయనించమని ఆదేశం అందింది. వాడిలోని పెద్దలు, ముని స్వామి వద్ద సెలవు తీసుకుని, కొల్హాపూరు, పండరీపూరి, బార్షి నుంచి గంగాఖేడ్‌ చేరారు. అక్కడ భార్యకు కలరా తగిలింది. 1891 వైశాఖ బ. చతుర్ధశిన వాసుదేవుల సతీమణి వీడిపోయింది. ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ - ఆమె అంత్యక్రియలు చేశాడు. ఆ బంధం కూడా పోయింది. సన్యాసం తీసుకోవాలని సంకల్పానికి ఉన్న ఒక్క ఆటంకం తొలగిపోయింది. వాసుదేవుని కూడా కలార తగిలింది. ఇలా తన

సిద్ధేస్వరి పీఠం కుర్తాళం

Image
— Main Menu —Home Peetham Deities & Nithya Seva Present Swamiji- Videos  - Books by Sri Swamiji  - Books from Poorvasramam  Peethadhipathi Parampara- Swami Sri Siva Chidananda Saraswathi (Mouna Swamy) (Est. 1916 – December 28th, 1943)  - Swami Sri Vimalananda Bharati (August 20th, 1878 – January 25th, 1950)  - Swami Sri Trivikrama Ramananda Bharati (September 14th, 1901 – January 23rd, 1991)  - Swami Sri Siva Chidananda Bharati (August 22nd 1929 – December 17th, 2002)  - Swami Sri Siddheswarananda Bharati (January 23rd 1937 – present)  Peetham Activities YouTube Channel Photo Gallery- Present Swamiji  - Peethadhipathis  Downloads Books/Publications Contact Us  You are here:  Home  / Peetham Deities & Nithya Seva Peetham Deities & Nithya Seva Peetham Sri Siddheswari Peetham is located in Courtallam, Tirunelveli district, Tamilnadu state in India. Courtallam is a tourist center in India famous for its waterfall and natural beauty. The Surroundings of Courtallam has