Posts

Showing posts from November, 2022

కేదార్‌నాథ్ ఆలయం రహాస్యం.

కేదార్‌నాథ్ ఆలయం అనేది అంతుచిక్కని రహాస్యం. కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దాని గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి.   పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు కూడా కానీ మనము దానిలోకి వెళ్లాలనుకోవడం లేదు. కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది.  అంటే ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉంది. కేదార్‌నాథ్ ఉన్న భూమి అప్పుడే కాదు ఇప్పటికీ 21వ శతాబ్దంలో కూడా చాలా ప్రతికూలమైనది.  ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ, మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ మరియు మూడో వైపు *22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్* ఉన్నాయి. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి మరియు స్వరందరి. వీటిలో కొన్ని మన పురాణాలలో వ్రాయబడ్డాయి.  ఈ ప్రాంతం " మందాకినీ నది" యొక్క ప్రారంభ ప్రాంతం.  చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు, వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం, ఇలాంటి ప్రదేశంలో ఇంతటి కళాఖండాన్ని రూపొందించడం ఎంతో ప్రయాసతో కూడిన అద్భుతమైన విషయం. నేటికీ,  "కేదార్‌నాథ్ ఆలయం"  ఉన్న ప్రదేశానికి మీరు వాహనాలతో వెళ్ల

కుమారసంభవం

శివ పురాణంలో చెప్పబడిన శ్రీ సుబ్రహ్మణ్యుని జన్మ వృత్తాంతం స్కందోత్పత్తి కుమారసంభవం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గర

సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐

💐💐సూతకం {మైల} ఎప్పుడు ఎలా..?💐💐 మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు.  సూతకం రెండు రకాలు.. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు.   కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును.  మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. ద్వెజీతరాలకు ఈ విషయాలలో క

గోపికా వస్త్రాపహరణం :

భాగవతం 115వ భాగం గోపికా వస్త్రాపహరణం : భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత చేసిన లీలలు అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము పరమ ప్రామాణికమయినది. ఆ ఘట్టములో మనం తెలుసుకోవలసిన గొప్ప రహస్యం ఒకటి ఉన్నది. అది తెలుసుకుంటే మనం ప్రతినిత్యము చేసే కర్మ అనగా పూజాదికములలో పొరపాట్లనుండి ఎలా గట్టెక్కగలమో ఒక అద్భుతమయిన మార్గమును చూపించగలిగిన లీల. బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని నిర్ణయం చేసుకున్నారు. అది ఒక విచిత్రమయిన విషయం. ఒక చిన్న ఊరిలో ఒక యోగ్యుడయిన వరుడు ఒక యింట్లో ఉన్నాడనుకొండి ఆ ఊళ్ళో ఉన్న కన్యలందరూ ఎక్కడయినా అతనిని భర్తగా పొందాలని సామూహిక పూజ చేస్తారా? చేయరు.  కానీ ఇక్కడ గోపకాంతలు అటువంటి పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన.  వారు మార్గశీర్ష మాసములో ఒక వ్రతము చేశారు. యథార్థమునకు భాగవతంలో గోపకాంతలు మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి కాత్యాయనీ దేవిని ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి ఆయనను ఉద్ధరించింది కాబట్టి పార్వతీ

కాళియ మర్దనము:

భాగవతం 113వ భాగం కాళియ మర్దనము: ఒకనాడు కృష్ణభగవానుడు గోపబాలురతో ఒక సరస్సు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నాడు. ఆ నాడు బలరాముడు కృష్ణుడితో రాలేదు. దానిని కాళింది మడుగు అంటారు. అది యమునానదిలో అంతర్భాగం. ఈ పిల్లలందరికీ దాహం వేసింది. అపుడు వారు కాళిందిలో వున్న నీరు త్రాగారు. వెంటనే వారందరూ మరణించారు. ఆవులు, దూడలు, ఎద్దులు అన్నీ మరణించాయి. వెంటనే పరమాత్మ కరుణా దృష్టితో చూశాడు. అపుడు ఈ పిల్లలందరూ నిద్రపోయిన వాళ్ళు లేచినట్లుగా లేచారు. ఆ నీళ్ళలోంచి ఎప్పుడూ బుడగలు వస్తుంటాయి. ఆ నీళ్లు ఉడికిపోతున్నట్లుగా ఉంటాయి. ఆ నీటినుంచి పైకి లేచిన గాలి పీల్చినంత మాత్రం చేత పైన ఎగురుతున్న పక్షులు మరణించి ఆ చెరువులో పడిపోతూ ఉంటాయి. ‘ఈ నీళ్ళు ఎందుకు యిలా వున్నాయి?’ అని వాళ్ళని అడిగాడు. డానికి కారణం – ఎప్పటినుంచో ఆ మడుగులో కాళియుడు అనబడే నూరు తలలు కలిగిన పెద్ద నల్లత్రాచు ఒకటి ఆ మడుగులో పడుకుని ఉంటుంది. దానికి అనేక భార్యలు. ఎందఱో బిడ్డలు. అది ప్రాణులను పట్టుకుని హింసించి తింటూ ఉంటుంది. తన విషమునంతటినీ ఆ నీటిలోకి వదులుతూ ఉంటుంది. అందువలన ఆ నీరంతా విషపూరితం అయింది అని తెలుసుకున్నాడు. కృష్ణుడు ‘మీరు అందరూ మరణించడానికి యిది

పురాతన_భారతీయ_గణితం

# పురాతన_భారతీయ_గణితం భారతదేశంలో చాలా ప్రాచీన కాలంలోనే చాలా ఆధునిక గణిత ఆవిష్కరణలు జరిగాయి. ప్రారంభ కాలం నుండి అనగా (సా.శ.పూ1000 ఏండ్ల కి ముందు అనగా 3000ఏండ్ల క్రితం)10నుండి  వంద , పది ట్రిలియన్ల వరకు పది కి సంఖ్యలుగా పిలుస్తాయి మరియు అదనంగా, సంకలనం  వ్యవకలనం, గుణకారం,  భిన్నాలు,  చతురస్రాలు,  ఘనాల మరియు  మూలాలు వంటి అంకగణిత కార్యకలాపాల వాడకానికి ఆధారాలను అందిస్తాయి. 4 వ శతాబ్దం AD సంస్కృత వచనం ప్రకారం బుద్ధుడు 1053 వరకు సంఖ్యలను లెక్కించడాన్ని, అలాగే వీటిపై మరియు అంతకంటే ఎక్కువ ఆరు సంఖ్యల వ్యవస్థలను వివరిస్తూ 10421 కు సమానమైన సంఖ్యకు దారితీస్తుంది. మొత్తం విశ్వంలో 108 అణువుల అంచనా ప్రకారం, ఇది పురాతన ప్రపంచంలో అనంతానికి దగ్గరగా ఉంది. ఇది ఒక అణువు యొక్క పరిమాణాన్ని ప్రదర్శించడానికి, పరిమాణాన్ని తగ్గించే పునరావృత శ్రేణులను కూడా వివరిస్తుంది, ఇది కార్బన్ అణువు యొక్క వాస్తవ పరిమాణానికి (మీటరుకు సుమారు 70 ట్రిలియన్లు) దగ్గరగా వస్తుంది. సా.శ.పూర్వం 8 వ శతాబ్దం నాటికి, # పైథాగరస్ కు చాలా ముందు, “# శుల్బ_సూత్రాలు” (లేదా “సుల్వా సూత్రాలు”) అని పిలువబడే ఒక వచనం అనేక సరళమైన పైథాగరియన్ ట్రిపుల

లలితా నామాలతో కార్య సాధన.

లలితా నామాలతో కార్య సాధన. మంత్రతుల్యం అయిన శ్రీ లలితా సహస్రనామాలతో సామాన్య అవసరాలను సాధించే పద్ధతులు ఉన్నాయి. ఇవి అన్ని అనుభవంలో చేసి సరిచూసిన విధానాలు. ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చెప్పుకునే నామ వాక్యాలను ప్రతీ పర్యాయం పఠిస్తూ లలితా నామ స్తోత్రం లోని 365 పంక్తులు ప్రతీ రోజూ పారాయణ చేయాలి. నిస్సందేహంగా కార్య సిద్ది పొందగలరు. సాధన కాలం 40 రోజుల నుంచి 60 వరకూ చేయండి. సూచన :- ఇప్పుడు చెప్పబడే సాధన పద్దతులను అనుభవం ఉన్న పండితుల వద్ద గానీ, గురువు గారి వద్ద గానీ మెలకూవలు తెలుసుకుని సాధన చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం భావ్యం కాదు. ఇవి లలితా దేవి భక్తులకు, శ్రీవిద్య ఉపాసకులకు ఉపయోగపడుతుంది. ఇక్కడ తెలిపిన ప్రతీ పద్దతికి సమయం, కట్టుకోవాల్సిన వస్త్రం, చేయవలసిన దీపారాధన, జప సంఖ్య, కూర్చోవాల్సిన దిశ, సంపుటీకరణ వగైరా లాంటి విషయాలు గురువు వద్ద తెలుసుకొని చేయడం మరింత ఉత్తమంగా ఉంటుంది.  🌷 భర్తృవశీకరణ ( అనుకూలత) :-  లలితా నామం :-  మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా | అనే ఈ వాక్య నామాన్ని లలితా నామ స్తోత్రంలోని ప్రతి పంక్తికి అనుసంధానం చేసి పఠించాలి. అంటే  మంద

సాళ్వుడు - అనుసాళ్వుడు - సౌరంభవిమానము..................................

సాళ్వుడు - అనుసాళ్వుడు - సౌరంభవిమానము. .............................................................. (౧) తెలుగులో సంఖ్యామానము > ఏదో ఎందుకో వ్రాశాడని ముందుకు వెళ్లోద్దు, దయచేసి చదవండి. ఈ సంఖ్యలను అంకెలరూపంలో వ్రాయండి. మీ పిల్లలచేత వ్రాయించి అభ్యాసం (ప్రాక్టీస్) చేయించండి, తెలివి జ్ఞానం రెండూ పెరుగుతాయి. సున్న, ఏకము, దశము, సహస్రము, దశసహస్రము, లక్ష, దశలక్ష, కోటి, దశకోటి,  అర్భుదము, న్యర్భుదము, ఖర్వము, మహాఖర్వము,  పద్మము, మహాపద్మము, క్షోణి, మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోభము, మహాక్షోభము, నిధి, మహానిధి, పర్వతము, అత్యంతము, పదార్థము, అనంతము, సాగరము, అవ్యవము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి. మీలో ఎవరైనా పై సంఖ్యలను అంకెలరూపంలో వ్రాసి ఈ గ్రూపులో పెట్టగలరా ! (౨) బుుషబుడు - ఇంద్రునికి శచీదేవికి కలిగిన సంతానము. ఇతను ఇంద్రునికి రెండవ కొడుకు. మొదటి కొడుకు పేరు జయంతుడు. (౩) కల్క్యావతారము - కలిపురుషుడు - కలిఅవతారము - విష్ణుదేవుని అవతారాలలో చివరిది. కలియుగాంతములో విష్ణువు శంబళ గ్రామంలో జన్మించి, విద్యార్థిగా నిమేషకాలములో సర్వశాస్త్రాలను సర్వవేదాలను, సమస్తయుద్ధకళలను నేర్చి, సజ

వర్గ వివేచన అధ్యాయః

వర్గ వివేచన అధ్యాయః అథ షోడశ వర్గేషు వివృణోమి వివేచనం లగ్నే దేహస్య విజ్ఞానం హోరాయాం సంపదాధికమ్ ద్రేక్కాణే భ్రాతృజం సౌఖ్యం తుర్యాంశే భాగ్యచింతనమ్ పుత్రపౌత్రాదికానాం వై  చింతనం సప్తమాంశకే  నవమాంశే కళత్రాణాం దశమాంశే మహత్ ఫలం ద్వాదశాంశే తథా పిత్రోః చింతనం షోడశాంశకే సుఖ అసుఖస్య విజ్ఞానం వాహనానాం తథైవ చ ఉపాసనాయాః విజ్ఞానం సాధ్యం వింశతి భాగకే విద్యాయాః వేదబాహ్వాంశే భాంశే చైవ బలాబలం త్రింశాంశకే అరిష్టఫలం భవేత్ అంశే చైవ శుభాశుభమ్ అక్షవేద విభాగే చ షష్ట్యంశే  అఖిలమ్ ఈక్షయేత్ యత్ర కుత్రాపి సంప్రాప్తః క్రూరషష్ట్యంశక అధిపః తత్ర నాశః న సందేహః మునే విధివచః యథా యత్ర కుత్రాపి సంప్రాప్తః కలాంశ అధిపతిః శుభః తత్ర వృద్ధిశ్చ పుష్టిశ్చ  గర్గాదీనాం వచో యథా ఇతి షోడశవర్గాణాం  భేదాః తే ప్రతిపాదితాః  నమస్తే పఠ పఠ పఠ పఠ  సంభాషణ సంస్కృతమ్ పరాశర మహర్షి ప్రణీత బృహత్ పరాశర హోరా శాస్త్రమ్

ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు

ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ......!!  🌸 'ప్రమథ' అంటే బాగా మథించగలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించగలవారు.  వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవపడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తారు. రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .." అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు.  మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి. 🌸 అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు: 🌷వీరభద్రుడు: 🌷 దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగులేని పరాక్రమవంతుడు.  🌸సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడేవాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి. 🌷ఆది వృషభం: 🌷 ధర్మదేవత. శివున్ని మోయ గలిగే వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శి

జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం

🌻జాతక చక్రం ద్వారా దిక్కుల నిర్ణయం🌻 🔅🏵️🔅🏵️🔅🏵️🔅🏵️🔅 జాతకచక్రం ద్వారా జాతకుడికి ఏ దిక్కు కలసి వస్తుందో అష్టకవర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చు. అష్టక వర్గుని పరిశీలించి జాతకుడికి నివశించే ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోవచ్చు. వ్యాపారం చేసే షాపు ఏ దిక్కున కలసి వస్తుందో అష్టకవర్గుని పరిశీలించి తెలుసుకోవచ్చును. 1) అగ్నితత్వ రాశులైన మేషం, సింహ, ధనస్సు రాశులు (1,5,9 రాశులు) తూర్పు దిక్కును తెలియజేస్తాయి. 2) భూతత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశులు (2,6,10 రాశులు) దక్షిణ దిక్కును తెలియజేస్తాయి. 3) వాయుతత్వ రాశులైన మిధునం, తుల, కుంభ రాశులు (3,7,11 రాశులు) పడమర దిక్కును తెలియజేస్తాయి. 4) జలతత్వ రాశులైన కర్కాటకం వృశ్చికం, మీన రాశులు (4,8,12 రాశులు) ఉత్తర దిక్కును తెలియజేస్తాయి. అగ్ని, భూ, వాయు, జల తత్వ రాసుల యొక్క సర్వాష్టక వర్గుల యొక్క బిందువుల మొత్తాన్ని కలపగా ఏ తత్వ రాశులకు ఎక్కువ బిందువులు వస్తాయో ఆ దిక్కునకు లోబడి ఉంటే మంచి సంతృప్తి, అభివృద్ధి, జీవనోపాది, సంపాదన ఉంటుంది. పైన ఉన్న జాతక చక్రంలోని అష్టకవర్గు చక్రాన్ని పరిశీలిస్తే అగ్నితత్వ రాశులైన మేషరాశిలో 28 సింహరాశిలో 26 ధనస్సుర

పంచశక్తులు

పంచశక్తులు లక్ష్మీ దేవి పరా ప్రకృతి నుండి ఆవిర్భవించిన మహాలక్ష్మీ పంచశక్తులలో మూడవది. ఆమె నారాయణునికి పత్నియై ఆశ్రయించిన వారికి అఖండమైన సర్వసంపదలనూ అనుగ్రహిస్తుంది. ఈమెయే వైకంఠంలో మహాలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా విరాజాల్లుతోంది. ధనలక్ష్మి , ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, రూపలక్ష్మి వంటి అనేక నామాలతో ప్రకాశిస్తూ, విష్ణువక్షస్ధలంలో నిత్యనివాసిని అయింది. స్వర్గలక్ష్మిగా ఉన్న ఈ అంశయే దుర్వాసిని శాపవశాన స్వర్గానికి దూరమై, దేవేంద్రులాదుల ప్రార్ధనచేత, శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పబలం వల్ల 'క్షీరసాగర కన్యక' గా ఆవిర్భవించింది. తేజస్సునకు, మాంగల్యానికీ, కాంతికి శాంతి సుఖాలకు ప్రధాన దేవత ఈ లక్ష్మీదేవి. తనను ఆశ్రయించిన వారికి సంకల్ప మాత్రం చేతనే సర్వసంపదలనూ అనుగ్రహింపగల శక్తి ఆమెది. ఆ లక్ష్మీదేవి, వేదవాక్కులలో, భగవన్నామములో, గోపుచ్ఛములో, తులసీవృక్షంలో, ఏనుగు కుంభస్ధలంలో, శంఖంలో, ముత్యములో, స్త్రీల సీమంత ప్రదేశంలో, సత్య వాక్కులో, అగ్ని హోత్రములో సూక్ష్మరూపిణిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థానాలను ఆదరించి, గౌరవించి, పూజించిన వారికి లక్ష్మీద

నవగ్రహ పీడా పరిహార స్త్రోత్రం

నవగ్రహ పీడా పరిహార స్త్రోత్రం 🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః । విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥ రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః  సుధాశనః । విషమస్థాన సంభూతాం పీడాం హరతు  మే విధుః ॥ ౨॥ భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా । వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు  మే కుజః ॥ ౩॥  ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః । సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు  మే బుధః ॥ ౪॥ దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః । అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥*  దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ  మహామతిః । ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః| మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥ మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః । అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు  మే శిఖీ ॥ ౮॥*  అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః ।  ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు  మే తమః ॥ ౯॥ ॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥ 🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏 🚩

తిరుమల 7 కొండలు..పరమార్ధం🌻

🌻తిరుమల 7 కొండలు..పరమార్ధం🌻 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 1. నీలాద్రి2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. 1. వృషభాద్రి - అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములున్టాయ్. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) వాక్కు అంటే - శబ్దం శబ్దం అంటే - వేదం వేదం అంటే - ప్రమాణము నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజం గా దాని కన్నా అభద్దం ఉంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైట్ట లేదా. కాబ

నక్షత్ర , బుధ లోక వర్ణన*💫

*కాశీ ఖండం - 14* 🕉️⚜️🔱⚜️🔱✡️🔱⚜️🔱⚜️🕉️ 🌈 *నక్షత్ర , బుధ లోక వర్ణన*💫 💫 శివశర్మ - విష్ణుదూతలను నక్షత్ర లోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా, వారు వివరించారు.  💫 పూర్వం బొటన వ్రేలి వెనుక భాగం చేత, సృష్టి నంతా సృజించిన దక్షడు ప్రజాపతి అయాడు. ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారంతా మంచి రూపంతో లావణ్యంతో ఉన్నవారు. వారిలో రోహిణి మిక్కిలి సౌందర్యవతి. వారందరితో దక్షుడు కాశీ నగరంలో ఘోర తపస్సు చేశారు. సోమ శేఖరుని ఆరాధించారు. ఈశ్వరుడు సంతోషించి, ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. దక్షుని కూతుళ్ళు, ‘’నీ వంటి తాపహారి, రూప సంపన్నుడు, అయిన భర్తను ప్రసాదించు‘’ అని కోరారు. వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్థాపించి, వరుణా నది ఒడ్డున, సంగమేశ్వర స్వామి సన్నిధిలో, చాలా కాలం తపస్సు చేశారు. వారి స్థిర మనస్సుకు సంతసించి,  💫 ‘’అమ్మాయిలూ ! మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను. మీ కోరిక నేరవేరుతుంది. జ్యోతిశ్చక్రంలో మీరు అగ్రగణ్యులవుతారు.  మీ నుండి, మేషం మొదలైన రాశులు జన్మిస్తాయి. బ్రహ్మ చేత, ఒషధీషుడుగా చేయబడిన సోముడు మీకు భర్త అవుతాడు. మీరు పూజించిన ఈ నక్షత్రేశ్వర లింగాన్ని అర్చించినవారు, నక్షత్ర లోకం చేరతారు అ

ఉత్తరీయం-సద్ బ్రాహ్మణ లక్షణం

Image
ఉత్తరీయం-సద్ బ్రాహ్మణ లక్షణం పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టినవాడు దిగంబరుడే అవుతాడు. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే ఉండాలి పురుషుడికి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అని గుర్తు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. దేముడు అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. ‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గ

శరీరాంగములు - చంద్ర గ్రహము

Image
శ్రీ గురుభ్యోనమః శరీరాంగములు - చంద్ర గ్రహము చంద్ర గ్రహము: హృదయం, ఊపిరితిత్తులు, మనస్సు, రక్తము, ఎడమ కన్ను, మూత్ర పిండములు, అన్నవాహిక, శరీరమందలి ద్రవములు, ఆలోచనలు.  చంద్ర గ్రహము వల్ల ఏర్పడే అనారోగ్యములు: ఊపిరితిత్తులు, గుండె వ్యాధులు, ఎడమ కంటి యందు దోషములు, అతి నిద్ర, జడత్వము, ఆస్త్మా, విరోచనములు, రక్తహీనత, రక్తము విషతుల్యమగుట, జల సంబంధ వ్యాధులు, వాంతులు, ఉబ్బురోగము, అపెండిసైటిస్, వక్షములకు సంబంధించిన వ్యాధులు, పెరికార్డియం, నరములు, లింఫోటిక్ నాళములు, ప్రేగులకు సంబంధించినవి, కళ్ళు, ఆహారనాళము, ముంబ్రేన్ మరియు జననావయవ మూత్రకోశ వ్యాధులు, వృషణములు, వాతము, శూల నొప్పులు, క్షయ వ్యాధి, ట్యూమర్లు, దృష్టి దోషములు. రాశుల్లో చంద్ర గ్రహము వల్ల ఏర్పడే అనారోగ్యములు మేషం - వణుకు, మెదడులో స్రావములు ఊరుట వల్ల మెడ పక్కకు వంగుట, అతినిద్ర, కనులు బలహీనపడుట, మోకాళ్ళ నొప్పులు, జలుబు కారణంగా ఏర్పడే శిరో వ్యాధులు వృషభం - కాళ్ల పాదాలలో నొప్పులు, వాపులు, గొంతు బలహీనపడుట. మిధునం - కాళ్లు భుజములు హస్తములలో వాత ప్రభావం, ఒంటి నొప్పులు, అతిగా తినుట వలన ఏర్పడిన వెగటు. కర్కాటక - కడుపులో నొప్పులు, ఆహారం వెగట

మహామృత్యుఞ్జయ స్తోత్రం

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 మహామృత్యుఞ్జయ స్తోత్రం రుద్రం పశుపతిం స్థాణుం  నీలకణ్ఠముమాపతిమ్ |  నమామి శిరసా దేవం కిం నో మృత్యుః  కరిష్యతి ౧ నీలకణ్ఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః  కరిష్యతి ౨ నీలకణ్ఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః  కరిష్యతి ౩ వామదేవం మహాదేవం లోకనాథం  జగద్గురుమ్ |  నమామి శిరసా దేవం కింనో మృత్యుః  కరిష్యతి ౪ దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః  కరిష్యతి ౫ గఙ్గాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః  కరిష్యతి ౬ అనాధః పరమానన్దం కైవల్యపదగామిని | నమామి శిరసా దేవం కింనో మృత్యుః  కరిష్యతి ౭  స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థితివినాశకమ్ | నమామి శిరసా దేవం కింనో మృత్యుః  కరిష్యతి ౮ ఉత్పత్తిస్థితిసంహారం కర్తారమీశ్వరం గురుమ్ | నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ౯ మార్కణ్డేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |  తస్య మౄత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ ౧౦ శతావర్తం ప్రకర్తవ్యం సఙ్కటే కష్టనాశనమ్ | శుచిర్భూత్వా పఠేత్స్తోత్రం  సర్వసిద్ధిప్రదాయకమ్ ౧౧ మృత్యుఞ్జయ మహాదేవ త్

హయగ్రీవస్తోత్రం

Image
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది హయగ్రీవస్తోత్రం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం | నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ | తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః | వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| ఫలశ్రుతి : శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం | వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

గ్రహణం అంటే ?

గ్రహణం అంటే ? సముద్ర మథనం తర్వాత లభించిన అమృతం దేవదానవులకు పంచడానికి విష్ణువు మోహినీ అవతారంలో వస్తాడు. స్వభాను అనే పేరు కలిగిన దానవుడు దేవతల పంక్తిలో కూర్చుని అమృత సేవనకు ప్రయత్నిస్తాడు. దేవతలైన సూర్య, చంద్రులు స్వభాను అమృతం తాగడం గమనించి విష్ణు మూర్తికి తెలియజేస్తారు. విష్ణువు జరిగిన మోసాన్ని గమనించి స్వభాను తల ఖండిస్తాడు. అయినప్పటికి అమృతం తాగిన స్వభాను మరణించడు. తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా ఏర్పడతాడు. ఈ రాహు కేతువులు సూర్య చంద్రులకు శత్రువులైపోతారు.

సుబ్రహ్మణ్యాష్టకం

సుబ్రహ్మణ్యాష్టకం హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,  వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ || దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ || క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ || దేవాదిదేవ రథమండల మధ్య వేద్య, దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ | శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ || హారాదిరత్నమణియుక్తకిరీటహార, కేయూరకుండలలసత్కవచాభిరామ | హే వీర తారక జయాౙ్మరబృందవంద్య, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ || పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః, పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః | పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ || శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా, కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ | భక్త్వా

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానమ్

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ధ్యానమ్ గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం | సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలభిదం రుద్రతేజస్వరూపం | సేనాన్యం తారకఘ్నం గజముఖ సహజం కార్తికేయం షడాస్యం | సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి || షడ్వక్త్రం, శిఖివాహనం, త్రినయనం, చిత్రాంబరాలంకృతం, శక్తిం, వజ్రమసిం, త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకం ! పాశం కుక్కుట మంకుశం చ వరదం హస్తైర్దధానం సదా ధ్యాయేదీప్సిత సిధ్ధిదం శివసుతం స్కందం సురారాధితం  శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామాని జ్ఞానశక్త్యాత్మాః  స్కందః అగ్నిగర్భః బాహులేయః గాంగేయః శరవణోద్భవః కార్తికేయః కుమారః  షణ్ముఖః తారకారిః సేనానీః గుహః బ్రహ్మచారీ  శివతేజః క్రౌంచధారీ శిఖివాహనః శ్రీ వల్లీ దేవసేనా సమేత  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🕉🕉🕉🕉🕉🕉

హనుమత్ ధ్యాన శ్లోకాలు

*హనుమత్ ధ్యాన శ్లోకాలు*  *భజహనుమంతం మనసా స్మరామి నిజహనుమంతం శిరసానమామి* *ఆంజనేయం మహావీరం*  *బ్రహ్మవిష్ణుశివాత్మకం* *తరుణార్కప్రభోశాంతం*  *రామదూతం నమామ్యహమ్* *అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం* *దనుజవనకృశానమ్  జ్ణానినామాగ్రగణ్యం* *సకలగుణనిధానం వానరాణామధీశం* *రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి* *గోష్పదీకృతవారాశిం* *మశకీకృతరాక్షసమ్* *రామాయణమహామాలా* *రత్నంవందేనిలాత్మజం* *ఆంజనేయమతిపాటలాననం* *కాంచనాద్రి కమనీయవిగ్రహమ్* *పారిజాత తరుమూలవాసినమ్* *భావయామి పవమాన నందనమ్* *యత్ర యత్ర రఘునాథకీర్తనం* *తత్రతత్ర కృతమస్తకాంజలిమ్* *బాష్పవారి పరిపూర్ణలోచనమ్* *మారుతిం నమతరాక్షసాంతకమ్* *అంజనానందనం వీరం*  *జానకీశోకనాశనమ్* *కపీశ మక్షహంతారం*  *వందేలంకా భయంకరమ్* *ఉల్లంఘ్యసింధో స్ఫలిలంసలీలం* *యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః* *ఆదాయతేనైవ దదాహలంకామ్* *నమామి తంప్రాంజలింరాంజనేయమ్* *మనోజవం మారుతతుల్యవేగం* *జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్ఠమ్* *వాతాత్మజం వానరయూధముఖ్యం* *శ్రీ రామదూతం శిరసానమామి* *హనుమానంజనాసూనుః* *వాయుపుత్రోమహాబలః* *రామేష్టః ఫల్గుణశఖః* *పింగాక్షోమితవిక్రమః* *ఉధధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః* *లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్

శ్రీ శివ షడక్షర స్తోత్రం

పరమేశ్వరుని యొక్క శక్తివంతమైన శ్రీ శివ షడక్షర స్తోత్రాన్ని నేర్చుకుందాం.. ఓం న మః శి వా య   [ఓం] ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదంచైవ ఓం కారాయ నమో నమః [న] నమంతి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాహ నరా నమంతి దేవేశం న కారాయ నమో నమః [మ] మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణం మహాపాప హరం దేవం మ కారాయ నమో నమః [శి] శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం శివమేకపదం నిత్యం శి కారాయ నమో నమః [వా] వాహనం వృషభో యస్య వాసుకిః కంఠ భూషణం వామే శక్తిధరం దేవం వ కారాయ నమో నమః [య] యత్ర యత్ర స్థితో దేవహ సర్వవ్యాపీ మహేశ్వరః యో గురుః సర్వదేవానాం య కారాయ నమో నమః షడక్షరమిదం స్తోత్రం యః  పటేత్ శివ సన్నిదౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే శివ శివేతి శివేతి శివేతి వా భవ భవేతి భవేతి భవేతి వా హర హరేతి హరేతి హరేతి వా భజ మనః శివమేవ నిత్యం అందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు.. ఓం అరుణాచలేశ్వరాయ నమః

యమకృత శివకేశవ స్తుతి*

*యమకృత శివకేశవ స్తుతి*               గోవింద మాధవ ముకుంద హరే మురారే, శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే | దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౧ || గంగాధరాం ధకరిపో హర నీలకంఠ,  వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే | భూతేశ ఖండపరశో మృడ చండికేశ, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౨ || విష్నో నృసింహ మధుసూదన చక్రపానే, గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ | నారాయణాసుర నిబర్హణ, శార్ జ్గపానే, త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౩ || మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో, శ్రీకాంత పీతవసనాoబుదనీల శౌరే | ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ,  త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౪ || లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య,  శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే | ఆనందకంద ధరణీధర పద్మనాభ,  త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౫ || సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ, బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే | త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే,  త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౬ || శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే,  భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ | చానూరమర్దన హృషీకపతే మురారే ,  త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి || ౭ || శూలిన్ గిరీశ రజనీశకళావతoస, కంసప్రణాశన స