Posts

Showing posts from June, 2023

మణి ద్వీప వర్ణన - 15*_

_*మణి ద్వీప వర్ణన - 15*_ 🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸🪸 *ఓం శ్రీ గణేశాయ నమః ,* *ఓం శ్రీ గురుభ్యో నమః* *ఓం శ్రీ పరామ్బికాయై నమః* అపారమైన పరమ జ్యోతి అమ్మ భువనేశ్వరీ తమ మధుర మైన వాక్కు తో పలుకాగానే , వీణా నాదాన్ని సహితము వెల-వెల పోయింది . ఆమె పలుకులు వీణా నాదము కన్న మిన్నగా ఉన్నయ్యి . ఆమెకు ఎందఱో సఖులు, దాసీలు. దేవతాస్త్రీలు. అఖిల దేవతల బృందము ఆమెను చుట్టు ముట్టి ఉన్నారు, అందరు ఆమె ఆజ్ఙ కొరకు వేచి ఉన్నారు. ఆ తల్లి ఇచ్చా శక్తి , జ్ఞాన శక్తి , క్రియా శక్తి చే సంపన్నురాలు. లజ్జ, తుష్టి, పుష్టి , కీర్తి , కాంతి, కీర్తి , క్షమా దయా, బుద్ధి మేధా,, ఇవన్ని మూర్తిభవించి అందరు అమ్మచెంత చేరాయి. జయా, విజయా, అజితా, అపరాజితా, నిత్యా , విలాసిని, దోగ్ధ్రీ అఘోరా, అమంగాళా ఇవి తొమ్మిది శక్తులు, భగవతి పరామ్బిక సేవ లో తత్పరులైయ్యి ఉంటారు . శంఖ నిధి, పద్మ నిధీ భగవతి కి పార్శ్వ భాగాన ఉన్నారు. పద్మ నిధి నవరత్న వహా, కాంచనసహత్ర ,సప్త దాతువహా, సంఘ్యక్, నదులు, ఈ ధాతువులనుండి ప్రవహిస్తాయి . ఇవన్ని వెళ్లి సుదాసగారములో కలుస్తాయి. ఈ విధముగా సమస్త శక్తులు కలిగి ఉన్నట్టి భువనేశ్వరీ దేవి , భువనేశ్వరుని తో కూడి ఉన్నది.” సర్వే

మణి ద్వీప వర్ణన - 02.

_*మణి ద్వీప వర్ణన - 02.*_ 🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗 *ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ శివ శక్త్యైక్య రూపిణ్యై నమః* పార్ట్ 1 లో ముందుగ అమృత సాగరము, తరువాత చతురస్రాకరముగా ఉన్నట్టి , లోహ ప్రాకారము, ఆపైన కాంస్య ప్రాకారము, ఆ తరువాత తామర ప్రాకారము అందులో వసంతుడు తమ ఇద్దరు పత్నుల సమేతుడిగా నివసిస్తుంటాడు . సుందరమైన శోభలతో ఉన్నట్టి ఈ వనము కో కిలల నినాదము తో గుంజిత మై ఉన్నది  తామ్ర ప్రాకారము , తరువాత వచ్చేది గాజు ప్రాకారము , దీని ఎత్తు ఏడు యోజనాలు . ఈ రెండు ప్రాకారాల మధ్యన సంతాన వాటిక ఉంది .ఇందులో అన్నిరకాల వృక్షాలు ఉన్నాయి. ఈ వనములోని పుష్పాల సౌరభము పది యోజనాల వరకు ఉంది . నిరంతరుముగా వికసించే ఈ పూవ్వులు, సువర్ణమయ కాంతులచే శోభిల్లుతున్నాయి . అమృతముచే నిండిన రసాల పలాలు , ఎంతో మధురముగా ఉంటాయి . ఈ వాటికకు స్వామి గ్రీష్మ ఋతువు . అతనికి ఇద్దరు భార్యలు . శుక్ర శ్రీ , శుచి శ్రీ . ఇక్కడ సంతాపమును కలిగినట్టి ప్రాణులు ఈ నీడలో తల దాచుకొని సేద తీరుతుంటారు . ఇక్కడి మూల - మూలలో సిద్ధ పురుషులు ఉంటారు . ఎల్లప్పుడూ సిద్ధ పురుషులు మరియు , దేవతలు తో నిండి ఉంటుంది క్షేత్రము . రాజా! ఈ గాజు ప్రాకారమును

