Posts

Showing posts from July, 2021

🦜 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'🦜

Image
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🦜 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'🦜 ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬           స్వయంగా రుక్మిణీ దేవి చేయించిన 'ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం'! శ్రీ కృష్ణుని ఆలయాలలో, నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ లోని మథుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక, దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి. ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీ కృష్ణ క్షేత్రం, కర్ణాటకలోని ఉడుపితో ముడిపడి ఉంది. ఒక రోజు శ్రీ మధ్వాచార్యుల వారు, వేకువజామునే, సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి, ప్రాత: సంధ్యాదికాలు ముగించుకుని, ఆ తీరంలోనే కూర్చుని, ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో, ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో, అనేక మంది ప్రజలు కూడా వచ్చి, సముద్రస్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాత: కాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించడానికి అనువైన సమయం. అలాంటి నేపద్యంలో, శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా, ద్వాదశ స్తోత్రంలోని అయిదు అధ్యాయాల రచన పూర్తి చేశారు. ఆరవ అధ్యాయం ప్రారంభం క

❇️ శ్వాస - పంచప్రాణాలు:-

Image
❇️ శ్వాస - పంచప్రాణాలు:- శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి-- 1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది. 1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు. 2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలు బయటకు నెట్టబడుతున్నాయి. 3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును. 4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును. 5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును. ❇️ శ్వాస - చక్రాలు:- ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గ

☀️51 Shakthi Peetas and Remedial Measures

Image
☀️51 Shakthi Peetas and Remedial Measures🕉️ “Ya Devi sarvabhutesu buddhi rupena samsthithaa Namastasyai namastasyai namastasyai namo namaha” To that Goddess who dwells within all beings in the form of intellect, I bow again and again Devi Mahatmaya-CH.5 V.20 Daksha one of the four sons of Brahma and Aditi with his wife Prasuti bored 24 Shakti’s and the 24th Shakthi married Rudra. Soon after they marriage Daksha organised a massive Yagna inviting all his 23 son in laws, the Gods, Rishis and other divine beings everyone got up to greet Daksha but Rudra did not get up , the seeds of conflict was sown. Soon Brahma declared Daksha as the main Prajapati, inflated Daksha decided to perform the Brihaspati Sava sacrifice the biggest Yagna of all with all pomp and glory.  All the Gods rishis and demigods were invited but Sati and Shiva were uninvited. Against her husbands wishes Sati insisted on going to the Yagna, she reached the ceremony she found out she was deliberately humilia

శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది?

శ్రీ మహాభారతం ఏ పర్వంలో ఏముంది? మహాభారతంలో ఉన్నదంతా లోకంలో ఉన్నది. మహాభారతంలో లేనిదేదీ ఈ లోకంలో లేదు అని లోకోక్తి.. మహాభారతంలో పద్దెనిమిది పర్వాలున్నాయని మాత్రమే తెలుసు.. కాని, ఆ పర్వాలేమిటో, ఏ పర్వంలో ఏముంటుందో తెలిసిన వారు తక్కువనే చెప్పవచ్చు. అటువంటి వారికి అవగాహన కోసం... 1. ఆది_పర్వం: రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు, ఆయన కుమార్తె దేవయాని, చంద్రవంశ మహారాజు యయాతిల చరిత్రతో పాటు శకుంతల, దుష్యంతులకు సంబంధించిన అనేక పురాతన కథలను ఇది వివరిస్తుంది. ఈ పర్వంలో అధిక భాగం కురువంశ మూల పురుషులైన శంతనుడు, భీష్ముడు, విచిత్ర వీర్యుడు, ధృతరాష్ట్రుడు తదితరుల పరిచయం ఉంటుంది. పాండురాజు కథ, పాండవ కౌరవుల జననం, విద్యాభ్యాసం, వారి మధ్య బాల్యం నుంచే పొడసూపే స్పర్థలు, పాంచాల రాకుమారి ద్రౌపదితో పాండవుల వివాహం, అర్జునుడి తీర్థయాత్ర, శ్రీకృష్ణుని చెల్లెలైన సుభద్రతో పరిణయం తదితర విషయాలను కూడా ఆది_పర్వం వివరిస్తుంది. 2. సభా_పర్వం: పాండవ ప్రథముడైన యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయ యాగం చేయడం, కౌరవ ప్రథముడైన దుర్యోధనుడు శకుని సాయంతో జూదం గెలవటం, పర్యవసానంగా తలెత్తిన పరిణామాలు ప్రధానాంశాలు. 3. అరణ్య_పర్వం: దీనినే వన

వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం

వేదాల్లో చెప్పబడిన...గణపతి తాళం ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనల(negative vibrations)ను తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం. వికటోథ్కట సుందర తంధి ముఖం |  భుజ కేంద్రసుసర్ప గాధాభరణం || గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ |  ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం || సుర సుర గణపతి సుంధర కేశం |  ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం || భవ భవ గణపతి పద్మ శరీరం |  జయ జయ గణపతి దివ్య నమస్తే || గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |  గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం || కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం || ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇధం, తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం | లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం || నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం || ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ

అఘోరీ బాబాతో భట్టా చార్య సంభాషణ..

అఘోరీ బాబాతో భట్టా చార్య సంభాషణ.. స్థలం : స్మశాన వాటిక, గోకర్ణం నేను: మీ పేరేమిటి? మీ గురువుగారెవరు? అఘోరీ బాబా: నా పేరు కపాలీ రాంబాబా, నేను కాపాలికుల తెగకి చెందిన అఘోరీని. సాధారణంగా మేము తిని, తాగే ఏ పదార్ధమైనా కపాలంలో వేసి (మానవ పుర్రె) పుచ్చుకుంటాము. నాకు ముగ్గురు గురువులున్నారు. మొదటి గురువు ఆదినాథుడు.... ఈయననే మీరు దత్తాత్రేయుడు అంటారు, మేము మాత్రం ‘ఆదినాథుడు’ అనే అంటాము. రెండవ గురువు వైష్ణవ మతస్థుడైన ‘బాబా కినారాం’. బాబా కినారాం నాకే కాదు భూమి మీద ఉండే అందరు అఘోరీలకు గురువు. సాధారణంగా అఘోరీల గురువులు శైవులని అనుకుంటారు అది తప్పు అవగాహన.... అఘోరీల గురించి మీరు చెప్పుకునేదీ, ఊహించేవి కుడా చాలామటుకు తప్పే. నిజాలు తక్కువ..కల్పితాలు ఎక్కువ. అఘోరీలు చూడడానికి భయంకరంగా ఉంటారు, కొన్ని అలవాట్లు ఆటవికంగా ఉంటాయి తప్ప, మా పద్దతులను మా నీతిని మేమెప్పుడూ తప్పనివారము. మూడవ గురువు ‘బాబా గంగారాం’. వారు ప్రస్తుతం ‘కామాఖ్య’ లో ఉన్నారు. కామాఖ్య ఆలయంలో అమ్మవారి విగ్రహానికి బదులు కొండరాళ్ళతో ఏర్పడిన అమ్మవారి యోని ఉంటుంది. ఈ యోని నుండి ప్రతి 27 రోజులకొకసారి రుతురక్తం (Menstrual Fluids)వస్తుంది...  ఇలా

ద్వాదశభావములకు కారకులు

       ద్వాదశభావములకు కారకులు ద్యుమణి రమరమంత్రీ భూసుతః సోమసౌమ్యౌ*   గురురినతనయారౌ భార్గవో భానుపుత్రః |  దినకర రిపిజే జ్యౌ జీవభానుజ్ఞ మందాః   సురగురురినసూనుః కారకాః స్యుర్విలగ్నాత్ ||  లగ్నమునుంచి ద్వాదశభావములకూ కారకులు.  లగ్నము రవి,  ద్వితీయము గురుడు,  తృతీయము కుజుడు,  చతుర్ధము బుధ చంద్రులు,  పంచమము గురుడు,  షష్టము శని కుజులు,  సప్తమము శుక్రుడు,  అష్టమము శని,  నవమము రవి గురులు,  దశమము గురు రవులు, బుధ శనులు,  యేకాదశము గురుడు,  ద్వాదశము శని    క్రమముగా కారకులు అగుదురు  అనగా  రవి. 1, 9, 10 చంద్రుడు. 4, కుజుడు. 3, 6 బుధుడు. 4, 10 గురువు. 2, 5, 9, 10,11 శుక్రుడు. 7 శని. 6, 8, 10, 12 18 portfolios 7 planets పాపులకు 9, శుభులకు 9.  If moon, mercury is శుభ గ్రహములు అయితే ఇలా Else 12, 6 portfolios

