Posts

Showing posts from September, 2020

చందమామ కథలు*

*చందమామ కథలు*  🍃🌹🦜🍃🌹🦚 14-9-2020 *మహేంద్రపురి రాజ్యంలో, సర్పవరం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సాంబన్న అనే పాములు పట్టేవాడుండేవాడు. పాముకాటుకు చికిత్స చేయడంలో కూడా అతడికి మంచి పేరుండేది. సాంబన్నకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. సాంబన్న వాడికి నాగరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. సాంబన్న భార్యకు మహా జాతకాలపిచ్చి.* *ఆమె ఒకసారి కొడుకు జాతకం, ఆ గ్రామంలో పేరుమోసిన ఒక జ్యోతిష్కుడికి చూపించింది. ఆ జాతకాన్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూసిన జ్యోతిష్కుడు సంభ్రమాశ్చర్యాలతో సాంబన్న దంపతులకు, ‘‘ఔరా, ఏమిటీ వింత! మీ కొడుక్కు రాజయోగం ఉంది,'' అని చెప్పాడు. ‘‘రాజయోగమా! హాస్యాలు మాని అసలు సంగతి చెప్పండి, సాములూ,'' అన్నాడు సాంబన్న. ‘‘హాస్యం కాదురా, సాంబూ.* *నిజమే చెబుతున్నాను. నీ కొడుకు రాజయ్యూక, నన్ను మరిచిపోకు,'' అన్నాడు జ్యోతిష్కుడు, జాతక పత్రాన్ని కళ్ళకద్దుకుని సాంబన్న చేతికిస్తూ. ఆ మాటలతో సాంబన్నకు, కొడుకు రాజయోగం పట్ల కొంత నమ్మకం కలిగింది. జ్యోతిష్కుడు చెప్పినట్లు కొడుకు రాజైతే, చదువు రాకపోవడం బాగుండదని, నాగరాజును బడిలో చేర్పించాడు.* *నాగరాజు పదేళ్ళ వయ

శిలాదమహర్షి

పర్వతలింగం ************ పాల్కురికి సోమనాథుడు శ్రీశైల మహాత్మ్యమును "పండితారాధ్య చరిత్ర" పర్వతప్రకరణంలో శిలాదమహర్షియొక్క కఠోరమైన తపస్సుకు మెచ్చి శివుడు అతనికి ముగ్గురు పుత్రులను ప్రసాదించినట్టుగా చెపుతాడు. మొదటివాడు నందీశ్వరుడు. ఇతడు ఎన్నో వేల ఏండ్లు తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి శివుడికి వాహనత్వాన్ని, ప్రమథాధిపత్యాన్ని పొందాడు. రెండవవాడు పర్వతుడు. ఇతడు కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి "పర్వతుడను పేరు గల నేను మహాపర్వతాకారాన్ని ధరించి స్థిరంగా నెలకొంటాను. నీవు నా ఉత్తమాంగం(శిరస్సు) పై అధివసించి పూజలు గైకొనుము" అని వేడుకుంటాడు. శివుడు "తథాస్తు" అంటాడు. మూడవవాడు భృంగీశ్వరుడు. ఇతడు కూడా కఠోరమైన తపస్సు చేసి, శివుణ్ణి మెప్పించి, "శివైకనిష్ఠాభక్తుడిగా, శివసభలో విదూషకుడిగా, నాట్యాచార్యుడిగా" ప్రసిద్ధికెక్కాడు. ఈ విషయం స్కాందపురాణంలో కూడా ఉన్నది. 🔹ఇది శ్రీశైల ఆలయ ప్రాకారం పైన గల శిల్పం. కుడి వైపు శిలాదుడు తపస్సు చేస్తున్న దృశ్యం. శివుడు అతణ్ణి అనుగ్రహిస్తున్న దృశ్యం. ఎడమ వైపు శిలాదుని ముగ్గురు పుత్రులు నందీశ్వరుడు, పర్వతుడు, భృంగీశ్వరుడు ఒకే చోట ఉన

మహాసర్పం వాసుకి.

పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళల స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు వున్నారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వారు వాదిస్తారు. వారి వాదన

నవగ్రహాల శక్తి

నవగ్రహాల శక్తి గురించి మీకు తెలుసా?   గ్రహానికి శాంతి చేయించుకోమని జ్యోతిష్యులు చెప్పారా? గ్రహానికి శాంతి చేయించుకుంటే ఎలాంటి ఫలితం చేకూరుతుంది అని తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి. మనకు నవగ్రహాలున్నాయి. నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. నవగ్రహాల్లో మూడోవాడైన రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.    గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.    ఇక బుధ గ్రహం బుద్

ఆర్యభట్ట

ఆర్యభట్ట '0' ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగంలో కనుక్కున్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఒక విద్యార్ధి అడగగా, ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ, అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు. పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది. ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో   నేను మీకు వేదాల నుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను. 1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్నికి ఈ విధంగా ప్రార్ధించాడు. ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ, సంత్వేక కా, దశ కా, శతం కా, సహస్రం కా, యుతం కా, నియుతం కా, ప్రయుతం కా, అర్బుదం కా, న్యార్బుదం కా, సముద్రం కా,మధ్యం కా, అంతం కా, పరార్ధం కా, ఇత మే అగ్నా ఇష్టక దేనవ సంత్వాముత్రం ముష్మిన్లోకే. అగ్ని ప్రతిష్టకు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు. అంటే, ఓ అగ్ని దేవా! ఈ ఇటుకలే నాకు పాలిచ్చే ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి అవి ఒకటి, పది, వంద, వేయి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి, పది కోట్లు, వంద కోట్లు, వేయి క

హనుమాన్‌ చాలీసా*

🪔🕉 *హనుమాన్‌ చాలీసా* 🕉🪔 *శ్రీ గురుచరణ సరోజరజనిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమల యశ జో ధాయక ఫల చారీ బుద్ధిహీన తను జానికే సుమిరైపవన కుమార్‌ బల బుద్ధి విద్యా దేహు మొహి హరము కలేశ వికార్‌* 1. జయహనుమాన జ్ఞాన గుణసాగర | జయ కపీశ తిహులోక ఉ జాగర 2. రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవన సుత నామా|| 3. మహావీర విక్రమ బజ రంగీ | కుమతి నివార సుమతికేసంగీ 4. కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 5. హాథ వజ్ర ఔధ్యజావిరాజై | కాంథే మూంజ జనేపూసాజై 6. శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 7. విద్యావాన గుణీ అతి చాతుర | రామకాజ కరివేకో ఆతుర || 8. ప్రభు చరిత్రసునివేకో రసియా | రమ లఖన సీతా మనబసియా || 9. సూక్ష్మరూప ధరి సియహి దిఖవా | వికటరూప దరి లంకజరావా || 10. భీమ రూప ధరి అసుర సంహారే | రామచంద్రకే కాజ సవారే || 11. లాయ సజీవన లఖన జియాయై | శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 12. రఘుపతి కిన్హిబహుత బఢాయీ | తమ్మమప్రియభరతహి సమభాయీ || 13. సహస్ర వదన తువ్హురో యశగావై | అసకహి శ్రీపతికంఠలగావై || 14. సనకాదిన బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత ఆహీశా || 15. యమ కుబేర దిగపా జహాతే | కవి కోవిద కహిసకేకహాతే || 16. తుమ ఉపకార

గాయత్రీ దేవి

గాయత్రీ దేవి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో' అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. 'మరేదైనా వరం కోరుకో' అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి"మ్మని కోరాడు. బ్రహ్మ "తథాస్తు" అన్నాడు. బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని

గోధూళికా ముహూర్తము

గోధూళికా ముహూర్తము  సూర్యుడున్న ముహూర్తమునుండి ఏడవది గోదూలికా ముహూర్తమని అనబడును . విపులంగా చెప్పాలి అని అంటే పూర్వము పశువులు ఎక్కువగా ఉండేవి . ఉదయాన్నే ఊరి బయటకు మేత కొరకు పశువులను తోలుకు పోయేవారు. తిరిగి సాయంకాలము సూర్యాస్తమయమునకు ముందుగా ఇంటికి తోలుకు వచ్చేవారు .  అలా వచ్చే సమయములో పశువుల మంద వచ్చేటప్పుడు ధూళి రేగేది . అలాంటి సమయమును గోదూలికా ముహూర్తముగా వివరించితిరి . క్లుప్తంగా చెప్పాలంటే సాయంకాలం 4.30 నిమషముల నుండి సుమారు 6 గంటల వరకు ఈ సమయము ఉండును. దీనినే గోదూలికా ముహూర్తము అని అంటారు . ఈ ముహూర్తమును సకల శుభాలకు ఉపయోగించ వచ్చును . వర్జ్యము , దుర్మూహర్తములతో పనిలేదు .  హిందువుల దైనిక ఆచారాలలో సాయంసంధ్యకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని "గోధూళి వేళ" అని, "అసుర సంధ్య" అని కూడా వ్యవహరిస్తారు. పగటికి రాత్రికి సంధి కాలమే సంధ్యా సమయం. సూర్యాస్తమయం తర్వాత రమారమి 45 నిమిషాలు అసురసంధ్య. ఈ సమయంలో శుచి,శుభ్రతలతో భగవంతుని ప్రార్ధించాలి. భోజనం చేయడం,నిద్రపోవడం లాంటి పనులు చేయరాదు. ఈ సమయంలో పరమశివుడు పార్వతీ సమేతంగా కైలాసంలో తాండవం చేస్తాడు. కైలాసమందలి ప్రమథ గణములు, భూతకో

*శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం*

*శ్రీ ఆది శంకరాచార్య విరచిత శ్రీ దత్తాత్రేయ షట్చక్ర జాగరణ స్త్రోత్రం* 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 🕉🌞🌏🌙🌟🚩 కుండలిని జాగృతికి, దత్తోపాసనకు, శ్రీ దత్త ప్రభువు దివ్య అనుగ్రహమునకు ఈ స్తోత్రరాజం విశేషమైనది.  1) దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ । పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥ భావం:- దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు,పద్మాసనంలో విరాజమానులై ఋషులు,దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును. 2) మూలాధారే వారిజపద్మే సచతుష్కే వంశంషంసం వర్ణవిశాలైః సువిశాలైః । రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥  భావం:- మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము లకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి. దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు. శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కారించుచున్నాను. 3) స్వాధిష్ఠానే షట్దలపద్మే తనులింగే బాల

రామేశ్వరం లోని 22 తీర్థములు (22 బావులు) పేర్లు*

*రామేశ్వరం లోని 22 తీర్థములు (22 బావులు) పేర్లు* 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱 *1. మహాలక్ష్మి తీర్థము* *2. సావిత్రి తీర్థము* *3. గాయత్రి తీర్థము* *4. సరస్వతి తీర్థము* *5. సేతు మాధవ తీర్థము* *6. నల తీర్థము* *7. నీల తీర్థము* *8. గవయ తీర్థము* *9. కవచ తీర్థము* *10. గంధమాదన తీర్థము* *11. చక్రతీర్థము* *12. శంఖ తీర్థము* *13. బ్రహ్మ హత్యాపాతక విమోచన  తీర్థము* *14. సూర్య తీర్థము*  *15. చంద్ర తీర్థము* *16. గంగా తీర్థము* *17. యమునా తీర్థము* *18. శివ తీర్థము* *19. సర్వ తీర్థము* *20. కోటి తీర్థము* *21. సత్యామృత తీర్థము* *22. గయా తీర్థము* 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం

🌻🌹శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్ - తాత్పర్యం🌹🌻 పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు. హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ "

ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ " ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,  ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,  ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,  తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి  శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః | రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః | నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః || న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ | నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః || న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః | న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా || న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా | నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ || నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా | అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః || గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి | అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః || రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రా

పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు

💐💐పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?💐💐  పదనాలుగు లోకాలలో..! మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, సువర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.    నాల్గొవదైన మహర్లోకం  కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకంలొ కల్పాంత జీవులు ఉంటారు.  అయిదోవది అయిన జనలోకంలొ  బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.  ఆరొవదైన తపోలోకంలో  దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.  ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.  ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.  తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.  పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.  పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.  పన్నెండో వది అయిన మహాతలం లొ  కద్రువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణు

దశ మహావిద్యలు - కాళి మహా విద్యా

దశ మహావిద్యలు - కాళి మహా విద్యా "కాళి" కాల రూపంలో ఉన్న ఈశ్వర శక్తి. తాంత్రికుల దృష్టిలో, యావత్ ప్రపంచము, ఒక మహా శ్మశానము. కాళి, కాల గమనములోని అనంతమైన కదలికలను, అనంత వేగముతో-తన సునిశితమైన నాట్య భంగిమలతో వ్యక్తము చేయును. ఆమె, సర్వమును కబళించు నిర్ధాక్షిణ్య మారణ ప్రక్రియకు సంకేతము. అయితే, కాళి తత్వము నందు అనేక రూపాలు కలవు. దక్షిణ కాళి, భద్ర కాళి, శ్మశాన కాళి...ఇలా.... శాక్తేయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు. తంత్రంలో కాళిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాణ-తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించింది. నిరుత్తర-తంత్రం, పిచ్చిల-తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహా శక్తివంతమైనవిగా  పేర్కొంటాయి. కాళీ తత్వాన్ని మనము విమర్శనాత్మకంగా పరిశీలిస్తే, ఆమె చర్యలలో దివ్యమైన విమర్శనాత్మక దృక్పథం దాగియున్నది. ఆమె చర్యలు సృష్టి కార్యక్రమానికి నాంది. ఆమె ఈ సృష్టి కార్యాన్ని తన అత్యంత పవిత్రము, శుభప్రదమైన భద్రకాళి రూపముతో నిర్వర్తించును. కాళి మహావిద్యా రూపము ఈ క్రింది విధ

హనుమాన్ స్తోత్రం

హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం (Sri Hanuman Dwadasa Nama Stotram) హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలహ: రామేష్టా పాల్గుణ సకః పింగాక్షో  అమిత విక్రమః ఉదధిక్రమణస్చైవ సీత శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతఛ దశ గ్రీవస్య దర్పహా ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాప్నకాలే పతేనిత్యం యాత్ర కాలే విసేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ఆంజనేయ దండకమ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకు

వాయు పుత్ర హనుమాన్....

వాయు పుత్ర హనుమాన్....  రావణ వధకై బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి, విష్ణువు.. దశరథుని తండ్రిగా చేసికోవడానికి ఇష్టపడ్డాడు.  అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో  "అవతరించే విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులూ కామరూపులూ అయి, మీ మీ శక్తులు కలిగియుండేలాగు పుత్రులను సృజింపుడు" అన్నాడు. "ఎలుగుబంటులలో శ్రేష్థుడైన జాంబవంతుని తాను చాల క్రితమే సృజించాను" అని కూడా అన్నాడు. అప్పుడు... 1. ఇంద్రుని వల్ల       - వాలి, 2. సూర్యుని వలన   - సుగ్రీవుడు,  3. బృహస్పతి వల్ల   - తారుడు,  4. కుబేరుని వలన   - గంధమాదనుడు,  5. విశ్వకర్మ వలన    - నలుడు,  6. అగ్నీ వలన         - నీలుడు,  7. అశ్వినీ దేవతల వల్ల  - మైంద ద్వివిదులు,  8. వరుణుని వలన   - సుషేణుడు, 9. పర్జన్యుడని వలన - శరభుడు,  10. వాయువు వల్ల   -    హనుమ జన్మించారు. పరాక్రమాలు గల అనేకమంది - గోలాంగూల (కొండముచ్ఫు) స్త్రీలయందూ, ఋక్షస్త్రీల యందూ, కిన్నర స్త్రీలయందూ జన్మించారు. ప్రధానంగా పైన పేర్కొన్న పదకొండు మందీ, పదకొండు విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులు కలిగి, ఆయావిభాగాలలో నిష్ణాతులు.  ఒక భారీ పథకము (Project) చేపట్టేటపుడు కావలసిన