మణి ద్వీప వర్ణన 01.*_

_*మణి ద్వీప వర్ణన 01.*_ 🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅 *ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః, ఓం పరామ్బికాయై నమః* జనమేజయుడు , వ్యాసులవారిని ఓకే ప్రశ్న అడిగాడు , మహాముని !జగదంబ కథామృతము , చాల ఆదరణీయము . మహిషాసురుణ్ణి చంపినా తరువాత మహాలక్ష్మి ఎటు వెళ్ళింది ? అని , వైకుoఠానికా? లేక సుమేరు గిరికా ? ఆ తల్లి ఎటు వెళ్లినట్టు ? అని అడుగగా, " మణి ద్వీపము, అత్యంత రమణీయము, అమ్మవారికి అది క్రీడా స్థలము , అక్కడకు వెళ్ళగానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు స్త్రీగా మారవలసి వచ్చింది. మళ్ళీ పురుషత్వము పొంది, తమ కార్యాలలో నిమగ్నులయ్యారు. ఆ పరమ దామము అమృత సాగరము మధ్యన ఉన్నది. అక్కడ జగదంబా తీరు తీరు రూపాలలో విచరణ చేస్తుంది. దేవతలు స్తుతింఛిన అనoతరము అమ్మ కల్యానరూపిని అచటికే విచ్చేసింది . ఆమె మాయా శక్తి , మరియు సనాతన. ఆ దివ్య స్థలము లో అవిరామముగా కీర్తనలు జరుగుతుంటాయి . బ్రహ్మ లోకానికి పైన సర్వలోకం ఉంది , అదే మణి ద్వీపము. ఈద్వీపమున కు ఉన్నంత సౌందర్యము మరి ఏ ద్వీపానికి లేదు .  అన్ని ద్వీపాలు, మణి ద్వీప సంరక్షణ లో ఉన్నాయి . ఆ ద్వీపానికి నలు మూలలా అనేకానేక యోజనాల వరకు అమృత సాగరము ఉన్నది . అక్కడ వీచే చల్లని గాలి ,

Finger Astrology

*_Finger Astrology_* : మనిషి చేతులపై ఉండే గీతలే కాదు, శరీరంలోని వివిధ భాగాలు కూడా చాలా విషయాలు తెలియజేస్తాయి. శరీర ఆకృతి, రూపం, రంగు మన వ్యక్తిత్వం గురించి సమాచారాన్ని అందిస్తాయి. పొడవాటి చెవులు ఉన్నవారు అదృష్టవంతులని, పొడవాటి గోళ్లు ఉన్నవారు తెలివైనవారు అని పెద్దలు అంటుంటారు. శరీరంలోని అన్ని భాగాలలో చేతుల వేళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.  వేళ్ల ఆకృతిని బట్టి వ్యక్తి ఎలాంటి రోగాల బారిన పడతారో, ఎలాంటి వ్యక్తిత్వం ఉందో తెలుసుకోవచ్చు.   *నిటారుగా వేళ్లు* ఉన్న చేతిని ఉత్తమంగా పరిగణిస్తారు. ఇటువంటి వ్యక్తులు తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంట. వీరి పనిలో తక్కువ అడ్డంకులు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.   *వంకర వేళ్లు* నేరుగా వేళ్ల కంటే వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. కానీ, అరచేతి రేఖలు ఖచ్చితంగా ఉంటే, వంకర వేళ్లు ఉన్న వ్యక్తుల చర్యలు విప్లవాత్మకమైనవి. ఇలాంటి వారికి రహస్య వ్యాధులు ఉండవచ్చు.   *పొట్టి వేళ్లు ఉన్నవారు* హాట్-టెంపర్‌గా ఉంటారు. ఈ కారణంగా వారు అధిక రక్తపోటు, గుండె జబ్బులకు గురవుతారు. - పొడవాటి వేళ్లు ఉన్నవారు వ్యాధులకు సున్నితంగా ఉంటారు. కాబట్టి వారికి త్వరగా వ్యాధులు

వారణాసి కాశీ వైభవం :---

వారణాసి కాశీ వైభవం :--- కాశీవైభవాన్ని పూర్తిగా తెలపడం దేవతలకు కూడా సాధ్యం కాదు సముద్రం నుండి నీటి బిందువు లాంటి సంక్షిప్త సమాచారం. కాశీపట్టణం గొడుగు లాంటి పచ క్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశి బ్రహ్మదేవుని సృష్టి లోనిది కాదు. విష్ణు మూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచ సాంస్కృతిక నగరం. స్వయంగా శివుడు నివాసముండే నగరం. ప్రళయ కాలంలో మునుగని అతి ప్రాచిన పట్టణం శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశిని పైకెత్తి కాపాడతాడు.  కాశి భువి పైన సప్త మోక్ష ద్వారాలలో ఒకటి, కాశి పన్నెండు జోతిర్లింగాలలో కెల్లా శ్రేష్ఠమైనది. పద్నాలుగు భువన బాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు బైరవుడు జీవిని కాశి లోనికి అనుమతించడు. కాశి లో మరణించిన వారికీ యమ బాధ పునర్జన్మ ఉండదు. కాశిలో ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రాగుప్త

కాల సర్పదోషం గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది.