గురు కారకత్వాలు

ఓం శ్రీమాత్రేనమః శ్రీ గురుభ్యోనమః విద్యా దదాతి వినయం  వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తతః సుఖమ్ దీనిలో గురు కారకత్వాలున్నాయి. విద్య,పాత్రత, ధనము... మొదట ధనమంటే ఏమిటి? "ధినోతి ప్రీణయతీతి ధనం" అని అమరకోశంలో సంతోషపెట్టునది అని చెప్పబడింది. అంటే కొందరికి జ్ఞానం సంపాదించటంలో సంతోషం, వారికి జ్ఞానమే ధనం. కొందరికి డబ్బు సంపాదించడంలో ఆనందం. వారికి డబ్బే ధనం..... ఇలా ధనం వేర్వేరు రూపాల్లో సంతోషపెడుతుంది. కనుక ధన కారకత్వం అంటే కేవలం డబ్బే కాదు విద్యా, జ్ఞాన, మాన, ప్రాణ, కుటుంబాది అనేక విషయాలు ఆయా సందర్భాల్లో ధనంగానే భావించబడతాయి.  వీటిలో జ్ఞానం అన్నింటికీ ఆధారమైనది. ఆ జ్ఞానాన్నిచ్చేది గురువే. కనుకనే గురుస్థానంలో ఉన్న బృహస్పతిని ధనకారకుడన్నారు. జ్యోతిష్కుడికి షట్ శాస్త్రజ్ఞానమవసరమని శాస్త్రవచనంలోని ఉద్దేశ్యం. ఒక శాస్త్రంలో కలిగే సందేహాలకు అక్కడ సమాధానం కష్టమైతే మరోచోట సమాధానముంటుందని ... అందువల్ల నే పూర్వం జ్యోతిష్కులు తర్కం, వ్యాకరణం, వైద్యం, పురాణం..... వంటి అనేక విషయాలపై పట్టు సాధించేవారు.  ....... 

దగ్దయోగం అంటే ఏమిటి?

దగ్దయోగం అంటే ఏమిటి? 🔸🔸🔸🔸🔸 దగ్ధయోగాలు :- తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. మాయా బజార్ సినిమాలో శంఖు తీర్ధులవారు లెక్క కట్టి "ఇది దగ్ధ యోగం" వివాహం కాదు అని శాస్త్రం చెబుతోంది అంటారు. పదమూడు అంటే 1+3 =4 నాలుగు సంఖ్య జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువుకు సంకేతం. శనివత్ రాహువు అన్నారు. రాహువు ఛాయా గ్రహం అయిననూ శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. రాహువు కారకరత్వంలో చెడును చేసే ఫలితాలు గమనిస్తే పైకి ధైర్యం, లోపల పిరికి, భ్రష్టత్వం, ఉద్రేకం, ఉద్వేగం, ఇతరులకు బాధ కలిగించునట్లు చేయుట, మానసిక వ్యధ, వ్యాధులు, పనులలో అంతారాయాలు మొదలగునవి కలిగిస్తాడు.     ఆ దగ్ధ యోగాలు కలిగించే సందర్భాలు, ఈ క్రింద ఇవ్వబడ్డాయి గమనించండి👇👇 1.  షష్టీ      6 +7  శనివారం 2.  సప్తమీ  7 + 6  శుక్రవారం 3.  అష్టమీ  8 +5  గురువారం 4.  నవమి  9 + 4 బుధవారం 5.  దశమీ  10 +3 మంగళవారం 6.  ఏకాదశి 11+2  సోమవారం 7.  ద్వాదశి 12+1  ఆదివారం                 పైన తెలిపిన రోజులలో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తు

కార్తవీర్యార్జున స్తోత్రం

Image
కార్తవీర్యార్జున స్తోత్రం  పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి కార్తవీర్యార్జున స్తోత్రం  తప్పిపోయిన, అపహరణకు గురైన పిల్లలు దొరకడానికి, పోగొట్టుకొనబడిన వస్తువు తిరిగి పొందడానికి, ఇంటినుండి వెడలిపోయిన అప్తులు తిరిగి రావడానికి... వారి రక్త సంబంధీకులు సంకల్పం చెప్పుకుని ఈ మంత్రం పఠిస్తే తాము పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారు... పారాయణం చేయువారు ఒక ఎర్రని కొత్త వస్త్రమును దర్భాసనముపై పరచి దానిపై కూర్చుని, మొదట గణపతిని ప్రార్థించి, ఆ తదుపరి కుడి చేయి గుప్పెట్లో కందులు తీసుకుని చేతపట్టుకుని (ఏరోజు కారోజు) పారాయణం చేసి, తర్వాత చేతిలో నున్న కందులు ఒక డబ్బాలో పోసి, జాగ్రత్త చేసి, తర్వాత వచ్చే మంగళవారం రోజున గోవులకు ఆహారంగా ఇచ్చుట లేక నానబెట్టిన కందులు దానం ఇచ్చుట చేసిన అతి శీఘ్ర ఫలితములు అందగలవు.. ఓం  కార్తవీర్యా ఖలద్వేషి  కృత వీర్యా సుతోబలీ సహస్రబాహు శతృఘ్నో  రక్తవాసాధనుర్థరః రక్తగంధో రక్తమాల్యో  రాజాస్మర్తురభీష్టదః ద్వాదశైతాని నామాని కార్తవీర్యాశ్య యః పఠేత్ సంపదస్తస్య జాయంతే  జనాః సర్వేవశం గతా రాజానో దాసతం మాన్తి  రిపక్షో వశ్యతాంగతీః ఆనయత్యాషు దూరస్థం  క్షేమలాభయుతం ప్రియామ్ స

జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము 2

జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానము 2 మస్తకముఖో రో హృదుదరకటివస్తి లింగోరుజానుజంఘాంఘ్రి మేషాదితః కాలాంగమ్!!  మేషాదిగా కాలపురుషాంగములు క్రమముగా శిరస్సు, ముఖము, భుజములు, పక్షము, హృదయము, ఉదరము, కటి, వస్తి, లింగము, తొడలు, మోకాళ్లు, పిక్కలు,  పాదములగుచున్నవి. శీర్షాననౌ తథా బాహూ హృత్కోడకటివస్తయః! గుహ్యోరుయుగలే జానుయుగ్మే వై జంఘకే తథా!!  కాలపురుషునకు మేషాదిగా శిరస్సు, ముఖము, భుజములు, హృదయము, క్రోడము, కటి ప్రదేశము, వస్తి, మర్మాంగము, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదములగుచున్నవి

జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానము

ప్రారంభదశలో ఉన్న విద్యార్థికి సులభ పద్ధతిలో వ్రాసిన శ్లోకం ఇది. శీర్షముఖ బాహు హృదయో  దరాణికటివస్తిగుహ్య సంజ్ఞాని,  ఊరూ, జానూజంఘే,  చరణాది రాశయోZజాద్యాః   టీక : అజ + ఆద్యాః : మేషము మొదలుకొని  రాశయః : రాశులు,  శీర్ష : తల, ముఖ : ముఖము,  బాహు : బాహువులు,  హృదయ : హృదయము,  ఉదరాణి : ఉదరము,  కటి : మొల,  వస్తి : పొత్తికడుపు, గుహ్య : రహస్యావయవములు,  ఊరూ : తొడలు, జానూ : మోకాళ్ళు, జంఘే : పిక్కలు, చరణీ : పాదములు, ఇతి : అని  సంజ్ఞాని : గుర్తులు. తా || మేషము మొదలు 12 రాశులును వరుసగా 12 అవయవములకు చిహ్నములు, ఇందు శిరస్సు మొదలు గుహ్యము వఱకు గల 8 రాశులును అనగా, మేషము మొదలు వృశ్చికము వఱకు వేరుగను, మిగిలిన రాశులు వేరుగను చెప్పబడినవి. దానికి కారణమేమనగా మొదటి విభాగమయిన ఎనిమిది భావములును ప్రస్తుత జన్మకు సంబంధించినవి. మిగిలిన నాలుగును పూర్వ జన్మలతో సంబంధించినవి. అనగా భౌతికములకన్న వేరయిన రాశులును భావములును.

💐💐💐యక్ష ప్రశ్నలు💐💐💐ధర్మరాజును

Image
💐💐💐యక్ష ప్రశ్నలు💐💐💐ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)13. భూమికంటె భారమైనది ఏది? (జనని)14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతు

🌹 జడ భరతుడు🌹

🌹 జడ భరతుడు🌹 జడ భరతుని కథ ఈ కథ చాల మందికి తెలీదు.  అగ్నీధ్రుడు జంబూ ద్వీపాన్ని పరిపాలించాడు. వూర్వాభిత్త అనే అప్సరస వలన అతనికి తొమ్మండుగురు పుత్రులు కలిగారు. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రంయకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనువారు.  జంబూ ద్వీప వర్షాలను (సంవత్సరాలు) ఈ తొమ్మిది మందికీ పంచి యిచ్చాడు. తండ్రి అగ్నీధ్రుడు. తమ తామ పేర్లతో వున్న వర్షాలను పరిపాలిస్తూ వచ్చారు. పెద్దవాడయిన నాభి భార్య మేరుదేవి. వారిరువరికీ విష్ణువు కుమారుడుగా జన్మించాడు. అతని పేరు ఋషభుడు. అతను తన అద్భుత శక్తి చేత ఇంద్రుడి అణచివేశాడు. తన రాజ్యానికి అజనాబం అని పేరు పెట్టాడు. అతని భార్య జయంతి. వారికి నూర్గురు పుత్రులు కలిగారు. వారందరూ గుణగణాలలో తండ్రికి సాటి అయినవారు. వారిలో పెద్దవాడు భరతుడు. అతను ప్రసిద్ధుడై గొప్ప కీర్తి గడించాడు. భరతుడు పరామ భాగవతోత్తముడు. విశ్వరూపుని కుమార్తె అయిన పంచజని ని పెళ్ళాడాడు. అన్ని విధాల తనతో సమానులైన 5 గురు పుత్రులను కన్నాడు. భరతుడు తన తండ్రి తాతల వలెనె ప్రజానురంజంకంగా పదివేల సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. ఎన్నో  యజ్ఞాలూ, యాగాలూ, సత్కర్

♦️ హద్దులెరిగి ప్రవర్తించాలి 🛑

          ♦️ హద్దులెరిగి ప్రవర్తించాలి 🛑 ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు. 'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు. అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 'ఆ నీళ్లు

🌎🏵️ 😄 సంతోషం 😀😂

🌎🏵️ 😄 సంతోషం 😀😂   👌మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు.  సంతోషం కోసమే అన్నం తింటాడు.  సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలనుకొంటాడు. చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే!  ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడంలేదు. ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి.  కానీ .... డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు. అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు. అందంగా ఉంటే సంతోషం ఉంటుందా? దానికీ రుజువ

❤️ లక్ష్యసాధనే ముఖ్యం ❤️

      ❤️    లక్ష్యసాధనే ముఖ్యం ❤️ ❤️ అవమానమనేది మోయలేని భారం. 💕మనసును దహించి వేస్తుంది. 💕 అన్నపానీయాలను ముట్టనీయదు.  💕 నిత్యాగ్ని గుండంగా జ్వలిస్తుంది మనసు.  ❤️ ఆ మహోష్ణతానికి తాను మాడిపోవడమో, ఎదుటివారు మసికావడమో జరుగుతుంటుంది. సహన గుణం పూర్తిగా క్షీణించి కోపతాపాలకు, ప్రతీకార వాంఛలకు గురవుతుంది మనసు. జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఎవరైనా సన్మానాలను, పొగడ్తలను మరచిపోతారేమోగానీ - అవమానాలను మరచిపోలేరు. ఇది మానవ సహజ గుణం. వీటిని అధిగమిస్తేనే ప్రగతి!  ❤️ రారాజు మయసభలో పొందిన అవమానం కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది. 💕 పసిబిడ్డ పోషణార్థం మిత్రుడైన ద్రుపదరాజును గోవులు అడిగాడు ద్రోణాచార్యుడు. అవమానించాడు ద్రుపదుడు.  తలొంచుకున్నాడు ద్రోణుడు. పొందిన అవమానభారం ద్రోణుడి హృదయాన్ని కల్లోలపరచింది. అర్జునుని ధనుర్విద్యా విశారదుడిగా చేసి మహాస్త్రంగా ప్రయోగించాడు. పాండవ మధ్యముడు ద్రుపదుణ్ని ఓడించి, రథానికి కట్టివేసి గురువు పాదాల ముందుంచాడు. అప్పటికి కాని శాంతించలేదు ద్రోణుడి హృదయం. ❤️అవమాన భారంతో రగిలిపోయిన చాణక్యుడు నంద వంశాన్ని నిర్మూలించాడు. ❤️ పురాణాల్లో, చరిత్రల్లో కోకొల్లలుగా దర్శనమిస్తా

మానవ బలహీనత.

🔶   మానవ బలహీనత. 🦜 చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత.  కానీ .....  నేను ఒక్కడినే కదా ఉన్నాను,  నన్ను ఎవరూ గమనించడం లేదు’  అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.  మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి. అవి  నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి.  వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు. ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.  ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,  వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు.  ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి.  అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి.  ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.  అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని

మొట్టికాయలు_అత్యంత_ప్రియం..

#మొట్టికాయలు_అత్యంత_ప్రియం.. ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్తితుల్లో, ఎవరికీ కనపడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి వుండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేక పోవడంతో అనావృష్టి ఏర్పడింది.  చెట్లన్నీ ఎండి పోతున్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చెయ్యలేక పోతన్నానే అని బాధపడుతున్నాడు. ఇలా చెట్లన్నీ ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలయిన జీవులన్నీ ఏమై పోవాలి ? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న వారిద్దర్నీ చూసి... “దేవేంద్రా! ఎందుకలా విచారంగా కనిపిస్తున్నారు ?” అనడిగాడు.  “నారద మహర్షీ..! మీకు తెలియనిది ఏముంటుంది ? అనావృష్టి కారణంగా నీళ్ళు లేక చెట్లన్నీ ఎండిపోతున్నాయి. నేనుండి కూడా ఏమీ చెయ్యలేక పోతున్నాను” అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు. “మహేంద్రా విచారించకు.. కష్టాలు కలకాలం ఉండవు కదా ! మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంత కాలం ఓపిక పట్టు !” అని ఓదార్చాడు నారదుడు. “మహర్షీ! నేను నా గురించి బాధ పడడం లేదు. నేనిక్కడ ఉండి కూడ నాకు ఆశ్రయమిచ్చిన ఈ ఆడవికి ఏమీ చెయ

నాటి పాతాళ లోకమే నేటి అమెరికా!

➖➖➖➖➖➖➖➖        నాటి పాతాళ లోకమే నేటి అమెరికా! ➖➖➖➖➖➖➖➖ పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు. 👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు  👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glacier)

గ్రహ స్థితులు - చర్మ వ్యాధులు

లగ్నేష్ భూపుత్ర్ షషాంక్ పుత్రౌ సహాస్తితా సౌఖ్య గ్రుహే వ్యయేవా అపాన రోగంత్వభవా పత్ర్కీం స్వేతంత్ కృష్ణం మునయో వదంతి.  లగ్నాధిపతి కుజుడు మరియు బుధుడు కలిసి 4, లేదా 12 లో ఉంటే పాండు రోగం లేదా కుష్టు రోగం వస్తుంది.   శశాంక్ తత్పుత్ర విలగ్న నాతా సరాహుణార్కే నయుక్తాస్యదంషే ష్యామంత్ క్రిష్ణం కుజ సంయుతేషు ధైర్యం భవేత్ మందసమన్వితేషు రక్తం తథా సూర్య సమన్వితేన గృహోత్తదేషే నియమంత రాహుః. చంద్రుడు, బుధుడు మరియు లగ్నాధిపతి కలిసి రాహు, రవి కలిసి ఉంటే నల్ల కుష్టు, అలాగే రవి నవాంశలో ఉన్నా అదే రోగం వస్తుంది. ఈ గ్రహాలతో కుజుడు కలిసి ఉంటే అదే రోగం నల్ల కుష్టు వస్తుంది. అదే శని కలిసి ఉంటే నీల కుష్టు వస్తుంది. మందార చంద్ర మేషేవా వృషే శివత్రీ. శని, చంద్రుడు మరియు కుజుడు కలిసి  మేషంలో కాని వృషభంలో గానీ ఉంటే లుకోడర్మా వస్తుంది. ఇలా చాలా కాంబినేషన్స్ స్కిన్ డిసేజెస్ కు ఉన్నాయి

పూజ..ఎవరు చేయాలి..!

పూజ..ఎవరు చేయాలి..! 1. యజమాని ఉత్తరీయం..గోచీపోసి పంచె..కట్టుకోవాలి. సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది.  కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజ చేయాలి.  2. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు.  అంటే దాని అర్థం ఇంట్లో పూజ..ఇంటి యజమాని చేయాలి. 3. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..?  అందువలన పురుషుడు ఒళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.  4. అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని,  వ్రతమప్పుడు గాని, పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి. ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా.. ఆడపిల్ల అయితే లంగా వోణీ, వివాహిత అయితే చీర కట్టుకోవాలి.  అమ్మవారికి అవే కదా ప్రధానం. 5. మరి పురుషుల విషయనికి వస్తే,  పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది. "వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః  అంటే గోచీ పెట్టుకోలేదు,  అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని.  గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అ