రాధ కృష్ణుడికి ఎందుకుదూరమైంది

రాధ కృష్ణుడికి ఎందుకుదూరమైంది యుగాలు మారినా ప్రపంచంలో మారనిది ప్రేమ భావన ఒక్కటే. ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలం ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమకునిర్వచనం ఏమిటని ఎవరైనా అడిగితే ‘‘రాధ’’ అనే రెండక్షరాలు సరిపోతాయి. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. అలాంటి రాధ కృష్ణుడితో చివరంటా ఎందుకు లేదు. బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తరువాత ఏమైంది?.? బృందావనంలో కృష్ణుడితో ఎంతమంది గోపికలు ఉన్నా అతను మాత్రం రాధతోనే అలౌకిక ఆనందం పొందేవాడు. అక్కడికి సమీపంలోని వ్రేపల్లె అనేచిన్న గ్రామంలో రాధ ఉండేది. రాధ కృష్ణుడి కంటే పదేళ్లు పెద్దది. అయినా వారి ప్రేమకు వయసు అడ్డురాలేదు. కంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు. గోపికలంతా ఏడుస్తూ వెళ్లవద్దని కోరతారు. వారిని ఎలాగోతప్పించుకుని కృష్ణుడు వ్రేపల్లె వెళతాడు. అక్కడ కేవలం 5 నిముషాలు మాత్రమే ఉంటాడు. ఇద్దరూ మౌనంగా ఒకరినినొకరు చూసుకుంటారు. రాధఒక్క ప్రశ్న కూడా కృష్ణుడిని అడగదు. అతను వెళ్లవలసిన అవసరం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అంతేకాదు భౌతికంగా దూరంగా ఉన్నాకృష్ణుడినుంచి తాను దూరం కానని కూడా ఆమెకు తెలుసు. వారిద్దరి

అక్షయపాత్ర

*అక్షయపాత్ర* 🕉️🌞🌎🏵️🌼🚩  *అనుద్యూతంలో కూడా ఓడిపోయాకా అన్నమాట *ప్రకారం పాండవులు రాజభోగాలన్నీ విడిచిపెట్టారు. నారచీరలూ, కృష్ణజినమూ ధరించారు. కందమూల* ఫలాలు *తింటూ పన్నెండేళ్ళు అరణ్యవాసమూ, ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి సంసిద్ధులయ్యారు.*   *అలా వెళ్తున్న వాళ్ళను చూసి*  “ *ఏమున్నా ఏం లేకపోయినా ఈ పరమదుష్టుడు దుర్యోధనుడి రాజ్యంలో మాత్రం మనం వుండలేం. అసలు వాడే దుర్మార్గుడు. పైగా వాడికి జర, వ్యాది, మృత్యుపుల్లగా కర్ణుడు, సైంధవుడు , శకుని తోడయ్యారు. ఇటువంటి పుణ్యపురుషుడు రాజ్యం చేస్తుంటే ఇంక ఈ దేశంలో ధర్మం ఏం నిలుస్తుంది కనుక! పదండి, మనం కూడా పాండవులతో వెళ్ళి వాళ్ళెక్కడుంటే అక్కడే వుందాం” అని ఆక్రోశిస్తూ పౌరులంతా పాండవుల వెంట పరుగెత్తారు.*   *“నాయనలారా! మేము సర్వమూ పోగొట్టుకున్నాం. కందమూలాలే తింటూ అరణ్యవాసం* *చేయబోతున్నాం. మాతో పాటు మీరు కూడా* *కష్టపడటమెందుకు? మామీద అనుగ్రహముంచి వెనెక్కి వెళ్ళిపోండి” అని పాండవులు బ్రతిమాలారు.*   *“ధర్మరాజా! నీవున్న అరణ్యమే మాకు శరణ్యం. ఆశ్రయించినవాళ్ళు శత్రువులైనా* *విడిచిపెట్టకూడదంటారు. అలాంటప్పుడు మీ మీద భక్తి కలిగి నిన్నాశ్రయించిన మమల్ని విడిచిపెట్టటం మీక

