Posts

Showing posts from November, 2017

51.మన్వంతరము

 51.  మన్వంతరము పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.విషయ సూచిక [దాచు]  1 మన్వంతరాల పేర్లు 2 ఎన్నెన్ని సంవత్సరాలు? 3 ముఖ్య సంఘటనలు  3.1 స్వాయంభువ మన్వంతరము 3.2 స్వారోచిష మన్వంతరము 3.3 ఉత్తమ మన్వంతరము 3.4 తామస మన్వంతరము 3.5 రైవత మన్వంతరము 3.6 చాక్షుష మన్వంతరము 3.7 వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము 3.8 (సూర్య) సావర్ణి మన్వంతరము 3.9 దక్షసావర్ణి మన్వంతరము 3.10 బ్రహ్మసావర్ణి మన్వంతరము 3.11 ధర్మసావర్ణి మన్వంతరము 3.12 భద్రసావర్ణి మన్వంతరము 3.13 దేవసావర్ణి మన్వ

53.చతుర్దశ భువనాలు

53.చతుర్దశ భువనాలు హిందూ పురాణాలలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్‌పురుషుని (విశ్వరూపుని) శరీరంలోని అవయవాలుగా భావించారు. మహాభాగవతం రెంవ స్కంధంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది. మొత్తం పదునాలుగు లోకాలనీ, వాటిలో ఊర్ధ్వలోకాలు (పైనున్నవి) ఏడు, అధోలోకాలు (క్రిందనున్నవి) ఏడు అనీ చెబుతారు.విషయ సూచిక [దాచు]  1 లోకాల విభజన 2 ఊర్ధ్వలోకాలు 3 అధోలోకాలు 4 లోకాల తత్వం లోకాల విభజన లోకాల విభజన గురించి భాగవతంలో ఇలా చెప్పబడింది. బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి. తత్వ పదార్ధాల సూక్ష్మ, సూక్ష్మతర అవస్థలనుబట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి. క్రింది లోకాలకంటే పై లోకాలలో తత్వ పదార్ధాలు సూక్ష్మతరంగా ఉంటాయి. లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు, పదునాల్గని కొందరు అంటుంటారు. లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే మొదటి భావన ప్రకారం కటి(మొల)నుండి పైభాగం ఏడు అవయవాలుగా, క్రింది భాగం ఏడు అవయవాలుగా మొత్తం పదునాల్గులోకాలు. రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు, భువర్లోకం నాభి, సువర్లోకం హృదయం, మహర్లోకం ఉరోభాగం, జనలోకం కంఠం, తపోలోకం పెదవులు, బ్రహ్మలోకం మూర్ధంగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలు ర

58.స్త్రీ ధర్మము

58.స్త్రీ ధర్మము సమస్త నదులను శివునకు పరిచయము చేయుచున్న పార్వతి... పరమశివుడు పార్వతీ ! నా గురించి నేను చెప్తాను కదా ! మరి స్త్రీధర్మము గురించి నీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి అయ్యో ! నేను మీకు చెప్పగలదాననా ! మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు. కాని నన్ను కోరారు కనుక నేను చెప్పకుండా ఉండడం భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కాని నేను ముందు నన్ను ఎన్నడూ విడువకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమునా, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తమస మొదలైన నదులను మనసులో తలచుకుంది. వారు స్త్రీ స్వరూపములతో పార్వతి ముందు నిలిచారు. వారికి పరమేశ్వరుడు తనను స్త్రీ ధర్మము గురించి అడిగాడని తనకు ఎలా చెప్పాలో తెలియక మిమ్ము పిలిచానని తెలిపింది. వారు పార్వతీ ! నీ కంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు. నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు అమృతధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప

వివిధ రకాల గణపతులు - పూజలు - ఫలితాలు

వివిధ రకాల గణపతులు - పూజలు - ఫలితాలు 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 వివిధ గణపతులను పూజించటం వల్ల వచ్చే ఫలితాలు  ☘☘☘☘☘☘☘☘☘ 1. ఎర్ర చందనం గణపతి - అనారోగ్యం నుంచి విముక్తి. 2. ముత్యపు గణపతి - మానసిక ప్రశాంతత. 3. పగడపు గణపతి - రుణ విముక్తి. 4. మరకత గణపతి - వ్యాపారాభివృద్ధి. 5. చందనం గణపతి - ఉద్యోగం, సంఘంలో గౌరవం. 6. స్ఫటిక గణపతి - భార్యాపుత్రులతో సుఖజీవనం. 7. నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి. 8. సైకతశిల గణపతి - పీడల నుంచి విముక్తి. 9. శ్వేతార్క గణపతి - విఘ్న వినాశనం. నవగ్రహదోష నివారణ-వివిధ గణపతుల పూజలు ............ 1. రవి - ఎర్ర చందనం గణపతిని ఆదివారం పూజించాలి. 2. చంద్రుడు - వెండి, లేదా ముత్యం, లేదా పాలరాతి గణపతిని సోమవారం పూజించాలి. 3. కుజుడు - రాగి లేదా పగడం గణపతిని మంగళవారం పూజించాలి. 4. బుథుడు - మరకత గణపతిని బుథవారం పూజించాలి. 5. గురువు - బంగారు లేదా పసుపు లేదా చందనం గణపతిని గురువారం పూజించాలి. 6. శుక్రుడు - స్ఫటిక గణపతిని శుక్రవారం పూజించాలి. 7. శని - నల్లరాయి గణపతిని శనివారం పూజించాలి. 8. రాహువు - శాండ్‌స్టోన్‌ గణపతిని ఆదివారం పూజించాలి. ఎర్ర చందనం /రెడ్ స్టోన్

రాశుల వివిధ విభాగాములు.

రాశుల వివిధ విభాగాములు. చరరాశులుః,-  మేషం,కర్కాటకం, తుల, మకరం స్థిరరాశులుః-  వృషభం, సింహం, వృశ్చికం, కుంభం.    ద్విస్వభావరాశులుః- మిధునం,కన్య,ధనస్సు, మిానం హ్రస్వరాశులుః-  మేషం,వృషభం, కుంభం. సమరాశులుః-  మకరం,ధనస్సుమిధునం,మిానం, కర్కాటకం. దీర్ఘరాశులుః- వృశ్చికం,కన్యసంహం,తుల బేసి+ పురుషరాశులుః,- మేషం,మిధునం, సింహం,తుల,ధనస్సు, కుంభం. స్త్రీ+ సమరాశులుః-  వృషభం, కర్కాటకం, కన్య,వృశ్చికము,మకరం,మిానం తూర్పు సూచకములుః-  మేషం,సింహం, ధనస్సు దక్షిణముః-వృషభం, కన్య,మకరం పడమరః-మిధునం, తుల, కుంభము ఉత్తరముః-కర్కాటకము,వృశ్చికము, మిానము, దివాబలరాశులుః- సింహంము,  కన్య,తుల,వృశ్చికము,కుంభం,మిానం రాత్రి బలరాశులుః- వృషభం,మిధునం, కర్కాటకము,ధనస్సు,మేషం, మకరం. శీర్షోదయములుః- (మిానము,తప్ప ఇతర దివాబలరాశులు)  సంహం,కన్య,తుల,వృశ్చికం,కుంభం. పృష్టోదయములుః- (రాత్రిబలరాశులు) వృషభం,మిధునం, కర్కాటకం,ధనస్సు,మేషం,మకరం. ఉభయెాదయములుః- మిానము తనుభావమైబలము గలవిః-  కన్య,మిధునం,తుల,కుంభం,ధనస్సు,  (పూర్వభాగం) చతుర్థవమైబలముగలదిః- కర్కాటము,మకరం,(ఉత్తరభాగం) మిానము . సప్తమముగా బలము గలవిః-  వృశ్చికము దశమము

55.వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు

55.వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే శాంతులు వృద్ధాప్యంలో (మలివయసులో) జరిపే  శాంతులు పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము. కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి.  (భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః।(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః))  శ్లో॥ వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా ।      మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః ॥1॥      చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా।      మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః ।      అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః ॥2॥ వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...  1. వైష్ణవీ శాంతి ----50 వ సంవత్సరము  2. వారుణీ శాంతి ----55 వ సంవత్సరము  3. ఉగ్రరథ శాంతి ---60 వ సంవత్సరము  4. మృత్యుంజయ శాంతి ---65 వ సంవత్సరము  5. భౌమరథీ శాంతి ---70 వ సంవత్సరము  6. ఐంద్రీ శాంత

54.ఏకవింశతిమహాదోషములు - అపవాదములు

54. ఏకవింశతిమహాదోషములు - అపవాదములు 1. పంచాంగ శుద్ధిహీన - ఏష్యము, దుష్టగ్రహవేధ,క్రాంతులు, వైప్రా, అనుదోషములు గల రోజులు కాని బుధ, గురులు బలముగా నున్నచో దోషములు లేదు. 2. సూర్య సంక్రాంతి - రవి ప్రవేశమునకు 19 ఘడియలు ముందు వెనుకలు, మేష, కర్కాటక,తులా, మకర, సంక్రమణములకు ఆయన ప్రవేశములకు 30 ఘడియలుముందు వెనుకలు దోషము. 3. పాపషడ్వర్గలు - లగ్న, హోర, ద్రేక్కాణ, నవాంశ,ద్వాదశాంశ, త్రింశాంశల యందు పాపగ్రహములు లేకుండుట. 4. భృగుషట్కం - ఉచ్చంగతుడైన శుక్రుడు 6వ యింట ఉండకూడదు. శత్రునీచ స్థానములో అస్తంగతుడైన దోషము లేదు అని కొందరందురు. కాని, ప్రమాణములు కానరావు. 5. అష్టమకుజ - 8వ యింట కుజుడు ఉచ్చస్తుడైను కాకున్నను దోషమే శత్రునీచ అస్తంగతుడైన దోషము లేదు. 6. గండాంతము - 10 ఘ।।ల మధ్యమ 4-9 మధ్యమ 10-11 మధ్యమ 4ఘ।।లు తిథి గండదోషము. ఆశ్రేష, మఘ, జ్యేష్ట, మూల, రేవతి,అశ్వినుల మధ్య 4 ఘ నక్షత్ర గండదోషము. నంద తిథులకు ప్రారంభమున 2 ఘడియలు, పూర్ణ తిథులకు అంత్యమున 2 ఘడియలు గండాంతములగును. 7. రాశిగండదోషము - కర్కాటక, సింహ, వృశ్చిక,ధనుస్సు, మేష, మీన రాశుల మధ్య 4ఘడియలుచంద్ర గురులు శుభులైనచో ఈ దోషము బాధించదు. 8. కర్తరీ - లగ్

2018 మొదలైంది

2017 సంవత్సరానికి ముగిసింది. 2018 మొదలైంది. గడిచిన కాలం తిరిగి రాదు. గడవాల్సిన కాలానికి సిద్ధంకండి. పక్కా ప్రణాళికలు రూపొందించుకోండి. ఈ ఏడాది మీదే కావాలి. అన్నింటా విజయం సాధించాలి. భవిష్యత్తు గురించి  మీరు నిర్ధేశించుకున్న గమ్యం కోసం కృషి చేయండి. మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఆదాయం – 8 వ్యయం – 14 రాజపూజ్యం – 4 అవమానం – 3 ఈ ఏడాది వృత్తి వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శతృవులపై విజయం సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. స్నేహ, బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఏడాది 9 స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు. ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. 2018 రాశిఫలాల ప్రకారం, గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం తగ్గుతుంది, జూన్ తరువాత మీ విజయం రేటు పెరుగుతుంది. అయితే, మీకు

59.ఏలి నాటి శ‌ని ప్ర‌భావం

59.జాత‌క చ‌క్రంలో 12 రాశులు ఉంటాయని తెలిసిందే. అయితే ఆయా రాశుల్లో గ్ర‌హాలు ప్ర‌వేశించిన‌ప్పుడు గ్ర‌హ ప్ర‌భావం ప్రారంభ‌మ‌వుతుంది. ఇక శ‌ని గ్రహం 12, 1, 2 స్థానాల్లో ప్ర‌వేశిస్తుంది. అలా ప్ర‌వేశించిన‌ప్పుడు ఏలి నాటి శ‌ని ప్ర‌భావం ఉంటుంది. ఒక్కో స్థానంలో శ‌ని రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ఉంటాడు. అప్పుడు మొత్తం క‌లిపి ఏడున్న‌ర సంవ‌త్స‌రాలు అవుతుంది. అందుకే ఏలినాటి శ‌ని ప్ర‌భావం ఏడున్న‌ర సంవ‌త్స‌రాల పాటు ఉంటుంది. ఇలాంట‌ప్పుడు ఎవ‌రికైనా ప్రాణభయం, ధనం లేకపోవడం, అథ‌మ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి. శ‌ని ప్ర‌భావం త‌గ్గాలంటే ఎవ‌రైనా కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే... * విష్ణు సహస్ర నామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాలి. * ప్రతి శనివారం శని దేవునిని ఆరాధించాలి. * నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. * పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. * కాకుల‌కు ఆహారం పెడితే మంచిది * ఆవుల‌కు ఆహారం పెట్టాలి. న‌ల్ల చీమ‌ల‌కు చ‌క్కెర వేయాలి. * యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెట్టాలి. * ఈశ్వ‌రాధ‌న‌, హ‌నుమంతుడి ఆరాధ‌న చేసినా శ‌ని ప్ర‌భ

60.భార్యాభర్తలమథ్య విరోథము.

60.  భార్యాభర్తలమథ్య విరోథము. పూర్వజన్మకృతం పాపం "కళత్ర" రూపేణ భాథితం జాతకములో శుక్రుడు అనుకూలముగా ఉన్న జాతకురాలు ఇంట్లో అందరి పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు ఇతరులపట్ల వీరి ప్రవర్తన తీరుకు చాలా తేడా ఉంటుంది. మగ పిల్లలు ఏమడిగినా తర్వాత చూద్దాం, చేద్దాం అంత తొందర ఏమొచ్చింది అని ఎడ మొహము పెడ ముఖముగా సమాథానము చెపుతారు. కూతురు నాన్నా నాకు ఇది కావాలి అంటే ఎన్నిపనులైనా మానుకుని అ వస్తువును కొన్ని గంటల్లో వారిముందు ఉంచుతారు. కూతురు సంతోషముగా, ఆరోగ్యముగా ఉంటే వాళ్ళ మనస్సు, ప్రవర్తన కూడా ఆహ్లాదముగా ఉంటాయి. ఒకవేళ కూతురుకు ఏమైనా బాగాలేక పోవడము, చికాకుగా ఉండడము జరిగితే ఆ రోజుకు జనం దుంప తెగిందే, ప్యూన్ దగ్గర నుండి కలెక్టర్ వరకూ అందరినీ తిట్టడమే. చాలా తొందరగా స్పందిస్తారు. ఎవ్వరినైనా, ఎందరినైనా దూరం చేసుకుంటారు. ఏదైనాభరిస్తారు, కానీ కూతురు కంట కన్నీరు మాత్రం భరించలేరు. అతలాకుతలం అయిపోతారు. తండ్రిని, తల్లిని కాదని కూతురు ప్రేమ వివాహము చేసుకున్నా వీరు సహించి ఊరుకుంటారు. శుక్ర గ్రహము జాతకములో అనుకూలముగా ఉంటే ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. వీళ్ళ అతి ప్రేమ వల్ల కూతురుకి పెళ్ళి చేసిన తరువాత వ