కాల సర్పదోషం ఏదైనా మిగతా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. 🔵 సహజ శుభగ్రహాలు గురువు, పాపులతో కలవని బుధుడు శుక్రుడు అలాగే పాపత్వం పొందని చంద్రుడు వీరిలో ఏ గ్రహమైనా బలంగా ఉంటే కాలం సర్పదోషం బాధించదు.  🔵 కాల సర్ప దోషం కల్గించే రాహు కేతువులు యోగ కారక గ్రహంతో కలిసినా లేదా యోగ కారక గ్రహ నక్షత్రాలలో ఉంటే కూడా కాలసర్పదోషం ప్రభావం ఉండదు.   ♦️కాల సర్పదోషం దేశ గోచారానికి ఎక్కువగా చూడాలి అని చెప్పబడినప్పటికి జాతకులమీద కొంత ప్రభావం చూపిస్తోంది అని ఋజువు అయింది ఏ కాలం సర్పదోషం అయినా పరిహారాలు చేసుకోవాలి ఎందుకంటే ఈ యోగం గురు చండాల యోగం కంటే ప్రమాదకరం. పరిహారాలు ఒక్కో కాల సర్పదోషానికి ఒక్కో విధంగా మారుతున్నాయి మొత్తంగా అన్నింటి ముఖ్యంగా పరిహారం గమనిస్తే  పంచాక్షరి మంత్రాన్ని 21×108 ప్రతిరోజూ పఠించాలి.  మహా మృత్యుంజయ మంత్రం 1,25000 పఠించాలి. శివుని కాలసర్ప మహాపూజలో జంట సర్పాలు గల 11వెండి ప్రతిమలు  పాలు, పెరుగు, పంచదార చందనం, గంగాజలం బియ్యం, బిల్వ పత్రం, 21తెల్ల జిల్లేడు పూలు, 21తామరపూలు, పండ్లు శివునికి సమర్పించాలి.   స్నానానంతరం నవగ్రహ స్తోత్త పారాయణ చేయాలి.  ఇలా శక్తి కొద్దీ స్వామిని సేవిస్తే ఈ

శ్రీ కృష్ణా నది వెoబడి గల అనేక పుణ్య క్షేత్రాలు.

శ్రీ కృష్ణా నది వెoబడి గల అనేక పుణ్య క్షేత్రాలు.🙏🏻 Part-1 పంచభూతాలలో ఒకటి అయిన నీరు అతి ముఖ్యమైనది. ఏ నదిలో యోగులు, దేవతలు, యతులు గుప్తంగాఉంటూ, మహనీయులను సేవిస్తూ, సేవించడానికి తపన పడుతారో, ఏ నదిలో స్నానం చేయడానికి మానవులై జన్మించి సాధన చేయడానికి యోగులు కూడా తపన పడతారో ఆ నదీమ తల్లి యే కృష్ణమ్మ తల్లి. ముందు కృష్ణ (పురుష రూపం) గా జన్మించి తరువాత కృష్ణ వేణి (స్త్రీ)గా మారుతుంది. కొన్ని నదులు హిమాలయలలో పుడితే, కొన్ని నదులు కొండలలో పుడతాయి. వాటిని ద్వీపకల్ప నదులు అంటారు. కృష్ణానది అటువంటిదే. భారత దేశంలో 4 వ అతి పెద్ద నది. సముద్రం నుంచి సుమారు 4,300 అడుగుల ఎత్తున జన్మించిన ఈ నది అనేక పుణ్యక్షేత్రాలకు, సాధకులకు, యోగులకు ఆలవాలం అయి పునితం చేస్తూ ప్రవహిస్తోంది. తనలో మొత్తం 14 ఉపనదులను వివిధ ప్రాంతాల్లో కలుపుకుని శాంతి వాహిని అయింది. శ్రీ కృష్ణా నది సహ్యాద్రి పర్వత ప్రాంతంలో శ్రీ క్షేత్ర మహాబళేశ్వర్ దగ్గర కృష్ణ మందిరం సాక్షిగా జన్మించి, 1,400 కిలో మీటర్ల దూరం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ గుండా పయనించి ఆంధ్ర ప్రదేశ్ లోని హంసలదీవి వద్దమరలా సంతాన వేణుగోపాల స్వామి (శ్రీ కృ

హిందూ ఆలయ సమాచారం*🙏

*హిందూ ఆలయ సమాచారం*🙏                                             *ద్వాదశ జ్యోతిర్లింగాలు*  గుజరాత్ – సోమనాథ్,✓  ఆంధ్రప్రదేశ్ – శ్రీశైలం,✓ మధ్యప్రదేశ్ – మహాకాలేశ్వర్,✓ మధ్యప్రదేశ్ – ఓంకారేశ్వర్✓ జార్ఖండ్ -భైద్యనాధ్√ మహారాష్ట్ర – భీమశంకర్, తమిళనాడు – రామేశ్వరం,✓ గుజరాత్ – నాగేశ్వర్.✓ ఉత్తరప్రదేశ్ – కాశీవిశ్వనాధ్,✓ మహారాష్ట్ర – త్రయంబకేశ్వర్,  ఉత్తరాఖండ్ – కేదారేశ్వర్✓,  మహారాష్ట్ర – ఘృష్నేశ్వర్.                                                                                            *అష్టాదశ శక్తిపీఠాలు*   శ్రీలంక – శాంకరీదేవి, కాంచీపురం – కామాక్షి✓, ప్రద్యుమ్నం – శ్రుంఖలాదేవి, మైసూరు –చాముండి, అలంపురం – జోగులాంబ శ్రీశైలం – బ్రమరాంబిక✓, కొల్హాపూర్ – మహాలక్ష్మి, మాహూర్ – ఏకవీర, ఉజ్జయిని - మహాకాళి,✓ పిఠాపురం – పురుహూతిక ✓   జాజిపూర్ – గిరిజాదేవి✓, ద్రాక్షారామ – మాణిక్యాంబ,✓ గౌహతి – కామాఖ్య, ప్రయాగరాజ్ – మాధవేశ్వరి✓, అరుణాచలప్రదేశ్ –వైష్ణోదేవి,✓ గయ – సర్వమంగళ✓, వారణాశి – విశాలాక్షి✓, కాశ్మీర్ – సరస్వతి                                         *

జ్యోతిషశాస్త్ర విషయములు*....

*జ్యోతిషశాస్త్రము నందు ముఖ్యమైన విషయములు*.... (1)జాతకునికి లగ్నాధిపతి మహా దశ లో విజయము,భోగభాగ్యములు వృద్ధియగుట,విదేశీయానము,వాహన సౌఖ్యము కలుగుట.(2)ద్వితీయాధిపతి మహార్దశ లో ధనవృద్ధి,కుటుంబవృద్ది,సంపదలు పెరుగుట జరుగును.కానీ మారక దోషము కూడా కలుగ గలదు. (3)జాతకునకు తృతీయాధిపతి దశ లో సోదర లాభములు,కనిష్ట భాతృవృద్ది,కొలదిగా దేహ అనారోగ్యములు,ధైర్య సాహసములు,కర్ణ రోగములు కలుగ గలవు (4)జాతకునకు చతుర్ధాధిపతి దశ లో గృహములు,వాహనములు,మాతృసౌఖ్యము,విద్యాభివద్ధియు కలుగ గలదు. (5)జాతకునకు పంచమాధిపతి దశ లో సంతానవృద్ధి,దేవతారాధన,తీర్ధయాత్రలు మొదలగునవి జరుగును. (6)జాతకునకు షష్టమాధిపతి దశ లో రోగములు,శతృవృద్ధి,ఋణములు మెుదలగునవి జరుగును (7)జాతకునికి సప్తమాధిపతి దశ లో వివాహము,కళత్ర సౌఖ్యము,స్త్రీ సౌఖ్యము ప్రాప్తించును. (8)జాతకునికి అష్టమాధిపతి దశ లో కష్టములు,నష్టములు,మనోవిచారములు,అపవాదులు,ధనము కోల్పోవుట,సౌక్యహీనత కలుగును. (9)జాతకునికి నవమాధిపతి దశ లో భాగ్యవృద్ధి,తీర్థయాత్రలు,విదేశీ ప్రయాణములు,దేవతోపాసన కలుగ గలవు. (10)జాతకునికి దశమాధిపతి శ లో ఉద్యోగప్రాప్తి,ఉద్యోగాభివృద్ధి,తల్లిదండ్రులకు కర్మ చేయుట జరుగ గలవు. (11)జా

లగ్నంలో చంద్రుడు ఉంటే ఫలితాలు

లగ్నంలో చంద్రుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు  లగ్నంలో చంద్రుడు ఉంటే గుండ్రని ముఖం, దట్టమైన జుట్టు, సున్నితమైన మనస్సు, బిడియం, సౌమ్యం, మానసికమైన సమస్యలు ( ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో), ఆటుపోటులు, కంటివ్యాది, మానసిక వ్యాది (అంతర్గత జబ్బు, ఎడమ చెవి ప్రాబ్లం, మాట త్వరగా రాకపోవటం( నత్తి), ధనానికి ప్రాబ్లం ఉండదు.  లగ్నంలో కుజుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు  లగ్నంలో కుజుడు ఉంటే దూకుడుతనం, కలర్ తక్కువ కలిగి ఉంటారు, ముఖంపై మచ్చలు ఉండటం, దెబ్బలు తగలటం, జన, సోదర సహకారం కలిగి ఉండటం, క్రీడలలో రాణింపు, గట్టిగా మాట్లాడటం, వివాదాలు కలిగి ఉండటం, త్వరగా కోపం రావటం, ఇతరులను నిందించటం, కొట్టటం, చెడు అలవాట్లకు బానిస కావటం జరుగుతుంది. లగ్నంలో బుధుడు ఉంటే కలిగే సాదారణ ఫలితాలు  లగ్నంలో బుధుడు ఉంటే తెలివితేటలు కలిగి ఉంటారు. అతితెలివి కూడా కలిగి ఉండటం. మంచి వస్త్రాలు ధరిస్తారు. చక్కని భాష కలిగి ఉంటారు. లెక్కలలో రాణిస్తారు. ప్రతి విషయాన్ని అంచనా వేస్తారు. వాక్ శుద్ధి కలిగి ఉంటారు. రాయబారాలు నెరవేరుస్తారు. కమ్యూనికేషన్ రంగంలో రాణిస్తారు. ఇతరులు ఏది చెబితే వింటారో అది చెప్పగలగటం, లాజిక్ గా తెలివిగా మాట్లాడి జన

medulla and cranial nerves

The medulla and cranial nerves Your cranial nerves (which come in pairs and use Roman numerals to set them apart) that pass through your medulla include the following: Cranial Nerve (CN) IX: Your ninth cranial nerve handles many of the functions of your mouth. These include activating the glands that make saliva (spit) and your ability to taste and feel things inside of your mouth. It also controls your gag reflex, which keeps you from accidentally choking on objects. CN X: Your 10th cranial nerve, known as the vagus nerve, is one of the most important nerves in your body. It connects to all the major organs from your neck to the top part of your colon, transmitting signals for your autonomic nervous system. These are signals you don’t think about, and they manage your heart rate, intestinal movements and more. This nerve also carries signals for muscles of your larynx (voice box) and the muscles you use to swallow. CN XI: Your 11th cranial nerve controls muscles on your neck and upper

medulla oblongata

Your medulla oblongata (med-oo-la ob-long-ah-ta), often just called the medulla, is a key part of your nervous system. It’s key not only because of its location but also because of what it controls. Some of its jobs include: Manages heart, circulation and breathing. Your medulla is where your cardiovascular and respiratory systems link together into a united system that controls your heart rate, breathing, blood pressure and more. Manages other automatic processes. These are things that your body often does without you having to think about them. Some examples include coughing, sneezing, swallowing, vomiting and maintaining your balance. Nerve connections. The vast majority of major nerves converge at your spine, carrying signals to and from your brain. That means those signals must pass through your medulla. Four of your 12 cranial nerves (which connect areas of your throat and tongue directly to your brain) pass through your medulla. Crossover point. your medulla is the location of a

12 cranial nerves

Your 12 cranial nerves each have a specific function. Experts categorize the cranial nerves based on number and function: 1.Olfactory nerve: Sense of smell. 2.Optic nerve: Ability to see. Oculomotor nerve: Ability to move and blink your eyes. 3.Trochlear nerve: Ability to move your eyes up and down or back and forth. 4.Trigeminal nerve: Sensations in your face and cheeks, taste and jaw movements. 5.Abducens nerve: Ability to move your eyes. 6.Facial nerve: Facial expressions and sense of taste. 7.Auditory/vestibular nerve: Sense of hearing and balance. 8.Glossopharyngeal nerve: Ability to taste and swallow. 9.Vagus nerve: Digestion and heart rate. 10.Accessory nerve (or spinal accessory nerve): Shoulder and neck muscle movement. 12.Hypoglossal nerve: Ability to move your tongue

గణపతి తత్వం

*గణపతి శరీరంలోని ప్రతిఅంగము ఒక్కొక్క తత్త్వానికి సంకేతం* *సాకారం నుంచి నిరాకారం వైపు.....* ‘‘ఆదౌ పూజ్యో గణధిపః’’ అని ఆర్యోక్తి. ఏపూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం. ‘‘శుక్లాంబరధరం విష్ణుం   శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’ ఈ శ్లోకం దేవతార్చనా సమయాన ముందుగా గణపతి ప్రార్థనగా స్తుతిస్తూంటాము. గమ్మత్తేంటంటే ఈ శ్లోకాన్ని ఆమూలాగ్రం పరిశీలించినా అందులో ఎక్కడా గణేశుని పేరు ప్రస్తావింపబడలేదు. కాని,శ్వేతవస్తమ్రులను ధరించినవాడు, రక్షకుడు, చంద్రకాంతి వంటి దేహచ్ఛాయ కలవాడు; చతుర్భుజుడు, ప్రసన్న వదనుడైన ఆ దేవదేవుణ్ణి సర్వవిఘ్నముల నాశనమునకై పూజిస్తూన్నాను అనే అర్థమునకు పై శ్లోకం ద్వారా తెలుస్తోంది. కానీ శబ్దార్థరీత్యా ‘ప్రసన్నము’ అనే పదానికి ఏనుగు అనే అర్థం ఉంది. దీనిని బట్టి ‘ప్రసన్న వదనుడు’ అంటే ‘ఏనుగు ముఖం’ కలవాడన్న అర్థాన్ని అన్వయిస్తే ఇది గణేశ స్తుతి అని తెలుస్తుంది. పెద్ద పొట్ట; చేటల్లాంటి చెవులు; చిన్న కళ్ళు; ఏకదంతము మొదలైన వాటిని కల్గి ఉన్న గణపతి కేవలం ఆకారంలోనే కాదు అర్థం చేసుకోవడానిక్కూడా వింత దేవుడేనని పైశ్లోకాన్ని బట్టి చెప్పవచ్చు. మన భారతీయ భక్తితత్పరతల