ఏది స్వర్గం? ఏది నరకం?*

*ఏది స్వర్గం? ఏది నరకం?*  🕉️🌞🌎🏵️🌼🚩 ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు. శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లే

ఏకాగ్రతా రహస్యం

_*ఏకాగ్రతా రహస్యం*_ _*ఏకాగ్రతే విజయరహస్యం. ఆ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు.*_  _కేవలం యోగులకే ఏకాగ్రత అవసరమని అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరికి ఏకాగ్రత అత్యవసరం. ఎవరు ఏ పని చేస్తున్నా ఏకాగ్రత అవసరం ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి. ఉదాహరుణకు సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి ఏ కొద్దిగా ఏమరపాటుగా ఉన్నా, అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంది, అదే విధంగా ప్రతి ఒక్కరికి వారి వారి పనివృత్తులలో మరియు విద్యార్థుల చదువు విషయంలో అన్నిట్లో ఏకాగ్రత అందరికి అవసరం._  _కాబట్టి అందరూ ఎంతో అప్రమత్తంగా, తమ మనస్సును అదుపులో పెట్టుకొంటూ పని చేస్తుంటారు. దీనిని బట్టి చూస్తే అందరూ నిరంతరం వారి మనస్సును ప్రయత్నం ద్వార ఏకాగ్రతను సాధిస్తున్నారని మనకు అర్ధమవుతుంది._ _భగవద్గీతలో అర్జునుడి ప్రశ్నకు సైతం భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పిన సమాధానం :_ _అర్జునుడు : కృష్ణా ! మనసు ఎంతో చంచలమైనది. అది నిరంతరం అవిశ్రాంతితో చరిస్తూ ఉంటుంది. అదే సమయంలో మనస్సు శక్తివంతమైనది కూడ !దానిని నియంత్రణలో ఉంచడం అంటే గాలిని పట్టి బంధించడం లాంటిదే ! మరి అలాంటి మనసును నియంత్రణలోకి తీసుకురావడ

పూజా పునస్కారాలెందుకు

🕉పూజా  పునస్కారాలెందుకు ?🕉  లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే'   హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి !! నుదుట వ్రాసిన రాతలు చెరిపివేయడం బ్రహ్మ చేతకానీ, విష్ణువు చేతకానీ, శివుడి చేతకానీ ఎవరివల్లా కాదు.   విధిరేవ గరీయసి’ – పూర్వ కర్మలననుసరించి ఏది అనుభవించాలో నిర్దారింపబడి ఉంటుంది. దానిని విధి అంటారు. అది అనుభవించక తప్పదు.   ప్రారబ్ధం భోగతే నశ్యేత్ –  అనుభవించవలసినది ప్రారబ్ధం. అది అనుభవించడం వల్ల పోతుంది తప్ప మార్చలేవు.   వీటిని తొలగించలేనప్పుడు పూజలు పునస్కారాలు చేసి ప్రయోజనం ఏమిటి?  ప్రారబ్ధం అనుభవించక తప్పదు అనేది సాధారణ నియమం మాత్రమే. తగిన సాధన చేసి వీటిని కూడా మార్చవచ్చు.  విద్యుత్ తీగ మీద చెయ్యి వేస్తే షాక్ కొడుతుంది. ఇది సామాన్య సూత్రం. కానీ చేతికి రబ్బరు తొడుగు కట్టుకొని పట్టుకుంటే షాక్ కొట్టదు.  అలాగే సాధన అనే కవచాన్ని పెట్టుకుంటే ప్రారబ్ధం కూడా తొలగించుకోవచ్చు.  ‘ శుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిమ్’ –  భగవంతుని ధ్యానించినట్లయితే అశుభములు తొలగిపోయి శుభ పరంపరలు కలుగుతాయి.  అశుభం - ప్రారబ్ధ వశాత్తు పూర్వ కర్మలననుసరించి వచ్చే దుఃఖములు, తప్పుడు పనులు చేయడానికి ప్రేరణలు.  ప్