61.గృహ వాస్తు

61. గృహ వాస్తు కాలానుగుణ "వాస్తు" అంటే?  జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఎదుగుతున్న ప్రాచీన భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో 'వాస్తు' ఓ విభాగం . కొన్ని సందర్భాల్లో ఇది జ్యోతిష్య శాస్త్రాన్ని సైతం అధిగమించి ఎదుగుతోందనడానికి నిదర్శనం, ఈ వాస్తు పట్ల దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణే అని చెప్పవచ్చు. . మారుతున్న కాలంతో పాటుగా భారతీయ వాస్తులో సైతం కొన్ని అధునాతనమైన మార్పులు ప్రయోగాత్మకంగా మార్చవలసి వస్తున్నా, వాటివల్ల జరిగే ప్రయోజనపు పాళ్ళు అధికంగా వుండటంతో, అటు ఆర్కిటెక్టులూ, ఇటు శాస్త్రీయ సిద్ధాంతులు సైతం వీటిని తమ నిర్మాణాల్లో అమలు పర్చేందుకు ముందుకు రావడం ఒక స్వాగతించవలసిన శుభపరిణామం. సాధారణంగా వాస్తులో ప్రధానమైనది నిర్ధిష్టమైన కొలతలతో కూడిన “ఆయముల” నిర్ణయం. ఇంటిలోని ఏయేదిక్కుల్లో, ఏ ఏ ఆయములు వుంటే ఎలా కల్సివస్తుందో చెబుతుందీ పద్ధతి. దీనినే పాశ్చాత్యులు 'బాగ్‌వా' అంటారు. ఇళ్ళు లేదా భవంతిని నిర్మించబోయే భూమిని అష్టదిక్పాలకులు పాలిస్తుంటారు. ఒకొక్క దిక్కునూ ఒకొక్క దేవత శాసించి, నియంత్రిస్తుంటుంది. తూర్పును ఇంద్రుడు, పడమరను వరుణుడు, ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి

జాతక చక్రం వేయడం

జాతక చక్రం వేయడం నక్షత్రాలు - రాశులు కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు. - అని పురాణ కథ ఈ క్రింద శ్లోకం నేర్చుకుంటే నక్షత్రాల పేర్లు, రాశుల పేర్లు పెద్ద కష్టపడకుండా నోటికి వస్తాయి. ఏనక్షత్రాలు ఎన్నో పాదం వరకు ఏ రాశిలో ఉన్నాయో చాలా సులభంగా గుర్తు ఉంటుంది. అశ్వని భరణి కృత్తికా పాదో - మేషం కృత్తికాత్త్రయం రోహిణి మ

63.ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి.

63. ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలి. కాక్ - సి.వో.సి (coc) అంటే ఏమిటి? వాస్తులో "కాక్" పదానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇంటిలో ఎంతో కాలంగా ఉపయోగించని వస్తువుల్ని ఏరిపారేసి ఆయా దిక్కుల్లోని పంచభూతాలకు పరిశుభ్రమైన గాలిని అందించే ప్రక్రియనే క్లియరింగ్ ఆఫ్ క్లట్టర్ (సి.వో.సి - coc - కాక్) అంటారు. ఇంటి ఆవరణ, వంటగది, పడక గదులను తప్పనిసరిగా ఈ ప్రక్రియతో ఎప్పుడూ క్లీన్ చేస్తూనే వుండాలి. అంటే అష్టదిక్పాలురకు నిరంతరం పంచభూతాలతో అనుసంధానం వుండేట్లు చేస్తూనే వుండాలన్నమాట. తూర్పులోని చెత్త అంటే పనికిరాని సామానులుంటే అది మీ పరువు ప్రతిష్టలపైనా, వృత్తి మీదా, డబ్బు పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. పడమరలోని చెత్త దరిద్రాన్ని, నీటి కొరతను, శరీరంలో డీహైడ్రేషన్‌ను కల్గిస్తుంది. దక్షిణంలోని చెత్త వల్ల అనారోగ్యం, ఉత్తరంలోని చెత్తవల్ల అధిక ఖర్చులూ, నైరుతీలోని చెత్తవల్ల నిద్ర పట్టకపోవడం, వాయవ్యంలోని చెత్తవల్ల పిల్లలు చదువులో వెనుకబడిపోవడం, ఈశాన్యంలోని చెత్తవల్ల దైవ కృపకు దూరం అయ్యి శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధ పడటం వంటివి సంభవిస్తాయి. ఏ గది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ? సైద్ధాంతికపరంగా ఏ గద

62.చర,స్ధిర,ద్విస్వభావ రాశులు

62. చర, స్ధిర, ద్విస్వభావ రాశు లు *చర, స్ధిర, ద్విస్వభావ  రాశులు . మేషం, కర్కాటకం, తుల, మకర రాశులు చర రాశులు.  *చర రాశులు:- చర రాసులలో జన్మించిన వారికి చురుకుదనం, శీఘ్ర గమనం, దైర్యం, సాహసం, కొత్త విషయాల యందు ఆసక్తి, పరిసరాలు, పరిస్ధితులు, వృత్తులు, దినచర్యలలో మార్పులు కోరుకుంటూ ఉంటారు. క్షణ కాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహము చూపుట, ఎప్పుడు తిరుగుతుండుట వీరి లక్షణాలు. * వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్ధిర రాశులు. *స్ధిర రాశులు:-స్ధిర రాశులలో జన్మించిన వారికి స్ధిరమైన అభిప్రాయాలు, సుఖ జీవనం, ఉన్న చోటును, ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడిచికొందురు. పొలం, గృహం, స్ధిరాస్తులపైనా మక్కువ చూపిస్తారు. పనులు కార్య రూపం దాల్చవలెనన్న వీరి సహాయం తీసుకొన్నచో పనులు కార్య రూపం దాల్చేదాకా నిద్రపోరు. మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. *మిధునం, కన్య, ధనస్సు, మీనం రాశులు ద్విస్వభావ రాశులు.  *ద్వి స్వభావ రాశులు:- ద్విస్వభావ రాశులలో జన్మించిన వారికి పలు అంశాలపైనా సమన్వయం ఉండును. వ్యాఖ్యాతలు, భోధన చేసేవారుగా రాణిస్తారు. సందేహాలు ఎక్కువ, సంకోచాలు ఎక్కువ, ఏ విషయాన్ని నిర్దారించలేరు. తొందరగా

వివాహానికి అనుకూలమైన వ్యక్తి ఎవరు?

వివాహానికి అనుకూలమైన వ్యక్తి ఎవరు? నూటికి నూరుపాళ్ళు మనకు అనుకూలమైన వ్యక్తికోసం వెదకడం అసంభవమైన విషయాల్ని ఆశించడమే.  వివాహంలో ఒడిదుడుకులు ఎందుకు ఎక్కువగా వస్తాయంటే మిగతా అన్నిటిలోకంటే ఈ అనుబంధంలో మీరు రెండవవ్యక్తితో చాలా విషయాలు పంచుకోవాల్సి వస్తుంది. సమస్య వివాహమూ కాదు, అది పురుషుడు గురించో, స్త్రీ గురించో, భర్తో, భార్యో కాదు. మీరు చాలా విషయాలు ఎవరితోనైనా పంచుకోవలసిన ప్రతి సందర్భంలోనూ ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూనే ఉంటారు.  వివాహంలోగాని, కలిసి సహజీవనం చెయ్యడంలోగని మీరు ఒకే స్థలాన్ని , ప్రతి వస్తువునీ కలిసి పంచుకోవాలి. పర్యవసానంగా, ప్రతిరోజూ, ప్రతీ క్షణం ఏదో ఒక విధంగా ఒకరి హద్దుల్లోకి రెండవవారు ప్రవేశించే పరిస్థితి వస్తూంటుంది. ఇతర అనుబంధాలలోనైతే, ఎవరైనా హద్దులుమీరి ప్రవర్తించినపుడు, మీరు దూరంగా జరిగిపోవచ్చు. ఇక్కడ మీకు అటువంటి అవకాశం లేదు. ఒకరి హద్దుల్లో మరొకరు ప్రవేశించడం ఎక్కువవుతున్నకొద్దీ, సంఘర్షణ ఎక్కువవుతుంటుంది. ఎంతో అందంగా జీవిస్తూ, ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమతో, ఒకరికొకరు ఆసరాగా జీవిస్తున్న దంపతులు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ అనుబంధం ఎంతో వికృతంగానూ పరిణమించగలదు. ద