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వాకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానం || వామే కరే వైరిభీతం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకం | దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 || సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినం సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 || ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 || సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే || 4 || ఆధివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 || సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తుతే || 6 || వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 7 || రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 || కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే జలే స్థలే తథాకాశే వాహ

21-6-2023 అతిపెద్ద పగటి రోజు

🚩21-6-2023 అతిపెద్ద పగటి రోజు🌴 ♦13 గంటల 7 నిమిషాల పాటు పగలు గుడివాడలో తొలి సూర్యోదయం నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది. ®చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది. ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం. ♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో

వివాహం తర్వాత విజయాన్ని అందించే 5 యోగాలు

వివాహం తర్వాత విజయాన్ని అందించే 5 యోగాలు  1. 7వ అధిపతి 10వ ఇంట్లో ఉండి, శుక్రుడు త్రికోణం లేదా చతుర్భుజంలో ఉంటే, స్థానికుడు కార్యాలయంలో అసాధారణమైన మార్గదర్శకత్వం పొందే అవకాశం ఉందని సూచిస్తుంది.  2. 7వ గృహాధిపతి మరియు 4వ గృహాధిపతి నక్షత్రంలో శుక్రుడు మరియు 11వ అధిపతి ఉన్నప్పుడు, వివాహానంతరం స్థానికుడు ఆనందాలు మరియు ప్రతిఫలాలను అనుభవించే అవకాశం ఉందని సూచిస్తుంది.  3. బృహస్పతి తులారాశిలో లేదా 7వ ఇంట్లో ఉంటే, స్థానికుడు భగవంతుని నుండి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉందని మరియు భాగస్వామ్యంలో ఉన్నప్పుడు వారి గత మంచి పనుల యొక్క ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉందని సూచిస్తుంది.  4. చంద్రుడు/4వ ప్రభువు మొదటి ఇంటికి అనుసంధానించబడినప్పుడు మరియు అదే సమయంలో, శుక్రుడు/7వ అధిపతి 5వ ఇంట్లో ఉంచబడినప్పుడు, స్థానికుడు వారి జీవితంలో శ్రద్ధ వహించే వ్యక్తిని కలిగి ఉన్న తర్వాత శక్తివంతమైన స్థానాన్ని పొందుతారని సూచిస్తుంది. వారి గురించి.  5. 7వ అధిపతి చంద్రుని నుండి చతుర్ధంలో ఉండి, చంద్రుడు లగ్నానికి చతుర్ధంలో ఉంటే, ఈ యోగం తమను తాము మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సాంగత్యంపై ఆధారపడి ఉంటుందని చూపిస్తుంది.

శని బుధుల ప్రభావం

Saturn gives success after a lot failure, struggles and Testing. While Mercury Gives Success through Cheating, Cleverness and Shortcuts. Slow success builds character. Fast success build ego. శని చాలా వైఫల్యాలు, కష్టాలు మరియు పరీక్షల తర్వాత విజయాన్ని ఇస్తాడు.  కాగా  బుధుడు మోసం, తెలివి మరియు సత్వరమార్గాల ద్వారా విజయాన్ని ఇస్తాడు.  నెమ్మది విజయం పాత్రను నిర్మిస్తుంది. వేగవంతమైన విజయం అహంకారాన్ని పెంచుతుంది.

Mars Dosha in Astrology*

*Mars Dosha in Astrology*  Mars is a planet associated with energy, action, aggression, and passion. In astrology, the Mars dosha refers to certain positions of Mars in the birth chart that can cause challenges or obstacles in a person's life. The Mars dosha may lead to problems such as anger, conflict, accidents, and health issues. However, there are also certain factors that can lessen the negative effects of the Mars dosha, including: Mars in its own house.  Mars in a favorable aspect to Jupiter  Mars in Jupiter or its own navamsa  A different placement of Mars in the Bhav chalit chart.  Mars' dispositior being well-placed and connected to a strong Jupiter The placement of Mars' star lord is in Good Condition and connectedt to Jupiter. Additional information about Mars' Various Conjunctions When Mars is in conjunction with Rahu, it can create a condition known as Kuja Stambhan, where Rahu blocks the energy of Mars. This can lead to a lack of drive and motivation, as

స్తాన హాని కరో జీవః స్తానవృద్దికరో శని 2

జీవ క్షేత్రే యథా శని:| శని క్షేత్రే యథా జీవ:|| స్థాన హాని కరో జీవః| స్థానవృద్దికరో శని:|| స్తాన హాని కరో జీవః స్తానవృద్దికరో శని ఏ జాతకం లోనైనా శని ఉన్న స్థానం ఖచ్చితంగా వృద్ది చెందుతుంది. అలాగే గురువు ఉన్న స్థానం మాత్రం ఎంతో కొంత దెబ్బతింటోంది కానీ గురువు సప్తమ దృష్టి కూడా దాంపత్యంలో సమస్య సృష్టిస్తోంది.  గురువు సప్తమ దృష్టి మాత్రం ఇబ్బందులు సృష్టిస్తోంది అనే విషయం కళత్ర విషయంలో చాలా జాతకాలలో ప్రూవ్ అవుతోంది కళత్రం మాత్రం డబుల్ చేస్తున్నాడు. శని తాను కూర్చున్న ఇంటికి శుభఫలితాలను, అంశ కలిగిన గృహాలకు అశుభ ఫలితాలను ఇస్తుందనేది నిజమేనా, బృహస్పతికి ఈ సందర్భం వైషమ్యా?  లేదు, ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. శని లగ్నం ప్రకారం ఫలితాన్ని ఇస్తుంది. నా విషయానికొస్తే, నాకు సింహరాశితో 3వ ఇంట్లో మిథున లగ్నం మరియు శని ఉన్నాయి. 5 వ ఇంటిపై శని యొక్క 3 వ దృష్టి (విద్య మరియు పిల్లల ఇల్లు), 9 వ ఇంట్లో 7 వ దృష్టి, అనగా. 12వ ఇంటిపై అదృష్టం మరియు 10వ దృష్టి అంటే ఖర్చుల ఇల్లు. మీరు మీ నియమాలను నా చార్ట్‌లో వర్తింపజేస్తే, శని శత్రు రాశిలో కూర్చోవడం వల్ల ఈ గృహాలకు సంబంధించిన అన్ని విషయాలు నాశనం అవుతాయని మీరు చెప

స్తాన హాని కరో జీవః స్తానవృద్దికరో శని

జీవ క్షేత్రే యథా శని:| శని క్షేత్రే యథా జీవ:|| స్థాన హాని కరో జీవః| స్థానవృద్దికరో శని:|| స్తాన హాని కరో జీవః స్తానవృద్దికరో శని ఏ జాతకం లోనైనా శని ఉన్న స్థానం ఖచ్చితంగా వృద్ది చెందుతుంది. అలాగే గురువు ఉన్న స్థానం మాత్రం ఎంతో కొంత దెబ్బతింటోంది కానీ గురువు సప్తమ దృష్టి కూడా దాంపత్యంలో సమస్య సృష్టిస్తోంది.  గురువు సప్తమ దృష్టి మాత్రం ఇబ్బందులు సృష్టిస్తోంది అనే విషయం కళత్ర విషయంలో చాలా జాతకాలలో ప్రూవ్ అవుతోంది కళత్రం మాత్రం డబుల్ చేస్తున్నాడు. For expert comments plz look this article Is it true that Saturn gives good results for the house that it sits in and bad results for the houses that it aspects, and the case is vice verse for Jupiter? No, it's not always true. Saturn gives result as per Ascendant. In my case, I have Gemini Lagna and Saturn in 3rd house with Leo sign. Saturn's 3rd drishti on 5th house (house of education and children), 7th drishti on 9th house I.e. house of luck and 10th drishti on 12th house i.e. house of expenses. If you simply apply your rules on my cha

కాన్సర్ అంటే మరణ కంతి.

కాన్సర్ అంటే మరణ కంతి. మానవ శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మితమవుతుంది సాధారణంగా కణజాలాలు పెరిగి విభజన చెందుతాయి. ఆ విభజన కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటం అవసరం. కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది శరీరానికి అవసరం లేకపోయినా కొత్త కణాలు ఏర్పడతాయి. పాప కణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా కణాల సముదాయం కంతి లాగా లేక గడ్డలాగా ఏర్పడతాయి. దీనినే కాన్సర్ అంటారు. మరణ కంతి అని కూడా అంటారు. కొన్ని గడ్డలు అపాయ కరమైనవి కాదు. వీటిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించవచ్చు. అపాయకరమైన కంతుల విషయానికొస్తే వీటిలోని కణాలు అసాధారణంగా విభజన చెందుతూ పోతాయి. ఇవి తమ చుట్టూ ఉన్న కణజాలంలోకి చొచ్చుకుపోతాయి. వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు కంతుల నుండి విడిపోయి దూరంగా రక్తస్రావంలోకి లేదా శోషరస వ్యవస్థలోకి చేరుతాయి. ఈ క్యాన్సర్ వ్యాధి ఆకస్మికంగా వచ్చే వ్యాధి. ఇది ప్రాణాంతకమైనది.మరణానికి దారితీస్తుంది. వీటికి జ్యోతిష కారణాలు యోగాలు పరిశీలిస్తే ♦️రాహు లగ్నంలో గానీ చంద్రుడితో గానీ స్థితి నొందితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరో భావాధిపతి లగ్నంలో గానీ 8 వ భావంలో గానీ 12 వ భావంలో

అపరాజిత పృచ్చ నుండి

ఓం శ్రీమాత్రేనమః  అపరాజిత పృచ్చ నుండి ఆగ్నేయ ప్లవకా భూమి రగ్నిదాహ భయావహా శత్రు సంతాపదా నిత్యం కలిదోఽగ్ని ప్లవః స్మృతః  ఇంటికి చుట్టూ ఉన్న స్థలం లో ఆగ్నేయ దిశ పల్లంగా ఉంటే భయము, అగ్ని ప్రమాదములు, శత్రువులు, సంతాపము పాపకృత్యములు చేయుట వంటి ఫలితములు కలుగుతాయి. ధన హానికరో నిత్యం రోగకృద్దక్షిణ ప్లవః నశ్యంతి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి దక్షిణం పల్లముగా ఉన్న భూమి ధనహాని రోగములు కలిగించును. ఆ ఇంట్లో పురుషులు మరణిస్తారు. అటువంటి స్థలంలో దేవాలయం కూడా రాణించదు ప్రవర్తయేద్గృహే పుంసాం రోగాంశ్చ మృత్యుదాయకాన్ ధనహాని స్తథా నిత్యం కురుతే నైఋతి ప్లవా నైఋతి పల్లము నిత్యం ధనహాని, రోగములు, అపమృత్యువును ఇస్తుంది. పశ్చిమ ప్లవకా భూమి ర్థనధాన్య వినాశనీ శోక దాహ్యం కులం తత్ర యత్ర భూః పశ్చిమ ప్లవా  పడమర పల్లము గల భూమి ధన ధాన్యములను నాశనము చేయను నిరంతర శోకమును కుల నాశనమును కలిగించును. శత్రుకర్త్రీ విరాగేచ గోత్రక్షయ కరీతథా గృహే కన్యకా హంత్రీ సదా దుఃఖ భయావహా  భుక్తం న జీర్ణ్యతే తస్య మహ్యాం తత్రీతు యోవసేత్ ఏతాన్ దోషానావహతి దోషదా వాయు దిక్ప్లవా వాయువ్యం పల్లమైతే శత్రుత్వము, విరాగత్వము గోత్రక్షయము , సదా దుఃఖము, భయము

మిస్టరీ నగరం - శంబాలా నగరం...........!!

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 మిస్టరీ నగరం - శంబాలా నగరం...........!! హిమాలయాలు భారత దేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి.  అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు  దాగి ఉన్నాయి. అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి.  ఉత్తరాన హిమాలయాలు,  దక్షిణాన నల్లమల అడవులు  ఇంతవరకు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు.  వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి అని పెద్దవాళ్ళు చెబుతారు. . అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది  "శంబాలా " నగరం.  మన పురాణాలు తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో "యతి రూపంలో ఉన్నట్టు తెలుస్తుంది.  ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంధాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే  బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాలలో ఉంది.  దాని పేరే " శంబాలా "  దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ" అంటారు. ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట  ఆ నగరం ఉంది.  అది అందరకి కనిపించదు.  అది కనిపించాలన్న, చేరుకోవాలి అన్నా మనం  ఎంతో శ్రమించ

రసవాద విద్య - మూలికలతో బంగారం చేయు విద్య

రసవాద విద్య - మూలికలతో బంగారం చేయు విద్య           ప్రాచీన కాలంలో వనమూలికలు తోను, పాదరసంతోను కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ప్రతీతి. 10 వ శతాబ్దంలో కృత్రిమంగా బంగారం రూపొందించే ప్రక్రియ వ్యవహారంలో ఉండేది. 11 వ శతాబ్దంలో ఆల్బెరూని అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడ సిద్దులు బంగారం తయారుచేసేవారని పేర్కొన్నాడు నాగర్జునికి ముందు, తరువాత కూడా ఎన్నో గ్రంథాలలో బంగారం తయారుచేసే పద్దతులు, ప్రస్తావనలు ఉన్నాయి. దేశంలో కరువుకాటకాలు సంభవించినప్పుడు రసాయనాచార్యులు కృత్రిమంగా బంగారం తయారుచేసేవారు అని ఆ బంగారం వల్ల ప్రజలు ఆకలిచావుల నుంచి రక్షించబడే వారు అని అనేక గ్రంథాలలో ఉంది.                   రాగి మొదలయిన చవుక లోహాలని సువర్ణంగా మార్చే విద్యని రసవాద విద్య అని అంటారు. కొన్ని ప్రదేశాలలో " స్వర్ణ కరణి " పగార విద్య అని కూడా అంటారు. ఈ విద్యని ఉర్దూ భాషలో " కీమియా " అని, ఇంగ్లీషు భాషలో "ఆల్కెమీ " అని అంటారు. ఆధునిక పరిశోధకులు బంగారం పదార్దం కదా! దానిని సృష్టించుట యేమి అంటారు. పిచ్చి అనికూడా అంటారు.           రసవాద విద్య ప్రకారం నీచ లోహాన్ని ఉత్తమలోహంగా మార