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి  చెట్లు కాసే తీయని పళ్లలా, నదులు మోసుకొచ్చే చల్ల ని నీళ్లలా, సజ్జనుల సంపదలన్నీ పరోపకారం కోసమే. జనావాసాలకు దూరంగా కొండల్లో, కోనల్లో, ఆశ్రమా లలో నిరాడంబరంగా జీవిస్తూ తపస్సు చేసుకొనే మహర్షుల తపోబలం కూడా లోకోపకారం కోసమే.  అగస్త్యుడు ఒక గొప్ప మహర్షి. ఈయన ఇప్పటికి కూడా జీవించి ఉన్నాడనే నమ్ముతారు. మిత్రావరుణులనే దేవతలు సముద్రపుగట్టున విహరించుచుండగా అక్కడనే ఉన్న ఊర్వశిని చూచి కామింప, వారికి వీర్యములు స్ఖలితములై ఘటమున (కుండలో) ఉంచబడగా అందునుండి అగస్త్య, వశిష్టులు ఆవిర్భవిస్తారు. అగస్త్యుని ఆశ్రమము వింధ్యపర్వతసమీపమున కలదు. వింధ్యుని గర్వ మణచుట  మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా పెరిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సరిగాలేక మహర్షులకు వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునికి తమ సమస్యను విన్నవించి, సమస్యతీరుటకు మార్గం చూపమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చి. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అ

*శ్రీ వర్ణమాలా స్తోత్రమ్*

*శ్రీ వర్ణమాలా స్తోత్రమ్*  🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీనమః 🕉🌞🌏🌙🌟🚩 అధ్బుత విగ్రహ అమరాదీశ్వర అగణిత గుణ గణ అమృత శివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ ఋప మనాది ప్రపంచ విలక్షణ తాప నివారణ తత్త్వ శివ లింగ స్వరూప సర్వ బుధ ప్రియ మంగళ మూర్తి మహేశ శివ!!     లూతాదీశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఎకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ ఐశ్వర్యా శ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకారాది మహేశ శివ ఔర సలాలిత అంత కనాశన గౌరీ సమేత మహేశ శివ అంబర వాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ఆహార ప్రియ ఆది గిరీశ్వర భోగాది ప్రియ పూర్ణ శివ కమలాస్యార్చిత కైలాస ప్రియ కరుణా సాగర కాంతి శివ గంగా గిరి సుత వల్లభ గుణ హిత శంకర సర్వ జనేశ శివ ఖడ్గ శైల మృదుడ క్కాద్యా యుధ విక్రమ రూప విశ్వేశ శివ!!     ఘాతుక బం

_ప్రత్యంగిరామాత

*_ప్రత్యంగిరామాత కధ_* ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . ప్రత్యంగిరామాత పుట్టినవైనము ;-కృతయుగములో హిరణ్యకశ్యుపుని సం హరించటానికి శ్రీహరి నరసిం హా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించి అసురసంద్యవేళ గడప పై తన పదునైన గోళ్ళతో కడుపు చీల్చి సం హరించాడు రాక్షసాధమున్ని అయినా నరసిం హ మూర్తి కోపం చల్లారలేదు నరసిం హుని క్రోధానికి సర్వ జగత్తు నాశనమౌతుందని భయపడ్డ దేవతలు నరసిం హుని కోపాన్ని చల్లార్చటానికి పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అంతట పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసిం హుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసిం హుని కోపాన్ని చల్లార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ నరసిం హ మూర్తి మరింత కోపంత

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు.......!!

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు.......!! కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని